You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ కుమార్, బూడిద భిక్షమయ్య గౌడ్‌ టీఆర్ఎస్‌లో చేరిక

కేటీఆర్ సమక్షంలో మాజీ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ కుమార్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమ నాయకులు మళ్లీ సొంతగూటికి చేరుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు.

లైవ్ కవరేజీ

  1. నేను ‘మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నా-ట్విటర్ లో వెల్లడించిన సమంత

    ‘‘నేను గత కొన్ని నెలల నుంచి ‘మయో సైటిస్’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాను. ప్రస్తుతం ఆటో ఇమ్యూనిటీ కండీషన్ చికిత్స తీసుకుంటున్నాను. నా ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా’’ అంటూ సినీనటి సమంతా ఒక ట్వీట్‌ చేశారు.

    ఈ వ్యాధి చికిత్సకు అనుకున్న దానికన్నా ఎక్కువ సమయమే పట్టేలా ఉందని ఆమె తన సుదీర్ఘ ట్వీట్‌లో అన్నారు.

    తాను గతంతో శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నానని ఆమె ఈ ట్వీట్ లో పేర్కొన్నారు.

    ఒక్కోసారి ఇలాంటి సమస్యలను ఎదుర్కోగలనా అని ఆందోళన కలిగేదని, అయితే, ఎలాగోలా తాను వాటి నుంచి బయటకు వచ్చానని సమంత అన్నారు. ఈ వ్యాధి వేగంగానే తగ్గిపోతుందని డాక్టర్లు కూడా భరోసా ఇచ్చినట్లు పేర్కొన్నారు.

    యశోద సినిమా ట్రైలర్ వస్తున్న ఆదరణ పట్ల సమంత సంతోషం వ్యక్తం చేశారు.

    సమంతా ఈ ట్వీట్ లో ఒక ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోలో ఆమె చేతికి ప్లాస్టర్, సెలైన్ పైప్ కనిపిస్తోంది.

  2. 'ఆడపిల్లలు పుట్టారని నాన్న వదిలేశారు...అమ్మ అండతో డాక్టర్ అవుతా'

  3. ట్రాన్స్ జెండర్ పాత్రలను కూడా మామూలు నటులతోనే చేయించాలా ? ఈ అభ్యంతరాలు ఎందుకు వినిపిస్తున్నాయి

  4. పాకిస్తాన్ సరిహద్దుల్లో సైనిక విమానాశ్రయం నిర్మిస్తున్న భారత్...దీని లక్ష్యాలేంటి?

  5. ఆ ఊళ్లో సగంమంది లారీ డ్రైవర్లే

  6. చర్చిలో స్నేహం చేసింది.. ఆస్తి కోసం ఆమెను చంపి తల, మొండెం వేరుచేసి దూరంగా పడేసింది

  7. దిల్లీ - బెంగళూరు ఇండిగో విమానం ఇంజిన్‌లో మంటలు

    దిల్లీ నుంచి బెంగళూరు వెళ్లాల్సిన ఇండిగో విమానం ఇంజిన్‌లో మంటలు కనిపించడంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.

    టేకాఫ్‌కు కొద్ది సేపటి ముందు మంటలను గుర్తించడంతో ప్రమాదం తప్పింది.

    శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.

    దిల్లీ నుంచి బెంగళూరు వెళ్లాల్సిన ఇండిగో విమానం 6E-2131 టేకాఫ్ కావడానికి ముందు ఈ విషయం గుర్తించారు.

    ప్రయాణికులను అందరినీ సురక్షితంగా కిందకు దించి వేరే విమానంలో బెంగళూరు పంపించారు.

    ప్రమాద సమయానికి విమానంలో 177 మంది ప్రయాణికులు ఏడుగురు సిబ్బంది ఉన్నారు.

    వెనుక ఉన్న విమానం నుంచి మంటలను చూసి..

    టేకాఫ్‌ కోసం రన్‌వేపై ఉన్న ఇండిగో విమానం వెనుక స్పైస్ జెట్ విమానం ఇంకోటి ఉంది.

    ఆ స్పైస్ జెట్ విమాన పైలట్ ఇండిగో విమాన ఇంజిన్‌లో మంటలను గుర్తించి కంట్రోల్ రూమ్‌కి సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు.

    ఆ వెంటనే కంట్రోల్ రూం నుంచి ఇండిగో విమానం పైలట్‌కు సమాచారం రావడంతో టేకాఫ్ నిలిపివేశారు.

    కాగా ఈ ఘటనపై డీజీసీఏ దర్యాప్తు చేయనుంది.

    విమానం ఇంజిన్లో మంటలకు సంబంధించిన కొన్ని వీడియలో సోషల్ మీడియాలో కనిపించాయి.

  8. ‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసినట్లు తేలితే అమిత్ షా ను అరెస్టు చేయాలి’’: దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా

  9. ఇక ట్విటర్ క్రిప్టోకరెన్సీ చెల్లింపులను అంగీకరిస్తుందా

  10. తెలంగాణ: బావిలో పడ్డ కారు... నలుగురు మృతి

    మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో బైపాస్ రోడ్‌లో గల పాడుబడ్డ బావిలో కారు అదుపు తప్పి పడింది.

    కారులో ఏడుగురు ఉండగా ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయినట్లు బీబీసీకి మహబూబాబాద్ పోలీసులు తెలిపారు.

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి చెందిన ఐదుగురు వరంగల్‌ జిల్లా అన్నారం షరీఫ్‌ వచ్చి.. తిరిగి వెళ్తున్న క్రమంలో మహబూబాబాద్‌కు చెందిన మరో ఇద్దరు బంధువులను కూడా కారులో ఎక్కించుకున్నారు.

    కేసముద్రం బైపాస్‌ రోడ్డులో మలుపు వద్దకు రాగానే కారు అదుపు తప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది.

    ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు.

  11. ‘ఫాంహౌస్‌లో ముందే సీసీ కెమెరాలు పెట్టాం...రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాం’-హైకోర్టుకు చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

  12. కరెన్సీ నోట్లపై దేవతల బొమ్మలు ముద్రిస్తారా?-వీక్లీ షో విత్ జీఎస్

  13. నెల జీతంలాగా స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే మార్గమిది, ఎవరు చేరొచ్చు, తెలుసుకోవాల్సిన విషయాలేంటి

  14. వ్యభిచారం చేస్తోందని మాజీ భర్త ఆరోపణ, రాళ్లతో కొట్టి చంపమని కోర్టు తీర్పు, ఆమెను రక్షించేవారే లేరా

  15. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా బండి సంజయ్ ప్రమాణం

    ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

    ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

    ఈ మేరకు ఆయన యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వెళ్లారు.

    తడి బట్టలతో ఆలయంలోకి ప్రవేశించి తాము ఎలాంటి తప్పు చేయలేదంటూప్రధాన గుడి లోపల ప్రమాణం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో తమకు సంబంధం లేదని పునరుద్ఘాటించారు.

    కేసీఆర్ కూడా ఈ సవాలును స్వీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.

  16. పాకిస్తాన్, జింబాబ్వే మ్యాచ్ తర్వాత మిస్టర్ బీన్ పేరు ఎందుకు ట్రెండ్ అవుతోంది?

  17. రిషి సునక్‌కు నరేంద్రమోదీ కంగ్రాట్స్ చెప్పారు. కానీ, షీ జిన్‌పింగ్‌‌కు ఎందుకు చెప్పలేదు?

  18. ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

  19. 72 మంది సభ్యుల ఉమ్మడి కుటుంబం: ‘మా ఇంట్లో ఒకపూట కూరగాయల ఖర్చు రూ.1200, నాన్ వెజ్ ఖర్చు రూ.5 వేలు.. సిలిండర్ 4 రోజుల్లో అయిపోతుంది’

  20. నోట్లపై లక్ష్మీ, గణేశ్ చిత్రాలను ముద్రించాలంటూ ప్రధాని మోదీకి అరవింద్ కేజ్రీవాల్ లేఖ

    భారత కరెన్సీ నోట్లపై హిందువుల దేవుళ్లు అయిన గణేశ్-లక్ష్మీ చిత్రాలను ముద్రించాలని కోరుతూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి లేఖ రాశారు.

    శుక్రవారం ట్విటర్‌లో ఆ లేఖను కేజ్రీవాల్ షేర్ చేశారు.

    ‘‘దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు భారతీయ కరెన్సీలో ఒక వైపు గాంధీజీ, మరొక వైపు దేవతామూర్తులైన గణేష్‌, లక్ష్మీదేవీల చిత్రాలు ఉండాలని కోరుకుంటున్నారు.నేడు దేశ ఆర్థిక వ్యవస్థ చాలా దారుణమైన స్థితిలో ఉంది.

    స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా భారతదేశాన్ని ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే పరిగణిస్తున్నారు. నేటికీ మన దేశంలో పేదవారి సంఖ్య ఇంత ఎక్కువగా ఎందుకు ఉంది?’’ అని ఆ లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నారు.

    దేశ ప్రజలంతా కష్టపడి పనిచేయడంతో పాటు మన ప్రయత్నాలు సఫలం కావాలంటే భగవంతుని ఆశీస్సులు కూడా ఉండాలని ఆయన లేఖలో రాశారు.

    అరవింద్ కేజ్రీవాల్ రెండు రోజుల క్రితం మీడియా సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తారు.

    ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశమైన ఇండోనేసియా నోట్లపై గణేశ్ చిత్రం ఉన్నప్పుడు... భారత్ అలా ఎందుకు చేయకూడదని ఆయన ప్రశ్నించారు.