You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

SCO సదస్సు: భారత్-రష్యా సంబంధాల బలోపేతంపై పుతిన్‌తో చర్చించిన ప్రధాని మోదీ

ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సమర్‌కండ్ చేరుకున్నారు. ఆయనకు భారత దౌత్యాధికారులు స్వాగతం పలికారు.

లైవ్ కవరేజీ

  1. "శ్రీనగర్‌లో ప్రతి శుక్రవారం జామియా మసీదును ఎందుకు తెరవడం లేదు?" - అసదుద్దీన్ ఒవైసీ

    కశ్మీర్ లెఫ్టినేట్ గవర్నర్ మనోజ్ సిన్హా మంగళవారం కశ్మీర్‌లో మల్టీప్లెక్స్ తెరిచారు. వీటిని కశ్మీర్ యువతకు అంకితమిస్తున్నట్లు మనోజ్ సిన్హా ప్రకటించారు.

    మల్టీప్లెక్స్‌లను తెరవడం పై ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ట్విటర్ వేదికగా స్పందించారు.

    ట్విటర్ ద్వారా ఆయన మనోజ్ సిన్హాను ప్రశ్నించారు.

    "షోపియన్, పుల్వామాలో సినిమా హాళ్లు తెరిచారు. కానీ,ప్రతి శుక్రవారం శ్రీనగర్‌లోని జామియా మసీదును ఎందుకు మూసేస్తున్నారు? అని ప్రశ్నించారు. కనీసం శుక్రవారం మ్యాటినీ షో వేస్తున్న సమయంలోనైనా మసీదును మూయకండి" అని ట్వీట్ చేశారు.

  2. మార్కెటింగ్ సంస్థల చేతికి మీ వివరాలు చిక్కకుండా ఈ సెట్టింగ్స్‌తో తప్పించుకోవచ్చు - డిజిహబ్

  3. కశ్మీర్‌లో తొలి మల్టీప్లెక్స్ ప్రారంభం

    కశ్మీర్ ప్రజలు సుమారు మూడు దశాబ్దాల తర్వాత బిగ్ స్క్రీన్ పై సినిమాలను చూసేందుకు అవకాశం కలుగుతోంది. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మంగళవారం కశ్మీర్‌లో తొలి మల్టీప్లెక్స్ ను ప్రారంభించారు.

    జమ్మూ కశ్మీర్‌లో కొత్త సినిమా విధానాల రూపకల్పనతో ఇక్కడ సినిమాల చిత్రీకరణ పెరిగింది. భవిష్యత్తులో రాష్ట్రంలో ఫిల్మ్ సిటీ కూడా నిర్మిస్తామని మనోజ్ సిన్హా తెలిపారు. ఇందుకోసం భూమిని కూడా కేటాయించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ ప్రచురించింది.

  4. పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను జర్మనీలో విమానం నుంచి ఎందుకు ‘దించేశారు’? విపక్షాల ప్రశ్న

  5. నోయిడాలో గోడ కూలి నలుగురు మృతి

    నోయిడాలోని సెక్టర్ 21లో ఉన్న జల్ వాయు విహార్ సొసైటీలోని గోడ కూలి నలుగురు వ్యక్తులు మరణించారు. మరో 9 మందికి గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

    ఎన్ డిఆర్ ఎఫ్, అగ్నిమాపక దళాలు రక్షణ చర్యలు చేపడుతున్నట్లు ఏఎన్ ఐ వార్తా సంస్థ ప్రచురించింది.

    సొసైటీ ప్రహరీ గోడను ఆనుకుని ఉన్న డ్రైనేజీ మరమ్మతు పనులు కొనసాగుతున్న సమయంలో ఈ గోడ కూలిపోయింది. దీంతో అక్కడ పని చేస్తున్న కూలీలు ప్రాణాలు కోల్పోయినట్లు గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా మేజిస్ట్రేట్ ఎల్ వై సుహాస్ చెప్పారు.

    ఈ ఘటన పట్ల ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి విచారాన్ని వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి తగిన చికిత్స చేయాలని ఆదేశించారు.

    ఈ ఘటన పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

    ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ మేయర్ లతోవీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ దేశంలో భవనాలు కూలిపోవడం, అగ్నిప్రమాదాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

  6. సాజిద్ మీర్ : ముంబయి పేలుళ్ల నిందితుడిని ఐరాస బ్లాక్ లిస్ట్‌లో పెట్టకుండా చైనా ఎందుకు అడ్డుకుంటోంది

  7. న్యూయార్క్‌లో భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జై శంకర్

    ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొనేందుకు ప్రపంచంలో వివిధ దేశాల నాయకులు న్యూ యార్క్ చేరుకుంటున్నారు.

    భారత్ తరుపున విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్ ఈ సమావేశంలో పాల్గొంటారు.

    ఈ సమావేశంలో రష్యా యుక్రెయిన్ పై చేస్తున్న దాడి ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముంది.

    ఈ సమావేశానికి రష్యా, చైనా దేశాధినేతలు హాజరు కావడం లేదు. ఆ దేశాల నుంచి విదేశాంగ మంత్రులు ప్రాతినిధ్యం వహించనున్నారు.

    ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 77వ సమావేశానికి సబా కరోసీ అధ్యక్షత వహిస్తున్నారు. ఎస్ జై శంకర్ కరోసీతో సమావేశమయ్యారు.

    ఈ సమావేశంలో జనరల్ అసెంబ్లీ సమావేశ ప్రాధాన్యతలకు భారత్ మద్దతు ప్రకటిస్తుందని ఎస్ జై శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా భారత్ బహుళపాక్షిక విధానానికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎస్ జైశంకర్ ట్వీట్ చేసారు.

    ఈ పర్యటనలో భాగంగా ఎస్ జై శంకర్ సెర్బియా, క్యూబా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, ఇండోనేషియా, ఈజిప్ట్, మాల్టా, ఆల్బేనియా, ట్రినిడాడ్, టొబాగో, విదేశాంగ శాఖ మంత్రులను కూడా కలిశారు.

  8. అంతరిక్షంలో 437 రోజులు గడిపిన రష్యన్ వ్యోమగామి వలేరీ పోల్యాకోవ్ మృతి

    అంతరిక్షంలో 437 రోజులు గడిపిన రష్యన్ వ్యోమగామి వలేరీ పోల్యాకోవ్ మరణించినట్లు రష్యా అంతరిక్ష సంస్థ ప్రకటించింది.

    ఆయన వయసు 80ఏళ్ళు.

    ఆయన 1994-1995 మధ్యలో మీర్ స్పేస్ స్టేషన్ లోభూమి చుట్టూ 7000 సార్లు పరిభ్రమణం చేస్తూ 437 రోజులు గడిపారు.

    మార్స్ లాంటి గ్రహాలకు దూర ప్రయాణం చేసినప్పుడు వ్యోమగాములు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోగలరో లేదోననే విషయాన్ని ఆయన పరిశీలించారు.

    14నెలల పాటు చేసిన ఈ ప్రయత్నంలో ఆయన గ్రాహక శక్తికి ఎటువంటి హాని జరగలేదని ఫలితాలు తెలిపాయి.

    ఆయనకు సోవియెట్ యూనియన్ హీరో, యూ ఎస్ ఎస్ ఆర్ పైలట్ వ్యోమగామి అనే బిరుదులు ఉన్నాయి.

    మానవ శరీరానికి అంతరిక్షంలో కూడా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోగలిగే సామర్ధ్యం ఉంటుందని పోల్యా కోవ్ చేసిన పరిశోధన తేల్చిందని అంతరిక్ష సంస్థ రాస్ కాస్మాస్ టెలిగ్రామ్ పోస్ట్ లో పేర్కొంది.

    పోల్యాకోవ్ 1942లో తులాలో మాస్కోలో జన్మించారు.

    ఆయన తొలుత వైద్యం అభ్యసించి, తర్వాత వ్యోమగామిగా మారారు.

    ఆయన1988 ఆగస్టులో తొలిసారిగా అంతరిక్ష ప్రయాణం చేపట్టి 8నెలలు కక్ష్యలో ఉన్నారు.

    ఆరేళ్ళ తర్వాత అత్యధిక కాలం అంతరిక్షంలో గడిపి రికార్డు నెలకొల్పారు. ఇప్పటికీ ఈ రికార్డును మరొకరు అధిగమించలేదు.

    1986లో మీర్ అంతరిక్ష కేంద్రాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

  9. ఆస్కార్స్ 2023: ఆర్ఆర్ఆర్‌కు నిరాశ.. భారత్‌ నుంచి అధికారిక ఎంట్రీగా గుజరాతీ చిత్రం ‘ఛెల్లో షో’

  10. లద్దాఖ్‌లో చైనా నిబంధనలకు భారత్ తల వంచాల్సి వస్తోందా

  11. ట్రాక్టర్ కొనడానికి మహీంద్రా ఫైనాన్స్ నుంచి రుణం తీసుకున్న తండ్రి.. రికవరీకి వచ్చి గర్భిణిని కారుతో తొక్కించిన ఏజెంట్లు - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

  12. తెలంగాణ: అపరిచితుడికి బైకుపై లిఫ్ట్ ఇస్తే ఇంజెక్షన్‌తో హత్య? ఖమ్మం జిల్లా పోలీసులు ఏమంటున్నారు?

  13. సత్యేంద్ర జైన్ కేసు విచారణ పై స్టే ఆదేశించిన దిల్లీ కోర్టు

    దిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ పై మనీ లాండరింగ్ ఆరోపణలకు సంబందించి బెయిల్ పిటిషన్ విచారణ పై స్టే ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది.

    సత్యేంద్ర జైన్ కేసును మరొక జడ్జీకి బదిలీ చేయమంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అప్పీలు చేసింది.

    ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అభ్యర్ధన మేరకు ఈ కేసులో నిందితులందరికీ రౌస్ అవెన్యూ కోర్టు జిల్లా జడ్జి నోటీసు జారీ చేశారు.

    ఈ కేసు విచారణను కోర్టు సెప్టెంబరు 30కి వాయిదా వేసింది.

    ఏమి జరిగింది?

    ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సత్యేంద్ర జైన్ నివాసంలో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో ఈడీ భారీగా నగదు, బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతోంది.

    హవాలా లావాదేవీలకు సంబంధించి ఈడీ సత్యేంద్ర జైన్ ను అరెస్టు చేసింది.

    సత్యేంద్ర జైన్ అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు ఆగస్టు 25, 2017లో సీబీఐకేసు నమోదు చేసింది. ఈ ఎఫ్ ఐ ఆర్ ఆధారంగా

    ఈడీ కూడా సత్యేంద్ర జైన్ పై కేసు నమోదు చేసింది.

    సత్యేంద్ర జైన్ నాలుగు సంస్థల్లో పెట్టుబడి పెట్టిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేకపోయారని ఈడీ వాదిస్తోంది.

    సత్యేంద్ర జైన్ అధీనంలో దిల్లీ వైద్య ఆరోగ్య శాఖ,ఇంధనం, పబ్లిక్ వర్క్స్, పరిశ్రమలు, నగర అభివృద్ధి, వరదలు, జలవనరుల శాఖ కూడా ఉన్నాయి.

  14. ఫరీద్‌కోట్ సంస్థానం: సుమారు రూ.20వేల కోట్ల ఆస్తి వివాదం- సుప్రీంకోర్టులో ఎలా పరిష్కారమైంది, నకిలీ వీలునామాలు ఎలా గుర్తించారు?

  15. కిర్‌గిజ్‌స్తాన్- తజికిస్తాన్ సరిహద్దు ఘర్షణలు - 94 మంది మరణం

    కిర్‌గిజ్‌స్తాన్ - తజికిస్తాన్ సరిహద్దుల్లో చోటు చేసుకున్న ఘర్షణల్లో కనీసం 94 మంది మరణించారు. ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న ఘర్షణల్లో ఇవి దారుణమైనవి.

    శుక్రవారం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడానికి ముందు బుధవారం ఇరు దేశాల మధ్య ఘర్షణలు తలెత్తాయి.

    మాజీ సోవియెట్ రిపబ్లిక్ లో భాగమైన ఈ రెండు దేశాల మధ్య తరచుగా సరిహద్దు ఘర్షణలు చోటు చేసుకుంటూ ఉంటాయి.

    దేశాల మధ్య నెలకొన్న వైరుధ్యాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు.

    ఇరు దేశాలకు మధ్య సుమారు 1000 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇందులో మూడొంతుల సరిహద్దు గురించి తరచూ వివాదం చోటు చేసుకుంటూ ఉంటుంది.

    2021లో సరిహద్దుల్లో నెలకొన్న ఘర్షణల వల్ల ఇరు దేశాల మధ్య ఊహించని పోరాటానికి దారి తీసింది. ఈ ఘర్షణల్లో సుమారు 50 మంది మరణించారు. ఇటీవల జరిగిన ఘర్షణల్లో సుమారు 100 మంది మరణించారు. మృతుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశముంది.

    తజికిస్తాన్‍కు చెందిన 35 మంది పౌరులు మరణించగా, కనీసం 20 మందికి గాయాలైనట్లు ప్రకటించింది.

    అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో ఇరు దేశాలు శుక్రవారం కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నాయి.

  16. చైనా తైవాన్ పై దాడి చేస్తే అమెరికా తైవాన్ పక్షాన నిలుస్తుంది - జో బైడెన్

    ఫ్రాన్సెస్ మావో

    బీబీసీ న్యూస్

    చైనా తైవాన్ పై ఊహించని దాడి చేస్తే అమెరికా తైవాన్ కు అండగా నిలుస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.

    ఆయన సీబీఎస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. అమెరికా సేనలు తైవాన్ ను రక్షిస్తాయా అని ప్రశ్నించినప్పుడు, అవునని సమాధానం చెప్పారు.

    ఈ ప్రకటన చేసి తైవాన్ పట్ల అమెరికా విధానాన్ని చాటుకున్నారు.

    తైవాన్‌కు అమెరికా రక్షణ కల్పించే విషయం ఎప్పుడూ వ్యూహాత్మక అనిశ్చితితో కూడుకుని ఉంటుంది.

    బీజింగ్ తైవాన్‌ను తమ దేశంలో అంతర్భాగంగా భావిస్తుంది.

    అమెరికా తైవాన్ ను ప్రత్యేక దేశంగా గుర్తించలేదు. ఈ దేశంతో దౌత్యపరమైన సంబంధాలేవీ లేవు కానీ తైవాన్ సంబంధాల చట్టాన్ని అనుసరించి తైవాన్‌కు ఆయుధాలను సరఫరా చేస్తుంది.

    తైవాన్ స్వీయ రక్షణ కోసం ఆ దేశానికి అవసరమైన ఆయుధ సంపత్తిని సమకూర్చాలని అమెరికా వాదిస్తుంది.

  17. లద్దాఖ్ లో4.3 తీవ్రతతో భూకంపం

    లద్దాఖ్ లో4.3 తీవ్రతతో భూకంపం ఏర్పడింది.

    ఈ భూకంపం కార్గిల్ కు 64కిలోమీటర్ల దూరంలో సోమవారం ఉదయం 9.30నిమిషాలకు సంభవించింది.

    ఈ భూకంప తీవ్రత భూమిలో 10కిలోమీటర్ల లోతులో ఏర్పడినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది.

  18. బీజేపీలో చేరిన పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్

  19. ఓనం బంపర్ లాటరీలో రూ.25 కోట్లు గెలుచుకున్న ఆటోడ్రైవర్, ట్యాక్స్ పోగా ఆయన చేతికొచ్చేది ఎంత?

  20. కింగ్ కోబ్రా: మనుషుల ప్రాణాలు కాపాడుతోందా?