You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
దిల్లీలో రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ..
దిల్లీలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
ఈ నిర్ణయం మంగళవారం రాత్రి నుంచి ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉంటుందని దిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కరోనావైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
సోమవారం ఒక్కరోజునే దిల్లీలో 3,548 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 15 మంది చనిపోయారు.
మంగళవారం 5100 కొత్త కేసులు నమోదయ్యాయి. 17 మంది మృతి చెందారు.
ప్రస్తుతం నగరంలో 17,332 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
దిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 6, 85, 062గా ఉంది.
ఇక చండీఘడ్లో రేపటి నుంచి రాత్రి సమయంలో కర్ఫ్యూ అమలు చేయనున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో జనం గుమిగూడటం, విందులు, వినోదాలకు అనుమతి లేదని అధికారులు చెప్పారు.
మరోవైపు, నటి కత్రినా కైఫ్కు కూడా కోవిడ్ 19 పాజిటివ్ నిర్ధరణ అయింది. ఆమె ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నారని ఏఎన్ఐ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఎవరిని సంప్రదించారు
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- కండోమ్స్, టైర్లు సహా ఎన్నో వస్తువుల తయారీలో వాడే విలువైన పదార్థం కనుమరుగైపోనుందా
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్షాలయ్యారు
- దేశంలో మళ్లీ లాక్డౌన్.. ఎక్కడెక్కడంటే
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)