You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

35 ఏళ్ల కాలానికి రైల్వే భూముల లీజు... ‘ఆదాయం పెంచుకునేందుకే’

ప్రధానమంత్రి గతి శక్తి విధానంలో భాగంగా రైల్వే భూములను 35ఏళ్ల కాలానికి లీజుకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

లైవ్ కవరేజీ

  1. దసరా కానుకగా సింగరేణి ఉద్యోగులకు రూ.368 కోట్లు

    సింగరేణి ఉద్యోగులకు దసరా కానుకగా రూ.368 కోట్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

    అంటే 2021-22 సంవత్సరానికి సింగరేణి కాలరీస్ సాధించిన లాభాల్లో 30శాతాన్ని ఇందుకు కేటాయించనున్నారు.

  2. ‘పాకిస్తాన్ జిందాబాద్’ అన్న యువతిని రాహుల్ హత్తుకున్నారా?

  3. కన్నతల్లికి మళ్లీ పెళ్లి చేసిన కూతురు

  4. దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌‌కు ఎంపికైన ఉమేశ్ యాదవ్, శ్రేయస్ అయ్యర్

    సౌతాఫ్రికాతో నేటి నుంచి జరగనున్న టీ20 సిరీస్‌ టీ ఇండియా జట్టులో ఉమేశ్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, షాబాజ్ అహ్మద్‌కు చోటు లభించింది.

    టీం ఇండియా జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్-కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్‌ప్రీత్ బూమ్రా, ఉమేశ్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, షాబాజ్ అహ్మద్

  5. పేరు, డబ్బు అన్నీ ఉన్నా సిల్క్ స్మిత ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డారు?

    ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సిల్క్ స్మిత చనిపోయి 26 ఏళ్లు. కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో ఆమె ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డారు? సినిమాల్లోకి రాకపోయుంటే ఏం కావాలనుకున్నారు?

  6. అమరావతి పాదయాత్ర: రైతుల ఉద్యమమా, రాజకీయ పోరాటమా

  7. ‘ఇరాన్ హిజాబ్ వ్యతిరేక నిరసనల్లో 76 మంది మరణం’

    ఇరాన్‌లో ‘హిజాబ్’కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రదర్శనల్లో ఇప్పటి వరకు భద్రతా దళాల చేతిలో 76 మంది చనిపోయారని నిరసనకారులు తెలిపారు.

    అయితే 41 మంది చనిపోయినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా చెబుతోంది.

    హిజాబ్ నిబంధనలు ఉల్లంఘించిందనే నేరంతో ఒక యువతిని కొద్ది రోజుల కిందట అరెస్టు చేయగా కస్టడీలో ఆమె మరణించింది.

    నాటి నుంచి హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చెలరేగుతున్నాయి.

  8. మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి మృతి

    సినీనటుడు మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి, నేటి ఉదయం మరణించారు.

    70 ఏళ్ల వయసున్న ఇందిరా దేవి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

    ఒకనాటి సినీనటుడు కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి. కృష్ణ, ఇందిరా దేవి దంపతులకు రమేశ్ బాబు, మహేశ్ బాబు, మంజుల, పద్మావతి, ప్రియదర్శిని సంతానం.

    రమేశ్ బాబు ఈ ఏడాది జనవరిలో చనిపోయారు.

    సినీనటుడు చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు ఇందిరా దేవి మృతికి సంతాపం తెలిపారు.

  9. INd vs SA: రాహుల్, సూర్యకుమార్ అర్ధసెంచరీలు.. తొలి టీ20లో దక్షిణాఫ్రికాపై 8 వికెట్లతో భారత్ గెలుపు

  10. PFI: ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’ను నిషేధించిన కేంద్రం

  11. ‘ఖలిస్థాన్ రిఫరెండం’ ఎంత తీవ్రమైనది? కెనడాలో స్థిరపడిన భారతీయులు ఏమంటున్నారు

  12. కౌన్ బనేగా కరోడ్‌పతి: మొట్టమొదట కోటి రూపాయలు గెలిచిన వ్యక్తి ఎవరు... ఇప్పుడు ఏం చేస్తున్నారు

  13. ‘ఆయుధాలు కొనడమనేది పూర్తిగా మా ఇష్టం’

    ఆయుధాలు కొనడమనేది పూర్తిగా భారత ప్రయోజనాల మీద ఆధారపడి ఉంటుందని విదేశాంగ శాఖ మంత్ర ఎస్.జైశంకర్ అన్నారు.

    ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో భేటీ అయ్యారు.

    ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన అమెరికా, భారత్ బంధాల బలోపేతానికి కలిసి పని చేస్తామని అన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదంలో ఎదుర్కోవడంలో అమెరికా నుంచి భారత్‌కు మంచి మద్దతు లభించందని అందుకు ధన్యవాదాలు తెలిపారు.

  14. నటి ఆశాపరేఖ్‌కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

  15. Mushroom Farming: ‘తక్కువ పెట్టుబడితో ఇంట్లోనే చేసుకునే బిజినెస్ ఇది, ఆదాయానికి ఢోకా లేదు’

  16. మేడిన్ ఇండియా ఐఫోన్లు: చైనా నుంచి భారత్‌కు మారిన కొత్త ఐఫోన్ల తయారీ.. యాపిల్ ప్రకటన

  17. గుజరాత్: ఆవులను ప్రభుత్వ కార్యాలయాల్లోకి తోలుతున్నారు.. వాటి మూత్రం, పేడను ఆఫీసుల్లో వేస్తున్నారు.. ఎందుకు?

  18. షింజో అబే అంత్యక్రియలకు హాజరైన మోదీ.. అధికారికంగా అంత్యక్రియలను జపాన్ ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

  19. మన జీవితం వేరొకరి గేమ్‌లో భాగమా, ఆ గేమ్‌ను మనం ఎప్పటికీ ఆపలేమా?

  20. ‘నాన్న వదిలేశాడు. మా అమ్మ లివర్ ఫెయిల్ కావడంతో నాది డొనేట్ చేశాను. కానీ, మా అమ్మ.. ’