ఆస్ట్రేలియాతో మ్యాచ్లో భారత్ విజయం.. టీ20 సిరీస్ కైవసం
ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ను భారత్ చేజిక్కించుకుంది.
కీలకమైన మూడో మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. హైదరాబాద్లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది.
187 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
భారత్ జట్టులో సూర్య కుమార్ యాదవ్ 69, విరాట్ కోహ్లీ 63 పరుగులు సాధించారు.
అంతకుముందు భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు, భువనేశ్వర్ కుమార్, చాహల్, హర్షల్ పటేల్లు తలో వికెట్ తీశారు.
ఈ మ్యాచ్ విజయంతో భారత్ 2-1తో టీ20 సిరీస్ కైవసం చేసుకుంది.