దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ కార్యాలయాపై
జరగుతున్న దాడులకు ఆపరేషన్ ఆక్టోపస్ అని కేంద్రం దర్యాప్తు సంస్థ పేరు పెట్టింది.
పలు
నగరాలలో ఈ సంస్థకు చెందిన కార్యాలయాలో
సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ, పలు డాక్యుమెంట్లును, డబ్బును, కొన్ని ఆయుధాలను స్వాధీనం
చేసుకున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.
మరోవైపు దేశ రాజధాని దిల్లీలో అరెస్టైన
పీఎఫ్ఐ కార్యకర్తలను విచారించేందుకు 7 రోజుల కస్టడీకి దిల్లీలోని ఈడీ
కోర్టు అనుమతించింది.
మరోవైపు దేశవ్యాప్తంగా ఈ సంస్థ కార్యాలయాలు, నేతలపై జరిపిన దాడుల్లో చాలా అభ్యంతరకరమైన అంశాలు దొరికాయని జాతీయ దర్యాప్తు సంస్థ పేర్కొంది.
పీటీఐ ప్రకారం, ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో సమర్పించిన రిమాండ్ నివేదికలో ఈ కేసుకు సంబంధించిన 10 మందిని ఎన్ఐఏ కస్టడీకి కోరింది.
దర్యాప్తు సంస్థ నమోదు చేసిన కేసులలో పేర్కొన్న ప్రకారం, లష్కరే తోయిబా, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్)లో చేరడానికి యువతను పీఎఫ్ఐ ప్రేరేపిస్తోంది.
"భారతదేశంలో ఇస్లామిక్ పాలనకు కుట్ర"
హింసాత్మక జిహాద్, తీవ్రవాద కార్యకలాపాల ద్వారా భారతదేశంలో ఇస్లామిక్ పాలనను తెచ్చేందుకు ఈ సంస్థ కుట్ర పన్నిందని సెప్టెంబర్ 22న సమర్పించిన నివేదిక పేర్కొంది.
"ప్రభుత్వ విధానాలను సమాజంలోని ఒక వర్గానికి తప్పుగా అన్వయించి, భారతదేశానికి వ్యతిరేకంగా వారిని రెచ్చగొట్టడానికి పీఎఫ్ఐ ప్రయత్నించింది. దేశంపట్ల, ప్రభుత్వం పట్ల ద్వేషాన్ని పెంచే ప్రయత్నం చేసింది" అని ఆ నివేదిక పేర్కొంది.
"ఎఫ్ఐఆర్ నమోదైన వ్యక్తులు నిరంతరం వ్యవస్థీకృత నేరాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్గొంటున్నారని, సమాజంలోని ఇతర మత వర్గాలను భయభ్రాంతులకు గురిచేసే ఉద్దేశ్యంతో ఉన్నారని దర్యాప్తులో రికవరీ చేసిన అంశాల ద్వారా తేలింది" అని నివేదిక పేర్కొంది.
నిందితులను ఎన్ఐఏ కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
ఈ దాడుల్లో కేరళ నుంచి 22మంది, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి 20, తమిళనాడు నుంచి 10, అస్సాం నుంచి 9, ఉత్తరప్రదేశ్ నుంచి 8, ఆంధ్రప్రదేశ్ నుంచి 5, మధ్యప్రదేశ్ నుంచి 4, పుదుచ్చేరి, దిల్లీల నుంచి ముగ్గురిని, రాజస్థాన్ నుంచి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.