దిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరబిందో ఫార్మా ఎండీ అరెస్ట్?
దిల్లీ లిక్కర్ కుంభకోణం కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయని ఏఎన్ఐ వార్తా సంస్థ చెప్పింది.
దిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22, మనీ లాండరింగ్ కేసులో అరబిందో ఫార్మాకు చెందిన శరత్ చంద్రారెడ్డిని, వినయ్ కుమార్ అనే మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
వైసీసీ ఎంపీ విజయసాయిరెడ్డి బంధువైన శరత్ చంద్రారెడ్డి అరబిందో ఫార్మా కంపనీలో కీలక డైరెక్టర్ స్థానంలో కొనసాగుతున్నారు.
గతంలోనూ పలుమార్లు ఆయనను ఈడీ ప్రశ్నించింది.
హైదరాబాద్, దిల్లీ నగరాల్లోని శరత్ చంద్రారెడ్డి ఇళ్లు, ఆఫీస్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించినట్టుగా మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి.
అరెస్ట్ చేసిన ఇద్దరిని ఈరోజు మద్యాహ్నం ఈడీ కోర్టులో హాజరుపరచనున్నట్టుగా సమాచారం.