You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్‌కు క్లీన్ చిట్.. పార్టీ చేసుకున్నంత మాత్రాన అనుమానించలేమన్న న్యాయమూర్తి

సనా తన ప్రవర్తనతో దేశ ప్రతిష్ట, భద్రతకు భంగం కలిగించారని అప్పట్లో అనేక మంది ఫిర్యాదు చేశారు. కానీ, సనా తన చర్యను సమర్థించుకున్నారు.

లైవ్ కవరేజీ

  1. నారా చంద్రబాబు నాయుడు: ‘‘వచ్చే ఎన్నికల్లో మీరు గెలిపిస్తే సరే.. లేదా అదే నా చివరి ఎన్నిక అవుతుంది’’

    కర్నూలు జిల్లా పర్యటనలో తెలుగు దేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

    రానున్న ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అని సూచనప్రాయంగా అన్నారు.

    పత్తికొండ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

    ‘‘సీనియర్ నాయకుడిని అయిన నన్ను అసెంబ్లీలో అవమానించారు. నా భార్యను కూడా అవమానించే పరిస్థితికి వచ్చారు.

    ఆరోజే ఒక నిర్ణయం తీసుకున్నా. మళ్లీ క్షేత్ర స్థాయిలో గెలిచిన తర్వాతే అసెంబ్లీలో అడుగు పెడతా. లేకపోతే అసెంబ్లీకి రానని ఆరోజే చెప్పాను.

    నేను అసెంబ్లీకి వెళ్లాలంటే.. రాజకీయాల్లో ఉండాలంటే... ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలంటే వచ్చే ఎన్నికల్లో మీరు గెలిపించాలి. లేదా ఇదే నాకు చివరి ఎన్నిక అవుతుంది’’ అని ఆయన ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడారు.

  2. లైగర్ సినిమా పెట్టుబడుల మీద పూరీ జగన్నాథ్‌ను ప్రశ్నించిన ఈడీ

  3. జిన్‌పింగ్, ట్రూడో: కెనడాప్రధానిపై చైనా అధ్యక్షుడి అసహనం - చర్చల వివరాలు లీక్ చేశారని ఆరోపణ

  4. బైజూస్, మెటా, ట్విటర్: ఉద్యోగాలు కాపాడుకునేందుకు ఏం చేస్తున్నారు

  5. తమిళనాడు: 17 ఏళ్ల ఫుట్‌బాలర్ ప్రియ ప్రాణం తీసిన మోకాలి ఆపరేషన్

  6. చంద్రునిపైకి ఆర్టెమిస్ 1 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన నాసా

  7. రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి నళిని ఇంటర్వ్యూ : నా కళ్ల ముందే నన్ను ఉరి తీసేందుకు ఏర్పాట్లు చేశారు

  8. సైకోపాత్ లక్షణాలు ఏమిటి? ఫిమేల్ సైకోపాత్‌ జీవితం ఎలా ఉంటుంది?

  9. జీ20: షీ జిన్‌పింగ్‌ను చూడగానే లేచి వెళ్లి చేతులు కలిపిన మోదీ... ప్రతిపక్షాల విమర్శలు

  10. ‘పోలాండ్‌లో పడిన క్షిపణిని యుక్రెయిన్ ప్రయోగించింది’: అమెరికా అధికారులు

    పోలాండ్‌లో మంగళవారం ఇద్దరి మృతికి కారణమైన క్షిపణిని యుక్రెయిన్ నుంచి ప్రయోగించారని ముగ్గురు అమెరికా అధికారులు చెప్పినట్లు అసోసియేట్ ప్రెస్ (ఏపీ) ఏజెన్సీ ఒక నివేదికలో పేర్కొంది.

    ఆ ముగ్గురు అధికారులు తమ వివరాలను బయటపెట్టడానికి ఇష్టపడలేదని ఏపీ వార్తా సంస్థ తెలిపింది.

    దీనికంటే ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ అంశంపై తన అభిప్రాయాన్ని చెప్పారు. పోలాండ్‌లో ఇద్దరి మృతికి కారణమైన క్షిపణిని రష్యా నుంచి ప్రయోగించడం ‘అసంభవం’ అని ఆయన అన్నారు.

    మరోవైపు ఈ క్షిపణిని ఎవరు ప్రయోగించారనే అంశంపై తమ వద్ద కచ్చితమైన ఆధారాలు లేవని పోలాండ్ చెప్పింది.

    యుద్ధంలో ఇరు వర్గాలు రష్యా యుద్ధ సామగ్రిని వాడాయి. దీంతో ఎవరు దీన్ని ప్రయోగించారనే దానిపై స్పష్టత రాలేదు. దీనిపై పోలాండ్ దర్యాప్తు చేస్తుంది.

  11. ఎల్ఎన్‌జీ అంటే ఏమిటి? యూరప్ ప్రజలకు అది ఎందుకంత కీలకంగా మారింది?

  12. డోనాల్డ్ ట్రంప్: ‘‘2024 అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తా’’

    అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (2024) పోటీ చేస్తున్నట్లు రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

    అధ్యక్ష ఎన్నికల కోసండెమొక్రాట్‌, రిపబ్లికన్‌ పార్టీలు ముందుగా తమ అభ్యర్థులను ఎన్నుకుంటాయి. అయితే, రిపబ్లికన్ పార్టీ తరఫున తానే ఎన్నికల బరిలో నిలుస్తానని తాజాగా ట్రంప్ ప్రకటించారు.

    ఈ మేరకు తన అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తూ ఆయా పత్రాలను పార్టీకి ఆయన సమర్పించారు.

    తర్వాత ‘మార్-ఎ-లాగో’ రిసార్ట్‌లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘‘అమెరికాను మళ్లీ గొప్పగా, గర్వించదగినదిగా మార్చడానికి నేను అమెరికా అధ్యక్ష పదవికి నా అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తున్నా.

    ఇప్పటి నుంచి అధ్యక్ష ఎన్నికల వరకు గతంలో ఎవరూ పోరాడని విధంగా నేను పోరాడతా. దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న డెమోక్రాట్లను మేం ఓడిస్తాం.

    ఇది కేవలం ప్రచారం కాదు. దేశాన్ని కాపాడే ప్రయత్నం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

  13. కృష్ణను పద్మాలయ స్టూడియోలోకి వెళ్లకుండా ఎవరు ఆపారు, ఎందుకు ఆపారు

  14. ‘రష్యా అనాగరిక క్షిపణి దాడులను ఖండిస్తున్నాం’: జీ7, నాటో సంయుక్త ప్రకటన

    యుక్రెయిన్ నగరాలపై, అక్కడి మౌలిక సదుపాయాలపై మంగళవారం రష్యా చేసిన అనాగరిక క్షిపణి దాడులను ఖండిస్తున్నట్లు జీ7, నాటో నేతలు సంయుక్త ప్రకటన చేశారు.

    తమ భూభాగంపై రష్యాకు చెందిన క్షిపణి పడటంతో ఇద్దరు మృతి చెందారని నాటో మిత్రదేశమైన పోలాండ్ చెప్పడంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అత్యవసరంగా జీ7, నాటో దేశాల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

    ఇండోనేసియాలోని బాలీలో జీ20 సదస్సు జరుగుతుండగా అక్కడే బైడెన్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది.

    క్షిపణి దాడి విషయంలో పోలాండ్ దర్యాప్తుకు పూర్తి సహకారాన్ని, మద్దతును అందజేస్తామని నాటో, జీ7 నేతలు సంయుక్తంగా ప్రకటించారు.

    ‘‘యుక్రెయిన్‌కు మా మద్దతును పునరుద్ఘాటిస్తున్నాం. ద్వేషపూరిత దాడులు చేస్తున్న రష్యా జవాబుదారీగా ఉండాలి. రష్యా మంగళవారం చేసిన అనాగరిక క్షిపణి దాడులను మేం ఖండిస్తున్నాం. యుక్రెయిన్ సరిహద్దుకు సమీపంలో పోలాండ్‌ భూభాగంపై జరిగిన దాడి గురించి మేం చర్చించాం’’ అని నాటో, జీ7 నేతలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.

    ఇండోనేసియాలో జరుగుతోన్న జీ20 సమావేశాలు నేటితో యుగియనున్నాయి.

  15. పార్ట్ టైమ్ జాబ్ స్కామ్స్: ఫేక్ ఉద్యోగ సైట్లను ఎలా గుర్తించాలి, మోసపోకుండా ఏం చేయాలి

  16. యుక్రెయిన్ యుద్ధం: రష్యా క్షిపణి పోలాండ్‌లో పడటంతో ఇద్దరి మృతి

    తమ భాభాగంపై మంగళవారం మధ్యాహ్నం 3:40 గంటలకు రష్యాకు చెందిన ఒక క్షిపణి పడటంతో ఇద్దరు మృతి చెందారని పోలాండ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

    అయితే, ఆ క్షిపణిని ఎవరూ ప్రయోగించారనే అంశంపై తమ వద్ద ఎలాంటి కచ్చితమైన ఆధారాలు లేవని పోలాండ్ తెలిపింది.

    ఈ ఘటనపై ‘అత్యవసర వివరణాత్మక నివేదిక’ ఇవ్వాలని పోలాండ్‌లోని రష్యా రాయబారిని కోరినట్లు పోలాండ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లుకాజ్ జసినా తెలిపారు.

    క్షిపణి పడిన సెరెవోడా గ్రామం యుక్రెయిన్-పోలాండ్ సరిహద్దుల్లో ఉంది.

    అయితే, ఈ దాడిని రష్యా ఖండించింది.

    ‘‘యుక్రెయిన్-పోలాండ్’’ సరిహద్దు సమీపంలోని లక్ష్యాలపై రష్యా ఎటువంటి దాడులు నిర్వహించలేదని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

    ‘పరిస్థితిని మరింత దిగజార్చాలనే ఉద్దేశంతో, రెచ్చగొట్టేందుకు చేసే ప్రయత్నాలు ఇవి’ అని రష్యా పేర్కొంది.

  17. భారత్‌లోని ప్రతీ వ్యక్తి హిందువే: మోహన్ భాగవత్ పునరుద్ఘాటన

    భారత్‌లో నివసించే ప్రతీ వ్యక్తి హిందువే అని, భారతీయులందరి డీఎన్ఏ ఒకటేనని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ మంగళవారం పునరుద్ఘాటించారు.

    భగవంతుడిని ప్రార్థించే విధానాన్ని ఎవరూ మార్చుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఎందుకంటే ఏ రకంగా ప్రార్థించినా అది ఒకే మార్గంలో భగవంతున్ని చేరుతుందని చెప్పారు.

    ఈ మాటల్నే గతంలో కూడా మోహన్ భగవత్ ఉద్ఘాటించారు.

    ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో స్వయం సేవక్ సంఘ్‌కు చెందిన ఒక కార్యక్రమంలో గతంలో పాల్గొన్న మోహన్ భగవత్ ఇలాంటి వ్యాఖ్యల్నే చేశారు.

    ‘‘భిన్నత్వంలో ఏకత్వం అనేది భారత్ ప్రత్యేకత. అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలనే భావనను హిందుత్వ విశ్వసిస్తుందని అందరి నమ్మకం. ఆర్‌ఎస్‌ఎస్ ఏర్పడినప్పటి నుంచి అంటే 1925 నుంచి మేం ఒకటే మాట చెబుతున్నాం. అదేంటంటే.. భారత్‌లో నివసించే ప్రతీ వ్యక్తి హిందువే. భారత్‌ను తమ మాతృభూమిగా భావించేవారు, భిన్నత్వంలో ఏకత్వం అనే భారత సంస్కృతిలో నివసించాలని కోరుకునేవారంతా ఏ మతం, సంస్కృతి, భాష, భావజాలాన్ని అనుసరించినా వారంతా హిందువులే’’ అనిఆ కార్యక్రమంలో మోహన్ భగవత్ అన్నారు.

  18. కృష్ణ: ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన అంత్యక్రియలు

  19. రవీంద్ర జడేజా: ‘జాతీయ ప్లేయర్ ఒక పార్టీ తరఫున ప్రచారం చేయొచ్చా?’

  20. కీయెవ్ మీద రష్యా దాడుల్లో ఒకరు మృతి

    యుక్రెయిన్ రాజధాని కీయెవ్ మీద రష్యా జరిపిన మిసైల్స్ దాడిలో ఒకరు చనిపోయినట్లు ఆ నగర మేయర్ విటాలీ తెలిపారు.

    ఒక రెసిడెన్సియల్ బిల్డింగ్ నుంచి శవాన్ని సహాయక సిబ్బంది వెలికి తీసినట్లు వెల్లడించారు.