యుక్రెయిన్లోని జాఫోరిజియా న్యూక్లియర్ ప్లాంట్ పై జరిగిన దాడి పట్ల విచారం వ్యక్తం చేసిన భారత్
యుక్రెయిన్ లోని జాఫోరిజియా న్యూక్లియర్ ప్లాంట్లో ఇంధన స్టోరేజీ కేంద్రం పై జరిగిన బాంబు దాడి పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. న్యూక్లియర్ కేంద్రాలకు ప్రమాదం వాటిల్లకుండా ఇరు దేశాలు చూడాలని ఐక్యరాజ్యసమితి భారత్ రాయబారి రుచిర కాంభోజ్ కోరారు.
ఆమె భద్రతా మండలి సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
యుక్రెయిన్లో నెలకొన్న పరిస్థితి పట్ల భారత్ విచారం వ్యక్తం చేస్తోంది. ఈ పోరు మొదలైనప్పటి నుంచి యుద్ధానికి అంతం పలకమని భారత్ పిలుపునిస్తూ వస్తోంది. ఈ పోరును అంతం చేసేందుకు జరుగుతున్న అన్ని దౌత్యపరమైన చర్యలన్నిటినీ భారత్ సమర్ధిస్తోందని రుచిర చెప్పారు.
జాఫోరిజియా న్యూక్లియర్ ప్లాంట్ పై గురువారం జరిగిన దాడికి యుక్రెయిన్రష్యాను నిందించింది.
మరో వైపు, రష్యా ఈ దాడికి యుక్రెయిన్లోని నిందించింది.
జాఫోరిజియా న్యూక్లియర్ ప్లాంట్ యూరప్లో విద్యుత్తును ఉత్పత్తి చేసే అతి పెద్ద పవర్ ప్లాంట్.
ఈ ప్లాంటుకు సంబంధించిన ఆఫిసును, ఫైర్ స్టేషన్ పై ఇప్పటి వరకు 10 సార్లు దాడి చేసినట్లు ఇరు పక్షాలు చెప్పాయి.
ఈ దాడి పట్ల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కూడా విచారం వ్యక్తం చేసింది. ఇదొక దారుణమైన సమయమని వర్ణించింది.
ఈ దాడులు విధ్వంసానికి దారి తీయవచ్చని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గూటియెరెజ్ అన్నారు.
"యుద్ధం మొదలైనప్పటి నుంచి భారత్ ఈ పోరును, హింసను అంతం చేయాలని పిలుపునిస్తూనే వస్తోంది. ఇరు దేశాల మధ్య జరుగుతున్న పోరును అంతం చేసేందుకు జరుగుతున్న దౌత్యపరమైన చర్యలన్నిటినీ సమర్థిస్తామని చెబుతోంది.