మహారాష్ట్ర ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం: పది మంది నవజాత శిశువులు మృతి

మహారాష్ట్ర

ఫొటో సోర్స్, Ani

ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో పది మంది నవజాత శిశువులు మణించారు.

నాగ్‌పుర్‌కు 62 కి.మీ. దూరంలోని భండారా జిల్లా ఆసుపత్రిలో శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటలకు (తెల్లవారితే శనివారం) ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఆసుపత్రిలోని నవజాత శిశువుల విభాగం నుంచి దట్టమైన పొగలు రావడంతో అక్కడ పనిచేస్తున్న నర్సు అధికారులకు సమాచారం అందించారు. దీంతో విభాగంలోని 17 మంది శిశువుల్లో ఏడుగురిని ప్రాణాలతో కాపాడారు.

''ఏడుగురు శిశువులను మాత్రమే కాపాడగలిగాం. దురదృష్టవశాత్తు పది మంది పిల్లలు చనిపోయారు''అని ఆసుపత్రిలో పనిచేస్తున్న సివిల్ సర్జన్ ప్రమోద్ ఖండాటే ఏఎన్‌ఐ వార్తా సంస్థకు తెలిపారు.

అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించామని భండారా జిల్లా ఎస్సీ వసంత్ జాదవ్ తెలిపారు.

మహారాష్ట్ర

ఫొటో సోర్స్, ANI

ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సంతాపం ప్రకటించారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపేతో మాట్లాడానని, తక్షణమే విచారణకు ఆదేశించామని ఆయన తెలిపారు.

మరోవైపు మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తామని రాజేశ్ తోపే ప్రకటించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

''మహారాష్ట్రలోని ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరం. బాధతో నాకు మాటలు కూడా రావడం లేదు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను. ఈ బాధను తట్టుకొనే శక్తివారికి దేవుడే ఇవ్వాలి''అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

''భండారా జిల్లా జనరల్ హాస్పిటల్‌లో ప్రమాదం జరగడం చాలా బాధాకరం. పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులకు సాయం చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను''అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

వీడియో క్యాప్షన్, మహారాష్ట్ర ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం: పది మంది నవజాత శిశువులు మృతి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)