You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్‌కు క్లీన్ చిట్.. పార్టీ చేసుకున్నంత మాత్రాన అనుమానించలేమన్న న్యాయమూర్తి

సనా తన ప్రవర్తనతో దేశ ప్రతిష్ట, భద్రతకు భంగం కలిగించారని అప్పట్లో అనేక మంది ఫిర్యాదు చేశారు. కానీ, సనా తన చర్యను సమర్థించుకున్నారు.

లైవ్ కవరేజీ

  1. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి

    తెలంగాణ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంపై శుక్రవారం దాడి జరిగినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.

    హైదరాబాద్‌లోని ఆయన నివాసంపై టీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు దాడికి పాల్పడి వస్తువులను ధ్వంసం చేసినట్లు పేర్కొంది.

    తన ఇంటిపై దాడి జరిగినట్లు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి ట్వీట్ చేశారు.

    కేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాల మేరకు టీఆర్‌ఎస్ గుండాలు తన ఇంటిపై దాడి చేసినట్లు ట్వీట్‌లో ఆయన ఆరోపించారు.

    ఇంట్లో వస్తువులు పగలగొడుతూ బీభత్సం సృష్టించారని.. తన తల్లిని బెదిరించారని ఆయన ఆరోపించారు.

    కాగా... ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించారని, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే‌ని ఆమె సంప్రదించారని అరవింద్ గురువారం ఆరోపించారు.

    ఆ నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు చెబుతున్నారు.

    నోరు అదుపులో పెట్టుకోకపోతే చెప్పుతో కొడతా.. ఫేక్ డిగ్రీపై రాజస్థాన్ యూనివర్సిటీకి ఫిర్యాదు చేస్తా- కవిత

    నిజామాబాద్ ఎంపీ అరవింద్‌పై తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. మళ్లీ తన గురించి, పార్టీ మారడం గురించి మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పు తో కొడతా అని అన్నారు.

    ‘‘అరవింద్‌ది సంకుచిత మనస్తత్వం. ఆయనవి చిల్లర మాటలు. అనుకోకుండా ఎంపీ అయ్యారు. అరవింద్‌ది ఫేక్ డిగ్రీ. దీనిపై నేను రాజస్థాన్ యూనివర్సిటీ కి పిర్యాదు చేస్తా.

    నిన్న ప్రెస్‌మీట్‌లో ఆయన నీచంగా మాట్లాడారు. అరవింద్ భాష చూస్తుంటే ఇలాంటి రాజకీయాలు అవసరమా అనిపిస్తోంది. నేను సమస్యల మీద మాట్లాడతాను. వ్యక్తుల మీద ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ, అరవింద్ తీరు చూసి మాట్లాడక తప్పడం లేదు.

    మళ్లీ నా గురించి పార్టీ మారడం గురించి మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా. ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చినందుకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెబుతున్నా.

    అరవింద్ ఎక్కడ పోటీ చేసినా వెంటాడి ఓడిస్తా. కాంగ్రెస్‌లో చేరేందుకు నేను ఖర్గేతో మాట్లాడాను అనేది శుద్ధ తప్పు. నిజామాబాద్‌లో కాంగ్రెస్‌తో కుమ్మక్కై అరవింద్ నా మీద గెలిచారు’’ అని కవిత వ్యాఖ్యానించారు.

    మా సహనాన్ని చేతకానితనం అనుకోవద్దు: బండి సంజయ్

    కాగా ఎంపీ అరవింద్ ఇంటిపై దాడిని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఖండించారు.

    ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనే ధైర్యం లేకుండా ఇలా భౌతిక దాడులకు దిగుతారా అని ఆయన ప్రశ్నించారు.

    ప్రశ్నించే గొంతులను నొక్కినంతమాత్రాన తాము భయపడేది లేదని ఆయన అన్నరు.

    బీజేపీ చూపుతున్న సహనాన్ని చేతకానితనంగా భావించవద్దని.. తమ పార్టీ కార్యకర్తలు బరిలోకి దిగితే టీఆర్ఎస్ తట్టుకోలేదని సంజయ్ హెచ్చరించారు.

  2. భీమా కోరేగావ్ కేసు: ఆనంద్ తేల్‌తుంబ్డేకు బెయిల్.. అమలుపై వారం రోజులు స్టే

  3. తిరుమలలో ఆర్గానిక్ లడ్డూ, అన్నప్రసాదాలు.. సేంద్రియ ఉత్పత్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి

  4. నాన్సీ పెలోసీ: డెమొక్రటిక్ పార్టీ నాయకురాలి పదవికి వీడ్కోలు

    అమెరికా పార్లమెంట్ స్పీకర్ నాన్సీ పెలోసీ ప్రతినిధుల సభ (హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)లో పార్టీ నాయకురాలి పదవికి వీడ్కోలు పలికారు.

    82 ఏళ్ల నాన్సీ పెలోసీ అమెరికా కాంగ్రెస్‌లో అత్యంత శక్తిమంతమైన డెమొక్రాట్ నేత. పార్లమెంట్‌కు స్పీకర్‌గా వ్యవహరించిన తొలి మహిళ.

    ఆమె కాంగ్రెస్ దిగువ సభలో కాలిఫోర్నియా జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారు.

    మధ్యంతర ఎన్నికల తర్వాత హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో రిపబ్లికన్ పార్టీకి మెజారిటీ లభించింది. దీంతో స్పీకర్ పదవిని కూడా త్వరలో మరొకరు చేపట్టనున్నారు.

    రిపబ్లికన్ నాయకుడు కెవిన్ మైక్రార్థి తదుపరి స్పీకర్‌గా నామినేట్ అయ్యారు. ఆయన నాన్సీ పెలోసీ స్థానాన్ని భర్తీ చేయనున్నారు.

    నాన్సీ పెలోసీ జనవరి వరకు స్పీకర్ పదవిలో కొనసాగనున్నారు.

    డెమొక్రటిక్ పార్టీ నాయకుడిగా హకీమ్ జెఫ్రీజ్‌ను ఎన్నుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే అమెరికా చరిత్రలో ఈ పదవిని అధిష్టించిన తొలి నల్లజాతి నేత అవుతారు.

  5. వరల్డ్ కప్ ఓటమి తరువాత చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మతో సహా సెలెక్షన్ కమిటీ మీద బీసీసీఐ వేటు

  6. నెలలు నిండకుండా పుట్టే శిశువులను కాపాడే ‘‘కంగారూ కేర్’’ ఏమిటి?

  7. రోహిత్ శర్మ: 35 ఏళ్ల ఈ ‘డాడీస్ ఆర్మీ’ కెప్టెన్‌ను తీసేయాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు

  8. లైగర్ సినిమా పెట్టుబడుల మీద పూరీ జగన్నాథ్‌ను ప్రశ్నించిన ఈడీ

    హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మిలను అధికారులు ప్రశ్నించారు.

    లైగర్ సినిమాలో పెట్టుబడుల మీద ఈడీ ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయ నాయకులు ఈ సినిమాలో పెట్టుబడి పెట్టినట్లుగా ఈడీ అనుమానిస్తోంది. అలాగే విదేశాల నుంచి కూడా పెట్టుబడులు వచ్చినట్లుగా భావిస్తోంది.

    ఈమేరకు 15 రోజుల కిందటే పూరీ జగన్నాథ్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇవాళ పొద్దున్న పూరీ, ఛార్మి ఈడీ కార్యాలయానికి వచ్చారు.

    కొంత కాలంగా పూరీ, ఛార్మి కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు.

  9. తెనాలి: బ్యూటీ పార్లర్‌లోనే భార్యని హత్య చేసిన భర్త.. పూలదండలు వేసి నివాళి, పోలీసులకు లొంగుబాటు

  10. ఆన్‌లైన్ పార్ట్‌టైమ్ జాబ్స్ చేయాలనుకుంటున్నారా? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవీ..

  11. కిసాన్ క్రెడిట్ కార్డ్: రైతుకు రూ. 3 లక్షల లోన్, ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చు. ఎలాగంటే...

  12. భారతదేశంలో రిజర్వేషన్లు అమలులో లేని ఏకైక రాష్ట్రం ఇది.. ఎందుకు? ఇక్కడ ఏం జరుగుతోంది?

  13. దేనిపైనా త్వరగా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారా? అయితే తాజా పరిశోధన మీకో శుభవార్తే..

  14. భూమి మీది నీరంతా అంతరిక్షం నుంచి వచ్చిందేనా? ఇంగ్లండ్‌లో రాలిన ఉల్క దానికి సాక్ష్యమా?

  15. రుతుక్రమం సక్రమంగా జరగాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు?

  16. బిహార్: అనస్థీషియా ఇవ్వకుండానే అపరేషన్, తీవ్ర నొప్పితో మహిళలు విలవిల, చందన్ కుమార్ జజ్వాడే, బీబీసీ ప్రతినిధి

    బిహార్ రాష్ట్రం ఖగరియా జిల్లాలోని ఒక ఆరోగ్య కేంద్రంలో అనస్థీషియా ఇవ్వకుండానే 28 మంది మహిళలకు గర్భ నిరోధక ఆపరేషన్ చేశారు.

    నవంబర్ 15న ఈ ఘటన జరిగింది. ఆపరేషన్ సమయంలో మహిళలు అంతా నొప్పితో విలవిల్లాడారు.

    దీని గురించి ఖగరియా డీఎం రంజన్ ఘోష్, బీబీసీతో మాట్లాడారు.

    ‘‘మహిళలు అందరికీ లోకల్ అనస్థీషియా ఇచ్చాం. ఇది స్టాండర్డ్ ప్రొటోకాల్. లోకల్ అనస్థీషియా ఇచ్చి ఈ ఆపరేషన్ చేయొచ్చు. కానీ, కొందరు మహిళలకు అది సరిపోనట్లు అనిపిస్తుంది. అంటే వారి శరీరాలకు మరింత ఎక్కువ మోతాదులో లోకల్ అనస్థీషియా అవసరం. అందుకే వారికి నొప్పి కలిగింది. ఆపరేషన్ జరిగిన సగం మందిలో ఎలాంటి సమస్యలు లేవు’’ అని ఆయన చెప్పారు.

    మరోవైపు ఖగరియా సివిల్ సర్జన్ అమర్‌నాథ్ ఝా మాట్లాడుతూ తమ వద్ద వైద్య నిపుణుల కొరత ఉందని చెప్పారు. ఈ విషయాన్ని తాము చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లామని అన్నారు.

    అయితే తాజా ఘటనను విచారించి దోషులుగా తేలిన వారిని శిక్షిస్తామని ఆయన చెప్పారు.

  17. యుక్రెయిన్ యుద్ధ క్షేత్రంలో ప్రాణాలకు తెగించి సైనికుల ప్రాణాలు కాపాడుతోన్న వైద్య సిబ్బంది

  18. ‘‘రేపు ఎన్నికల్లో నన్ను గెలిపించకపోతే.. అదే నాకు చివరి ఎన్నిక’’ - ఏడాది కిందటి ప్రతిజ్ఞను గుర్తు చేసిన చంద్రబాబు

  19. గడ్డితో కరెంట్.. పంజాబ్‌లో ఏకంగా ఫ్యాక్టరీకే సప్లయ్ చేస్తున్నారు

  20. విక్రమ్ ఎస్: భారత్‌లో మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగానికి అంతా సిద్ధం