దిల్లీలో రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ..

ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

దిల్లీలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

ఈ నిర్ణయం మంగళవారం రాత్రి నుంచి ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉంటుందని దిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కరోనావైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

సోమవారం ఒక్కరోజునే దిల్లీలో 3,548 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 15 మంది చనిపోయారు.

మంగళవారం 5100 కొత్త కేసులు నమోదయ్యాయి. 17 మంది మృతి చెందారు.

ప్రస్తుతం నగరంలో 17,332 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

దిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 6, 85, 062గా ఉంది.

ఇక చండీఘడ్‌లో రేపటి నుంచి రాత్రి సమయంలో కర్ఫ్యూ అమలు చేయనున్నారు.

బహిరంగ ప్రదేశాల్లో జనం గుమిగూడటం, విందులు, వినోదాలకు అనుమతి లేదని అధికారులు చెప్పారు.

మరోవైపు, నటి కత్రినా కైఫ్‌కు కూడా కోవిడ్ 19 పాజిటివ్‌ నిర్ధరణ అయింది. ఆమె ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నారని ఏఎన్‌ఐ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)