ఆసియా కప్: శ్రీలంక చేతిలో భారత్ ఓటమి
ఆసియా కప్-2022లో శ్రీలంక చేతిలో భారత్ ఓడిపోయింది.
టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది.
రోహిత్ శర్మ 41 బంతుల్లో 72 పరుగులు చేయగా సూర్యకుమార్ యాదవ్ 29 బంతుల్లో 34 పరుగులు చేశాడు.
గత రెండు మ్యాచుల్లో అర్ధ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, ఈ మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. శ్రీలంక బౌలర్లలో దిల్షన్ మధుషంక మూడు వికెట్లు తీశాడు.
శ్రీలంక ఈ లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది.
పథుం నిస్సంక 52, కుశాల్ మెండిస్ 57 పరుగులు చేయగా శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక 33 పరుగులు చేశాడు.
వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోయిన టీం ఇండియా, ఆసియా కప్ నుంచి దాదాపుగా వైదొలగ నుంది.