You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేస్తాడా?
భారత్, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్లో చివరి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆట 58 ఓవర్లే జరిగింది.
రాంచీలో ఆడుతున్న టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు వెలుతురు సరిగా లేక అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఆ సమయానికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది.
ఆట ఆగిపోయే సమయానికి రోహిత్ శర్మ 117, అజింక్య రహానే 83 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఈ ఇద్దరూ ఇప్పటివరకూ నాలుగో వికెట్కు 185 పరుగులు జోడించారు.
అంతకు ముందు భారత్ బ్యాటింగ్ చాలా ఘోరంగా మొదలైంది. 39 పరుగులకే భారత్ 3 వికెట్లు కోల్పోయింది.
మయంక్ అగ్రవాల్ 10 పరుగులకు రబాడా బౌలింగ్లో పెవిలియన్కు చేరగా, చతేశ్వర్ పుజారా కూడా రబాడా బౌలింగ్లో ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు.
కెప్టెన్ విరాట్ కోహ్లీ 12 పరుగులు చేసి ఎన్రిక్ నార్ట్జేకు ఎల్బిడబ్ల్యు అయ్యాడు.
ఆ తర్వాత రోహిత్ శర్మ, అజింక్య రహానే భారత జట్టును ఆదుకున్నారు. మరో వికెట్ పడకుండా భారీ భాగస్వామ్యం అందించారు.
రోహిత్ పేరిట మరో రెండు...
రోహిత్ శర్మ ఈ సిరీస్లో తన మూడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే రెండో రోజు ఈ స్కోరును అతడు భారీ స్కోరుగా మలచాల్సి ఉంటుంది. మొత్తం మీద రోహిత్కు టెస్ట్ కెరీర్లో ఇది ఆరో సెంచరీ.
ఈ సెంచరీతో రోహిత్ శర్మ మరో ఘనత అందుకున్నాడు. భారత మాజీ ఓపెనర్ సునీల్ గాస్కర్ తర్వాత ఒక ఓపెనర్ ఒకే సిరీస్లో మూడు సెంచరీలు కొట్టడం ఇదే మొదటిసారి.
రోహిత్ శర్మ తన 117 పరుగుల ఇన్నింగ్స్లో 14 ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టాడు. వీటితో కలిపి ఇప్పటివరకూ ఈ సిరీస్లో ఇప్పటివరకూ అతడు 17 సిక్సర్లు కొట్టాడు. ఒక టెస్ట్ సిరీస్లో అత్యధిక సిక్సర్ల రికార్డు నెలకొల్పాడు.
రోహిత్ శర్మకు ముందు ఈ రికార్డు వెస్టిండీస్ క్రికెటర్ ఎస్.హెట్మెయర్ పేరుతో ఉండేది. అతడు 2018-19 బంగ్లాదేశ్తో జరిగిన సిరీస్లో 15 సిక్సర్లు కొట్టాడు.
ఇవి కూడా చదవండి:
- IND Vs SA రెండో టెస్టు: ఇన్నింగ్స్ 137 పరుగులతో భారత్ విజయం
- రోహిత్ శర్మ: టెస్టుల్లో అత్యధిక సిక్సర్ల రికార్డ్ బ్రేక్
- క్రికెట్: భారత్లో బెట్టింగ్ చట్టబద్ధమైతే ఏమవుతుంది? బుకీలు ఏమంటున్నారు?
- గుర్తింపు గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు, ఆటపైనే నా దృష్టి: కోనేరు హంపి
- ఇక చరిత్రను తిరగరాయాల్సిందేనా?
- హైదరాబాద్ ఖజానా నుంచి పాకిస్తాన్కు చేరిన 3.5 కోట్ల పౌండ్ల సొమ్ము దక్కేది ఎవరికి?
- సెప్టెంబర్ 17: విలీనమా? విమోచనా?... 1948లో జరిగిన హైదరాబాద్ విలీనాన్ని ఎలా చూడాలి?- అభిప్రాయం
- అడ్వాణీని కోలుకోలేకుండా చేసిన ఆ ఒక్క తప్పు
- గోధ్రా కేసు: మరణ శిక్ష పడిన దోషులందరికీ శిక్ష తగ్గింపు
- హార్దిక్ పటేల్: ‘పటేళ్లలో సింహం’
- గుజరాత్: బ్రెజిల్కు ఆనాడు ఆవుల్ని, ఎద్దుల్ని ఇచ్చి.. ఇప్పుడు వీర్యం అడుగుతోంది
- ఇస్లామిక్ యోగా: యోగా క్లాసుల్లో అల్లా ప్రార్థనలు చేస్తున్న గుజరాత్ ముస్లిం మహిళలు
- మోదీ వల్ల పాకిస్తాన్లో కశ్మీర్పై చర్చ స్వరూపమే మారిపోయిందా...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)