You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ

‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.

లైవ్ కవరేజీ

చిట్టత్తూరు హరికృష్ణ

  1. విజయమ్మ రాజీనామా, తెలంగాణలో షర్మిలకు అండగా ఉండాలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నానని ప్రకటన

    తెలంగాణలో ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తని, ఇక ముందు జరగబోయేది ఒక ఎత్తని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయమ్మ అన్నారు.

    మంగళగిరిలో జరుగుతున్న వైసీపీ ప్లీనరీలో పాల్గొన్న ఆమె, తెలంగాణలో ముందుగానే ఎన్నికలు జరగబోతున్నాయని అన్నారు.

    తెలంగాణలో షర్మిలకు పార్టీ కార్యక్రమాల్లో సహాయంగా ఉండేందుకు తాను వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

    కుటుంబంంలో విభేదాలున్నాయనే ప్రచారానికి, వక్రీకణలకు తావులేకుండా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్ష పదవిలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించారు.

    కష్టంలో ఉన్నప్పుడు తాను జగన్ కు అండగా నిలిచానని, ఒంటరిపోరాటం చేస్తున్న షర్మిలకు అండగా ఉండేందుకు ఇప్పుడు రాజీనామా చేస్తున్నట్లు ఆమె చెప్పారు.

    రాజీనామా చేస్తున్నందుకు వైఎస్ఆర్ అభిమానులు తనను క్షమించాలని విజయమ్మ అన్నారు.

    ఏపీ రాజకీయాలో జగన్‌కు, తెలంగాణలో షర్మిలకు వేర్వేరు రాజకీయ విధానాలు ఉన్నాయన్న విజయమ్మ, ఆ ఇద్దరూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను పుణికిపుచ్చుకున్నవారేనని అన్నారు.

  2. ‘‘నేను మహిళను అన్న సంగతి ఎప్పుడో మర్చిపోయాను’’

  3. శ్రీలంక సంక్షోభం: దివాలా తీసిన దేశంలో ప్రతిరోజూ బతుకు గండమే

  4. వైసీపీ ప్లీనరీకి బయలుదేరిన విజయమ్మ, జగన్

    ఆంధ్రప్రదేశ్‌లో పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి అన్ని ఏర్పాట్లూ చేశారు.

    నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతల నుంచి కార్యకర్తల వరకు పెద్దసంఖ్యలో పాల్గొంటున్నారు.

    పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ప్లీనరీ జరిగే ప్రదేశానికి బయలుదేరారు.

    అంతకుముందు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తండ్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు.

  5. Boris Johnson: బ్రిటన్‌ కాబోయే ప్రధాన మంత్రి ఎవరు, రిషి సునాక్ కు ఉన్న అవకాశాలేంటి ?

  6. అమర్‌నాథ్‌లో కుండపోత వర్షాలు.. పది మంది మృతి

  7. బోరిస్ జాన్సన్: హీరో నుంచి జీరో ఎలా అయ్యారు

  8. అలర్జీ అంటే ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన 6 ముఖ్యమైన విషయాలు

  9. రాణి రుద్రమ దేవి వారసుడు ఈయనేనా, ఇన్నాళ్లూ ఎక్కడున్నారు

  10. లైవ్ పేజీ అప్డేట్స్‌ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం. బ్రిటన్ రాజకీయ సంక్షోభం గురించిన అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  11. సాయి పల్లవి పిటీషన్ కొట్టేసిన హైకోర్టు

    కశ్మీర్ పండితుల విషయంలో వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో నటి సాయి పల్లవి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

    భజరంగ్ దళ్ సభ్యుడు ఫిర్యాదు మేరకు గత నెలలో సుల్తాన్ బజార్ పీఎస్‌లో సాయి పల్లవి మీద కేసు నమోదు చేశారు. గత నెల 21న ఆమెకు నోటీసులు జారీ చేశారు.

    సుల్తాన్ బజార్ పోలీసులు జారీ చేసిన నోటీసులు రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు నటి సాయిపల్లవి.

    కానీ సాయిపల్లవి అభ్యర్థనను హైకోర్టు తోసి పుచ్చింది.

  12. టీచర్ కావాలనే లక్ష్యం చేరుకోవడానికి పేపర్ గర్ల్‌గా మారిన బాలిక

  13. పలమనేరు టెర్రకోట బొమ్మలకు అంత అందం ఎలా వస్తుంది?

    చిత్తూరు జిల్లా పలమనేరులో రహదారి మీద కనిపించే టెర్రకోట మట్టిబొమ్మల వెనుక ఎంతో కష్టం దాగి ఉంది. ఇక్కడి కళాకృతులకు దేశం నలుమూలలా డిమాండ్ ఉంది. ఈ బొమ్మలు విదేశాలకూ ఎగుమతి అవుతాయి.

  14. గుజరాత్ గ్రామీణ మహిళ జీవితాలను మార్చేస్తున్న మెన్‌స్ట్రువల్ కప్స్

  15. వైసీపీ ప్లీనరి: 11 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో 5 కీలక దశలు

  16. ఇళయరాజా: దళితుల కోటాలో బీజేపీ ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చిందా, విమర్శలు ఎందుకు వినిపిస్తున్నాయి

  17. వింబుల్డన్: పీరియడ్స్ సమయంలో మహిళా క్రీడాకారులు తెల్లటి దుస్తులు ధరించడం ఆట మీద ప్రభావం చూపుతుందా?

  18. అస్సాం వరదలు: చితికి పోయిన బతుకు చిత్రాలు

  19. జగన్ పాలనే గీటురాయిగా వైసీపీ ప్లీనరీ: విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ హాజరవుతారు

    వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వహిస్తున్న తొలి ప్లీనరీకి పార్టీలో క్షేత్ర స్థాయి నుంచి పైస్థాయి వరకు పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు.

    ప్లీనరీ నేపథ్యంలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన పార్టీ కార్యకర్తలు, ప్రజల్లో స్పందన చూస్తుంటే ప్లీనరీ విజయవంతం కావడం ఖాయమని స్పష్టంగా తెలుస్తోందన్నారు.

    పార్టీ ఏర్పడిన తరువాత జరుగుతున్న మూడో ప్లీనరీ ఇదని.. తొలి రెండూ తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్వహించగా ఇప్పుడు ఈ మూడో ప్లీనరీ అధికారంలో ఉన్నప్పుడు నిర్వహిస్తోన్నదని చెప్పారు.

    తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్మాణాత్మక విమర్శలే చేశామని.. అలాగే, ఇప్పుడు గత మూడేళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్మాణాత్మక పాలన అందిస్తున్నారని చెప్పారు.

    జగన్మోహన్ రెడ్డి పాలనకు గీటురాయిగా ఈ ప్లీనరీ జరుగుతోందని.. విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం, మహిళాసాధికారిత వంటి అనేక అంశాలలో వైసీపీ సాధించిన విజయాలను ఈ ప్లీనరీలో వివరిస్తామని విజయసాయిరెడ్డి అన్నారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతారని.. పార్టీ అధ్యక్షుడి ఎన్నికపై తొలి రోజు తీర్మానం పెట్టి రెండో రోజు ఎన్నిక నిర్వహిస్తామని చెప్పారు.

    ముందస్తు ఎన్నికలు వస్తే సీఎం కావాలని చంద్రబాబు కలలు కంటున్నారని, ఆయన కలలు కలలుగా మిగిలిపోతాయని విజయసాయిరెడ్డి అన్నారు.

  20. అరబ్ దేశాలు చైనా వైపు ఎందుకు చూస్తున్నాయి, ప్రజాస్వామ్యంలో ఆర్ధిక వ్యవస్థలు దెబ్బతింటాయా