You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ
‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.
లైవ్ కవరేజీ
చిట్టత్తూరు హరికృష్ణ
బ్రిటన్ సముద్రగర్భ అన్వేషణలో బయటపడ్డ 13 శతాబ్దం నాటి ఓడ శకలాలు
రాహుల్ గాంధీ: ‘పార్లమెంట్లో అడిగే ప్రశ్నలకు ‘రాజా’ భయపడుతున్నారు’
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అంశాలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి లక్ష్యంగా చేసుకున్నారు.
ఎంపీల సస్పెన్షన్, అరెస్ట్లపై కూడా ఆయన ట్వీట్ చేస్తూ ప్రశ్నలు సంధించారు.
సిలిండర్ ధర పెరుగుదలతో పాటు పెరుగు, ఆవనూనెపై జీఎస్టీ గురించి ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోదీని ఆయన ‘రాజా’ అని సంభోదిస్తూ... ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రశ్నలకు రాజా భయపడుతున్నారు. కానీ, తమకు నియంతలతో ఎలా పోరాడాలో తెలుసు అంటూ ట్వీట్లో పేర్కొన్నారు.
పార్లమెంట్ ససమావేశాల సందర్భంగా సభలో నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారంటూ నలుగురు లోక్సభ ఎంపీలు, 19 మంది రాజ్య సభ ఎంపీలను సస్పెండ్ చేశారు.
మంకీపాక్స్ సోకకుండా వ్యాక్సీన్లు ఉన్నాయా... ప్రస్తుతం చికిత్సకు వాడుతున్న మందులేంటి?
బ్రేకింగ్ న్యూస్, ‘మనీ లాండరింగ్ కేసుల్లో అరెస్టులకు, ఈడీ కారణం చెప్పడం తప్పనిసరి కాదు’: సుప్రీం కోర్టు, సుచిత్ర మోహంతి, బీబీసీ కోసం
మనీ లాండరింగ్ చట్టం కింద అరెస్టులు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు ఉన్న అధికారాలను సుప్రీం కోర్టు సమర్థించింది.
జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈడీ అధికారాలను సవాలు చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై విచారించి తీర్పును వెలువరించింది.
నేరస్థుల ఆదాయం, ఇంటిపై సోదాలు, ఆస్తుల అటాచ్మెంట్, అరెస్టులు, బెయిల్ షరతులకు సంబంధించి మనీలాండరింగ్ చట్టంలో రూపొందించిన కఠినమైన విధానాలు సరైనవే అని తీర్పులో పేర్కొంది.
మనీ లాండరింగ్ కేసుల్లో నిందితులను అదుపులోకి తీసుకున్న సమయంలో అరెస్టు చేయడానికి కారణాన్ని ఈడీ అధికారులు చెప్పడం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.
ఈడీ అధికారాలను సవాలు చేసిన వారిలో మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తదితరులు ఉన్నారు.
తెలంగాణ: కామారెడ్డి వాసికి మంకీపాక్స్ నెగెటివ్
తెలంగాణలోని కామారెడ్డిలో మంకీపాక్స్ అనుమానిత కేసుగా గుర్తించిన వ్యక్తికి నెగెటివ్ ఫలితం వచ్చినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది.
జూలై 24న మంకీపాక్స్ లక్షణాలతో కామారెడ్డికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి స్థానిక ఆసుపత్రికి వెళ్లారు. తర్వాత ఆయనను హైదరాబాద్లోని ఫీవర్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షల కోసం ఆయన నమూనాలను పుణేలోని ఎన్ఐవీ ల్యాబ్కు పంపించినట్లు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ చెప్పారు.
మంకీపాక్స్ అనుమానిత లక్షణాలున్న వ్యక్తి ఇటీవలే కువైట్ నుంచి భారత్కు వచ్చారు. తాజాగా ఆయనకు మంకీపాక్స్ నెగెటివ్ ఫలితం వచ్చినట్లు తమకు సమాచారం అందిందని వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
ఏపీజే అబ్దుల్ కలాం: ఈ మిసైల్ మ్యాన్ను ప్రజల రాష్ట్రపతి అని ఎందుకంటారు?
సెక్స్ రాకెట్ కేసులో మేఘాలయ బీజేపీ ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ అరెస్ట్
తన పామ్ హౌస్లో సెక్స్ రాకెట్ నడుపుతున్నారనే ఆరోపణలతో మేఘాలయ బీజేపీ ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ ఎన్ మరాక్ అరెస్ట్ అయ్యారు.
మంగళవారమే ఆయనను పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తా ఏజెన్సీ పీటీఐ తెలిపింది. ‘‘బెర్నార్డ్ ఎన్ మరాక్ అలియాస్ రింపూను ఉత్తరప్రదేశ్లోని హపూర్లో అరెస్ట్ చేశాం. ఆయనను తురాకు తీసుకురావడానికి ఒక బృందాన్ని వెళ్తోంది’’ అని పీటీఐతో వెస్ట్ గారో హిల్స్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వివేకానంద్ సింగ్ చెప్పారు.
మేఘాలయ అధికారులు ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారని, ఆ తర్వాతే ఆయనను అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు.
బెర్నార్డ్ ఎన్ మరాక్ ప్రస్తుతం మేఘాలయ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షునిగా ఉన్నారు. గారో హిల్స్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ సభ్యుడు కూడా.
వెస్ట్ గారో హిల్స్ జిల్లా తురాలోని బెర్నార్డ్ ఫామ్ హౌస్లో శనివారం పోలీసులు సోదాలు చేశారు. ఆ ఫామ్ హౌస్లో సెక్స్ రాకెట్ నడుస్తోందని, అక్కడి నుంచి ఆరుగురు మైనర్లను రక్షించడంతో పాటు 73 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 22వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఫామ్హౌస్పై తనిఖీలు ప్రారంభించారు. ఉదయం 5 గంటల వరకు ఇవి కొనసాగాయి.
మూడు అంతస్థుల ఆ భవనంలో సెక్స్ రాకెట్ నడుస్తున్నట్లు పోలీసులు, విలేఖరుల సమావేశంలో చెప్పారు. ‘ఈ భవనంలో రెండు అంతస్థులు బేస్మెంట్ లోపల ఉన్నాయి. ఇందులో 30 చిన్న గదులు ఉన్నాయి. పోలీసులు అక్కడికి చేరుకున్న సమయంలో చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు బహిరంగంగా మద్యం తాగుతున్నారు. కొంతమంది ఒంటిపై దుస్తులు లేకుండా వాహనాల్లో ఉన్నారు’’ అని చెప్పారు.
ఫామ్ హౌస్ నుంచి 36 వాహనాలు, 47 మొబైల్ ఫోన్లు, లక్షా 68 వేల విలువ చేసే మద్యం, 500 కండోమ్లు, ఇతర అభ్యంతరకర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కామన్వెల్త్ గేమ్స్: భారత్ ఖాతాలో తొలి పతకం, సంకేత్ సర్గార్కు రజతం
ద్రౌపది ముర్ము: గిరిజన, దళిత వ్యక్తి లేదా ఒక మహిళ రాష్ట్రపతి అయితే సమాజంపై ఆ ప్రభావం ఎలా ఉంటుంది?
కార్గిల్ యుద్ధం: వీరోచితంగా పోరాడిన పాక్ సైనికుడు.. భారత సైనికాధికారి సిఫార్సుపై అత్యున్నత శౌర్య పురస్కారం ఇచ్చిన పాకిస్తాన్
ఎగిరిపోయిన పెంపుడు చిలుక.. పట్టిచ్చినందుకు రూ. 85,000 బహుమతి ఇచ్చిన కుటుంబం..
ఆస్ట్రేలియా చెఫ్ల పోటీలో మెరిసిన భారతీయ వంటకాలు.. బిరియానీ గెలిపించిందా?
నాటుసారా ఎలా తయారు చేస్తారు, అది తాగితే మనుషులు చనిపోతారా?
పాకిస్తాన్: కరాచీలో ఉత్సాహంగా తమిళ హిందువుల మారియమ్మాన్ వేడుకలు
శ్రీలంకలో రోజురోజుకూ తీవ్రమవుతున్న సంక్షోభం... తిండి కోసం అష్టకష్టాలు పడుతున్న ప్రజలు
మార్గరెట్ అల్వా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఏమన్నారంటే...
బీజేపీ నేతలతో మాట్లాడిన తర్వాతే తన ఫోన్లో సమస్య వచ్చిందంటూ విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా, చిన్నపిల్లల తరహాలో ఆరోపణలు చేశారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.
‘‘ఎవరైనా ఆమె ఫోన్ను ఎందుకు ట్యాప్ చేస్తారు? ఉప రాష్ట్రపతి ఎన్నిక ఫలితంపై మేం నమ్మకంగా ఉన్నాం. ఇవన్నీ చిన్న పిల్లల ఆరోపణలు. ఒక సీనియర్ వ్యక్తి అయిన ఆమె ఇలాంటి ఆరోపణలు చేయకూడదు’’ అని ఆయన అన్నట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
అంతకుముందు ఆమె బీజేపీ నేతలతో మాట్లాడిన తర్వాతే తన ఫోన్ కాల్స్ అన్నీ డైవర్ట్ అవుతున్నాయని పేర్కొంటూ ట్వీట్ చేశారు.
పాకిస్తాన్ గూఢచారుల వాట్సాప్ గ్రూప్లో భారత ఆర్మీ ఇంటెలిజెన్స్ అధికారులు... ఈ కేసుపై సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
హెపటైటిస్ డే: వ్యాక్సీన్లను ఎందుకు తప్పనిసరి చేశారు?
గుజరాత్: నాటు సారా తాగి 24 మంది మృతి
గుజరాత్లోని బోటాద్ జిల్లాలో నాటు సారా తాగడంతో 40 మందికిపైగా ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో మంగళవారం ఉదయం వరకు 24 మంది చనిపోయారని బీబీసీ ప్రతినిధి సచిన్ పిథ్వా చెప్పారు.
నాటు సారా తాగి అనారోగ్యం పాలైన 40కి పైగా వ్యక్తులను భావ్నగర్, బోటాద్, అహ్మదాబాద్లోని ఆసుపత్రుల్లో చికిత్స కోసం చేర్చారు.
సారా తయారు చేసి విక్రయిస్తోన్న వారిలో ఇప్పటివరకు అయిదుగురిని అరెస్ట్ చేసినట్లు గుజరాత్ డీజీపీ ఆశిష్ భాటియా తెలిపారు.
విచారణలో సహాయపడేందుకు గుజరాత్ ఏటీఎస్ మంగళవారం ఉదయం బోటాద్కు చేరుకుంది. ఈ కేసును దర్యాప్తు చేసే ప్రత్యేక బృందానికి డీఎస్పీ ర్యాంకు అధికారి నేతృత్వం వహిస్తారని భావ్నగర్ రేంజ్ ఐజీ అశోక్ కుమార్ చెప్పారు.
అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్, గుజరాత్ ఏటీఎస్ ఈ కేసులో విచారణను ప్రారంభించింది.
వ్యవస్థ నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని ఆ గ్రామ సర్పంచ్ జిగర్ డుంగారాణి ఆరోపించారు.
‘‘మూడు, నాలుగు నెలల క్రితమే నేను ఎస్పీ, పీఎస్ఐలకు రాతపూర్వకంగా దీనిపై ఫిర్యాదు చేశాను. కానీ పరిష్కారం లభించలేదు’’ అని ఆయన చెప్పారు.