You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ

‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.

లైవ్ కవరేజీ

చిట్టత్తూరు హరికృష్ణ

  1. తమిళనాడు: 100 ఏళ్ల నాటి శివాలయాన్ని కూలుస్తున్నారంటూ ఆందోళన

    తమిళనాడులోని కోయంబత్తూరులోగల 100 ఏళ్ల నాటి శివాలయాన్ని మున్సిపల్ అధికారులు కూల్చేస్తున్నారంటూ ఆందోళనలు చెలరేగాయి.

    హిందుత్వ కార్యకర్తలు చాలా మంది శివాలయం వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు.

    అయితే తాము శివాలయాన్ని కూల్చడం లేదని గుడి చుట్టూ ఉన్న గోడను మాత్రమే పడగొడుతున్నామని మున్సిపల్ అధికారులు అంటున్నారు.

    స్థానికులు వేసిన పిటీషన్ ఆధారంగా గుడి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చాల్సిందిగా మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

  2. కేరళ: ఒక్క వీడియోతో తమ్ముడి వైద్యానికి రూ. 47 కోట్లు సేకరించిన బాలిక అదే వ్యాధితో ప్రాణాలు కోల్పోయింది

  3. తదుపరి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యు.యు లలిత్?

    తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యు.యు లలిత్‌ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ సిఫారసు చేశారు.

    జస్టిస్ ఎన్‌వీ రమణ ఈ నెలలో పదవీ విరమణ చేయనున్నారు.

    జస్టిస్ లలిత్ ఆ పదవి చేపడితే 49వ ప్రధాన న్యాయమూర్తి అవుతారు.

  4. ఇరాన్: ఇక్కడ మహిళలకు ఎక్కువగా ఉరి శిక్షలు విధిస్తున్నారు ఎందుకు

  5. మెహబూబా ముఫ్తీ: ‘మా జెండాను మా ఆలోచనల నుంచి దూరం చేయలేరు’

    జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, భారత్ జాతీయ పతాకంతోపాటు జమ్మూ కశ్మీర్ జెండా కూడా ఉన్న ఫొటోను తన ట్విటర్ ప్రొఫైల్ పిక్‌లో పెట్టారు.

    ‘ఆజాదీకి కా అమృత మహోత్సవ్’లో భాగంగా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో జాతీయ జెండాను పెట్టుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరిన విషయం తెలిసిందే.

    తన తండ్రి ముఫ్తీ మహ్మద్ సయ్యద్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్న ఫొటోను ఆమె తన ప్రొఫైల్ పిక్‌గా పెట్టారు. అందులో భారత్ జెండాతో పాటు ప్రస్తుతం రద్దయిన జమ్మూ కశ్మీర్ జెండా కూడా ఉంది.

    ‘జెండా అనేది సంతోషానికి, గర్వపడటానికి ప్రతీక అయినందున నా ప్రొఫైల్ పిక్ మార్చాను.

    మా రాష్ట్ర జెండాకు భారత జాతీయ జెండాకు ఉన్న అవినాభావ సంబంధం విడదీయలేనిది. కానీ ఆ బంధాన్ని తెంచేసి మా జెండాను దూరం చేశారు.

    మా జెండాను మా నుంచి దూరం చేయొచ్చు. కానీ మా అందరి ఆలోచనల నుంచి తుడిచి వేయలేరు.’ అని ఆమె ట్వీట్ చేశారు.

    ఆర్టికల్-370 రద్దుతో జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తి తొలగిపోయింది. దాంతో పాటే జమ్మూ కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక జెండా కూడా రద్దయింది.

  6. కామన్‌వెల్త్ గేమ్స్: సెమీస్‌‌కు చేరిన టీం ఇండియా

    కామన్‌వెల్త్ గేమ్స్‌లో భాగంగా జరిగిన విమెన్స్ టీ20లో బార్బడోస్ మీద టీం ఇండియా 100 పరుగుల తేడాతో గెలిచింది.

    తద్వారా సెమీఫైనల్‌లోకి టీం ఇండియా దూసుకెళ్లింది.

    తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 20 ఓవర్లలో 162 పరుగులు చేసింది. జెమీమా రొడ్రిగ్యూస్ 56 పరుగులు చేయగా షఫాలీ వర్మ 43 పరుగులు తీసింది.

    దీప్తి శర్మ 28 బంతుల్లో 34 పరుగులు చేసింది.

    మొత్తం మీద 4 వికెట్లు కోల్పోయింది.

    163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బార్బడోస్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది.

    రేణుక సింగ్ 4 వికెట్లు తీసింది.

  7. పెట్రోల్‌తో వెళ్లే బైకులో ఆటోమాటిగ్గా చార్జ్ అయ్యే బ్యాటరీ

    ఇది మామూలు బైక్‌ కాదు. దీనిపై 10 కిలోమీటర్ల ప్రయాణానికి జస్ట్ రూపాయిన్నర ఖర్చవుతుంది. అంతేకాదు.. ఇది అవసరం అనుకుంటే పెట్రోల్‌తో కూడా నడుస్తుంది.

    పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.

  8. తైవాన్ సమీపంలో చైనా మిసైల్స్... యుద్ధనౌకను పంపుతున్నామన్న అమెరికా

  9. చీతా: ఇండియాలో 50 ఏళ్ల కిందట అంతరించిపోయిన మృగం మళ్లీ వస్తోంది

  10. ‘కాంగ్రెస్ పార్టీని దిగ్బంధించారు.. ఇవి వికృత కక్షా రాజకీయాలు’: జైరాం రమేష్

    భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని దిగ్బంధించారని, పార్టీ ప్రధాన కార్యాలయాన్ని, పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసాన్ని, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసాన్ని దిల్లీ పోలీసులు ముట్టడించారని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ చెప్పారు.

    ఆయన బుధవారం ఒక ట్వీట్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘కక్షా రాజకీయాల వికృత రూపమిది. మేం తలవంచం. మా గొంతు నొక్కలేరు. అన్యాయాలకు, మోదీ సర్కారు వైఫల్యాలకు వ్యతిరేకంగా మా గొంతు వినిపిస్తూనే ఉంటాం’’ అని పేర్కొన్నారు.

    మరోవైపు కాంగ్రెస్ నేత అభిషేక్ మనూ సింఘ్వీ దిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘మీరు మమ్మల్ని అణచివేయటానికి ఎంతగా అయినా ప్రయత్నించవచ్చు. మా ప్రతిఘటనను మీరు చూస్తారు. పూర్తిగా ప్రజాస్వామిక ప్రతిస్పందనను ప్రపంచం చూస్తుంది. మిమ్మల్ని మేం ఎండగడుతూనే ఉంటాం’’ అని ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

    కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ అజయ్ మాకెన్ మాట్లాడుతూ.. ‘‘ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆహార ఉత్పత్తుల మీద జీఎస్‌టీ. ఈ మూడు అంశాలపై రాష్ట్రపతి భవన్, ప్రధానమంత్రి నివాసాల ఎదుట నిరసన చేపట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది’’ అని చెప్పారు.

    ‘‘మీరు మమ్మల్ని ఎంతగా అణచివేసినా సరే కాంగ్రెస్ పార్టీ ఈ మూడు అంశాలపై నిరసనను కొనసాగిస్తుంది’’ అని పేర్కొన్నారు.

    నిరసనకారులు ఏఐసీసీ కార్యాలయం వద్ద, సోనియాగాంధీ నివాసం వద్ద నిరసనకారులు పెద్ద సంఖ్యలో గుమిగూడే అవకాశం ఉందంటూ స్పెషల్ బ్రాంచ్ నుంచి అందిన సమాచారంతో బుధవారం నాడు ఆయా ప్రాంతాల్లో దిల్లీ పోలీసులు బలగాలను మోహరించారు.

  11. బ్రాండిక్స్ సెజ్‌లో గ్యాస్ లీక్ ఘటనలు ఎందుకు పునరావృతం అవుతున్నాయి, బాధ్యులెవరు

  12. ఇక్కడ ప్లాస్టిక్ చెత్తను ఇస్తే ఉచితంగా భోజనం పెడతారు

  13. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా: భారత్‌లో 23 రాష్ట్రాలకు విస్తరించిన ఈ ముస్లిం సంస్థకు నిషేధిత సిమి తో ఉన్న బంధమేంటి?

  14. ఉబర్: 30 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.2,414...ఇది కొత్త తరహా మోసమా లేక సాంకేతిక సమస్యా

  15. కామన్వెల్త్ గేమ్స్: వెయిట్ లిఫ్టర్ లవ్‌ప్రీత్ సింగ్‌కు కాంస్యం

    కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో భారత్ మరో పతకాన్ని సాధించింది. బుధవారం భారత్‌కు చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్‌ప్రీత్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.

    పురుషుల 109 కేజీల విభాగంలో పోటీపడిన లవ్‌ప్రీత్ సింగ్ ఓవరాల్‌గా 355 (స్నాచ్ 163, క్లీన్ అండ్ జర్క్ 192) కేజీల బరువునెత్తి మూడో స్థానంలో నిలిచాడు.

    స్నాచ్ కేటగిరీ మూడు ప్రయత్నాల్లో వరుసగా 157, 161, 163 కేజీలు విజయవంతంగా లిఫ్ట్ చేశాడు.

    క్లీన్ అండ్ జర్క్ మూడు ప్రయత్నాల్లోనూ వరుసగా 185, 189, 192 కేజీలు ఎత్తి పతకాన్ని అందుకున్నాడు.

    ఈ విభాగంలో పరిక్లెక్స్ ఎన్‌గజ యబెయు (కామెరూన్) విజేతగా నిలిచాడు. ఆయన మొత్తంగా 361 కేజీల బరువునెత్తాడు. సమోవాకు చెందిన జాక్ హిటిలా 358 కేజీలు లిఫ్ట్ చేసి రజతాన్ని గెలుచుకున్నాడు.

  16. సుప్రీం కోర్టు: ‘ఎన్నికల్లో ఉచిత హామీలపై ఏం చేయలేమంటే ఎలా? ఇది తీవ్రమైన అంశం’

    ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు చేసే ప్రజాకర్షక వాగ్దానాలను తీవ్రమైన అంశంగా సుప్రీం కోర్టు వాఖ్యానించింది.

    ఈ విషయంలో తామేమీ చేయలేమని ఎలక్షన్ కమిషన్ (ఈసీ), ప్రభుత్వం చెప్పడం తగదని అసంతృప్తి వ్యక్తం చేసింది.

    ఎన్నికల ప్రచారం సమయంలో రాజకీయ పార్టీలు ఇలాంటి వాగ్దానాలు చేయకుండా నియంత్రించడానికి ఒక ఉన్నత స్థాయి అపెక్స్ బాడీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

    ఇందులో నీతి ఆయోగ్, ఫైనాన్స్ కమిషన్, ఆర్‌బీఐతో పాటు అధికార, విపక్ష పార్టీల ప్రతినిధులకు చోటు కల్పించాలని చెప్పింది.

    ఈ అపెక్స్ బాడీని ఎలా ఏర్పాటు చేస్తారో ఏడు రోజుల్లో చెప్పాలంటూ కేంద్రం, ఈసీ, సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్, పిటిషనర్‌లను కోరింది.

    ఎన్నికల సమయంలో ఉచిత హామీలు ఇస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు పైవ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై వచ్చేవారం మరోసారి విచారించనుంది.

  17. ‘‘హిందూ దేశం’’: భారతీయ ముస్లింలలో ఎలా భయాన్ని పుట్టిస్తున్నారు, ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, మారేందుకు ఏం చేయాలి

  18. కర్ణాటక: మాజీ ముఖ్యమంత్రి పుట్టినరోజు... 6 కి.మీ మేర ట్రాఫిక్ జామ్

    కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య పుట్టినరోజు వేడుకలు భారీ ట్రాఫిక్ జామ్‌కు దారి తీశాయి.

    ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని వేలాది మంది గుమిగూడటంతో పుణె-బెంగళూరు జాతీయ రహదారిపై చాలా దూరం వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది.

    దేవనాగిరి జిల్లాలోని రహదారిపై 6 కి.మీ మేర వాహనాలు ఆగిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

  19. తైవాన్, చైనా, అమెరికా: నాన్సీ పెలోసీ ఎవరు?

  20. జవహర్ లాల్ నెహ్రూ, అటల్ బిహారి వాజ్‌పేయి మూర్ఖత్వం వల్లే....

    తైవాన్, టిబెట్ అంశంలో భారత మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్‌పేయిలను బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి సుబ్రమణ్యం స్వామి నిందించారు.

    నెహ్రూ, అటల్ బిహారి వాజ్‌పేయి మూర్ఖత్వం వల్లే భారతీయులంతా తైవాన్, టిబెట్‌లను చైనాలో భాగంగా పరిగణిస్తున్నారని సుబ్రమణ్యం స్వామి ట్వీట్ చేశారు.

    ప్రధాని మోదీపై కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. వాస్తవాధీన రేఖ వద్ద ఉమ్మడి ఒప్పందం ఉన్నప్పటికీ లడఖ్‌లోని కొన్ని ప్రాంతాలను చైనా లాక్కుందని... అయితే, మోదీ మాత్రం ‘ఎవరూ మన భూభాగంలోకి అడుగు పెట్టలేదు’ అని చెబుతున్నారని వ్యాఖ్యానించారు.

    అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసీ, తైవాన్ పర్యటనతో చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తైవాన్ తమ భూభాగమేనని చైనా చెబుతుండగా.... తైవాన్ మాత్రం తమను తాము స్వతంత్ర దేశంగా భావిస్తుంది.