You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ

‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.

లైవ్ కవరేజీ

చిట్టత్తూరు హరికృష్ణ

  1. రిషి సునక్: బ్రిటన్ ప్రధాని రేసులో రెండవ రౌండ్‌లో ముందంజ

    రిషి సునక్ బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో రెండవ రౌండ్‌లో కూడా ముందజలో ఉన్నారు. రెండో దశ పోలింగ్‌లో సునక్ 101 మంది ఎంపీల మద్దతును గెలుచుకున్నారు. తన సమీప ప్రత్యర్థి పెన్నీ మోర్డంట్ కంటే 18 ఓట్లు ఎక్కువ సాధించారు.

    బ్రిటన్‌లో బోరిస్ జాన్సన్ రాజీనామాతో కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వానికి, బ్రిటన్ ప్రధానమంత్రి అభ్యర్ధిత్వానికి పోటీ మొదలైంది. భారత మూలాలున్న మాజీ ఛాన్సలర్ రిషి సునక్ ఈ పోటీలో ముందంజలో ఉన్నారు.

    మొదటి రౌండ్‌లో సునక్ 88 ఓట్లతో అగ్రస్థానంలో ఉండగా, వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డంట్ 67 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు.

    రెండవ రౌండ్‌లో కూడా సునక్ ఆధిపత్యం కనబరిచారు. ఈ రౌండ్‌లో సునక్‌కు 101 ఓట్లు, పెన్నీ మోర్డంట్‌కు 83 ఓట్లు, లిజ్ ట్రాస్‌కు 64 ఓట్లు, కెమీ బాడెనోక్‌కు 49 ఓట్లు, టామ్ టుగెన్‌థాట్‌కు 32 ఓట్లు వచ్చాయి.

    రెండో రౌండ్ ఓటింగ్‌లో అటార్నీ జనరల్ సుయెల్లా బ్రవర్‌మాన్‌కు అత్యల్పంగా 27 ఓట్లు వచ్చాయి. దాంతో, ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రతి దశలో 30 కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినవారే తదుపరి దశ ఎన్నికలకు వెళతారు.

    మూడవ రౌండ ఓటింగ్ వచ్చే సోమవారం జరగనుంది. దీనికి ముందు, అయిదుగురు అభ్యర్థులు శుక్రవారం ఛానల్-4 చర్చలో పాల్గొంటారు.

    వచ్చేవారానికి ఈ పోటీలో ఇద్దరే మిగులుతారన్నది లెక్క. వారిలో ఒకరిని కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా, ప్రధానమంత్రిగా ఎన్నుకునే బాధ్యత టోరీ సభ్యులపై ఉంటుంది. ఈ దశలో సుమారు 160,000 టోరీ సభ్యులు (కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు) తమ ప్రియతమ నాయకుడికి ఓటు వేస్తారు.

    సెప్టెంబర్ 5న చివరి దశ ఫలితాలు వెల్లడిస్తారు.

    బోరిస్ జాన్సన్ మంత్రి వర్గం నుంచి వైదొలిగిన తొలి ఇద్దరు మంత్రులలో రిషి సునక్ మొదటివారు. బోరిస్ జాన్సన్ రాజీనామాతో కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వానికి, బ్రిటన్ ప్రధానమంత్రి అభ్యర్ధిత్వానికి ఆయన పోటీలోకి దిగారు. బోరిస్ జాన్సన్ క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా వ్యవహరించేవారు.

    సునక్ తరువాత చాలా మంది నాయకులు, ఎంపీలు రాజీనామా చేశారు. చివరికి బోరిస్ జాన్సన్ కూడా పార్టీ నాయకుడి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆయన బ్రిటన్ ప్రధానిగా కొనసాగుతారు.

  2. జాతీయ చిహ్నంలో సింహాలు క్రూరంగా కనపడేలా మార్చారా, ఆర్కిటెక్ట్ చెప్పిన విషయాలేంటి

  3. గోదావరి వరదలు: జులై నెలలో ఈ స్థాయి వరద వందేళ్లలో ఇదే తొలిసారి..

    గోదావరి వరదల తాకిడితో తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయి.

    కడెం, శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో తగ్గడంతో కొన్ని ప్రాంతాలు తేరుకున్నాయి. కానీ కాళేశ్వరం దిగువన తెలంగాణలోని అనేక మండలాలు వరద ముంపులో కనిపిస్తున్నాయి.

    అదే సమయంలో భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆరు జిల్లాల్లోని వందల గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. పోలవరం ముంపు మండలాలతో పాటుగా, గోదావరి లంకలు, కోనసీమ గ్రామాల ప్రజలు భయాందోళనతో గడపాల్సి వస్తోంది.

  4. దేశాధ్యక్షుడి రాజీనామాతో శ్రీలంకలో సంబరాలు

    శ్రీలంక నుంచి పారిపోయిన ఆ దేశ అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష ఎట్టకేలకు అధికారికంగా రాజీనామా చేశారు. శ్రీలంకలో నిరసనలు పతాక స్థాయికి చేరుకోవడంతో రాజపక్ష దేశం విడిచి సింగపూర్‌కు పారిపోయారు.

    పదవి నుంచి వైదొలిగిన వెంటనే అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని భావించడంతో రాజపక్ష ముందే దేశం విడిచి పారిపోయరనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    రాజపక్ష రాజీనామా లేఖను అందుకున్నట్లు శ్రీలంక స్పీకర్ ధృవీకరించారు. దీంతో, అధ్యక్షుడు అధికారికంగా రాజీనామా చేసినట్టు లెక్క.

    దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణిల్ విక్రమసింఘే వ్యవహరిస్తారని స్పీకర్ మహింద యాపా అభయవర్ధన వెల్లడించారు. తదుపరి చర్యలు ప్రజాస్వామ్యయుతంగా, పారదర్శకంగా జరుగుతాయని స్పీకర్ తెలిపారు.

    రేపు జూలై 16న అధ్యక్షుడి ఎన్నిక కోసం పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. శాంతిభద్రతలను కాపాడాలని నిరసనకారులకు స్పీకర్ విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు, ఎంపీలందరూ పార్లమెంట్ ప్రక్రియలో పాల్గొనాలని కోరారు.

    రాజపక్ష రాజీనామాతో శ్రీలంక రాజధాని కొలొంబోలో సంబరాలు చోటుచేసుకున్నాయి. ఈ వార్త విన్న వెంటనే నిరసనకారులు డాన్సులు చేస్తూ వేడుక చేసుకున్నారు.

    "పట్టరానంత ఆనందంగా ఉంది. అంతకన్నా ఎక్కువ ఉపశమనంగా ఉంది. ఇక మేమంతా వెనక్కు వెళ్లి మా పనులు చేసుకోవచ్చు. ఇప్పటికే మేం చాలా అలిసిపోయాం. ఈ క్షణాన్ని మేం విజయంగా భావిస్తున్నాం" అని విరాగ పెరేరా బీబీసీతో అన్నారు.

    రాజపక్ష ముందుగా మంగళవారం రాత్రి మాల్దీవ్స్‌కు పారిపోయి, అక్కడి నుంచి గురువారం ఉదయం సింగపూర్ చేరుకున్నారు. ఆయన భార్య, ఇద్దరు బాడీగార్డులు కూడా ఆయన వెంట ఉన్నారని రిపోర్టులు వచ్చాయి.

    రాజపక్ష తమ దేశంలో ఆశ్రయం కోరలేదని, ఆశ్రయం పొందలేదని సింగపూర్ విదేశాంగ శాఖ పేర్కొంది.

    "సింగపూర్ సాధారణంగా ఆశ్రయం కోసం అభ్యర్థనలను స్వీకరించదు" అని పేర్కొంది.

  5. భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో గోదావరి నదిలో వరదనీటి ప్రవాహం

  6. గోదావరి వరదలు: జులై నెలలో ఈ స్థాయి వరద వందేళ్లలో ఇదే తొలిసారి , ముంపు గ్రామాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి?

  7. బ్రేకింగ్ న్యూస్, గొటాబయ రాజపక్ష రాజీనామా

    శ్రీలంక నుంచి పారిపోయిన ఆ దేశ అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష ఎట్టకేలకు అధికారికంగా రాజీనామా చేశారు.

    ఈమేరకు రాజీనామా లేఖను ఈమెయిల్ ద్వారా స్పీకర్‌కు పంపించారు. చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసి శుక్రవారం అధికారికంగా రాజీనామాను వెల్లడిస్తామని స్పీకర్ తెలిపారు.

    తొలుత మాల్దీవులకు వెళ్లి అక్కడి నుంచి ఆయన సింగపూర్ చేరుకున్నారు.

  8. మోదీ పార్లమెంటు కొత్త భవనంపై మూడు సింహాల విగ్రహాన్ని ఆవిష్కరించడం రాజ్యాంగ విరుద్ధమా?

  9. కేటీఆర్ తరచూ వాడే 'జుమ్లా’ అనే మాటను ‘అన్‌పార్లమెంటరీ’ పదంగా ప్రకటించిన పార్లమెంట్

  10. విరాట్ కోహ్లీ కెరియర్ ప్రమాదంలో పడిందా, వెస్టిండీస్ వెళ్లే టీ20 జట్టులో ఎందుకు స్థానం దక్కలేదు?

  11. క్యాన్సర్‌ ఉన్నట్లు గోళ్ల మీద కనిపించే రంగులు, మచ్చలు కూడా చెప్పగలవా, నిపుణులు ఏమంటున్నారు?

  12. ‘ద వారియ‌ర్': డాక్ట‌ర్ చేసిన `పోలీస్‌` ట్రీట్‌మెంట్‌

  13. దిల్లీలోని శ్రీలంక హై కమిషన్ వద్ద భారీగా భద్రత

    దిల్లీలోని శ్రీలంక హై కమిషన్ కార్యాలయం వద్ద భద్రత భారీగా పెంచారు. నిరసనలు చోటు చేసుకునే అవకాశం ఉందని సమాచారం రావడంతో ఈ చర్యలు తీసుకున్నారు.

    మరొకవైపు పరారీలో ఉన్న శ్రీలంక అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష మాల్దీవుల నుంచి సింగపూర్‌కు వెళ్లి పోయారు.

    శ్రీలంకలో శాంతి భద్రతలను కాపాడే పనిని ఆ దేశ సైన్యం తీసుకుంది. ఇప్పటికే అధ్యక్ష భవనం నుంచి నిరసనకారులను ఖాళీ చేయించి తమ అధీనంలోకి తెచ్చుకుంది.

  14. సౌదీ ఎయిర్‌లైన్స్‌లో సింగపూర్‌కు గొటాబయ రాజపక్ష!

    శ్రీలంక అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష మాల్దీవుల నుంచి సౌదీ ఎయిర్‌లైన్ విమానంలో సింగపూర్ బయలుదేరినట్లు అధికారిక వర్గాలు బీబీసీకి వెల్లడించాయి.

    ఆర్థిక సంక్షోభం నడుమ శ్రీలంకలో హింసాత్మక నిరసనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో.. గొటాబయ మాల్దీవులకు పారిపోయారు. ప్రస్తుతం సింగపూర్‌లోనే ఉంటారా? లేదా అక్కడ నుంచి వేరే చోటుకు వెళ్తారా? అనే విషయంలో స్పష్టత లేదు.

    జులై 13న రాజీనామా చేస్తానని గతంలో గొటాబయ రాజపక్ష ప్రకటించారు. కానీ ఇంతవరకు ఆయన అధికారికంగా రాజీనామా సమర్పించలేదు.

    రాజీనామా చేసే లోపు ఏదో ఒక దేశానికి వెళ్లిపోవాలని గొటాబయ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ను అరెస్టు చేయకుండా మినహాయింపు ఉంటుంది.

    ఒకసారి ఆయన రాజీనామా చేశాక కొత్త ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేసే అవకాశముంటుంది. అందుకే ఆయన విదేశాలకు వెళ్లిపోవాలని భావించినట్లు మీడియాలో విశ్లేషణలు వస్తున్నాయి.

    అపద్ధర్మ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న రణిల్ విక్రమసింఘె శ్రీలంకలో కర్ఫ్యూ విధించారు.

  15. ఈ ఆర్థిక, రాజకీయ సుడిగుండం నుంచి శ్రీలంక ఇప్పటికిప్పుడు బయటపడగలదా, ఏం చేయాలి?

  16. యూట్యూబ్ వీడియోలతో ఇల్లు, కారు కొనుక్కున్న గణేశ్

  17. తెలంగాణలో వానలు తగ్గినా వరదల భయం తీవ్రంగా ఉంది

    వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా వరదల భయం ఉత్తర తెలంగాణను వెంటాడుతోంది. మహారాష్ట్ర లాంటి ఎగువ ప్రాంతాల నుండి భారీ వరద నీరు ఇంకా చేరుతూనే ఉండటంతో ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి.

    నిన్న కడెం ప్రాజెక్ట్ వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. సామర్థ్యానికి మించి వరద ప్రవాహం చేరుతుండటంతో గేట్లు అన్నీ ఎత్తివేసిన అధికారులు ఓ సందర్భంలో చేతులెత్తేసి ప్రాజెక్ట్ నుంచి బయటికి వచ్చారు. మధ్యాహ్నం కాస్త వరద తగ్గినట్టే తగ్గి, ఆ తర్వాత మళ్లీ పెరిగింది. అదే సమయంలో లెఫ్ట్ కెనాల్, పవర్ హౌజ్, హరిత రిసార్ట్ సమీపంలో మూడు చోట్ల కట్టకు గండి పడింది. దీంతో ప్రాజెక్ట్ తెగిపోతుందన్న పుకార్లు చెలరేగాయి. దానికి తోడు నీటిపారుదలశాఖ అధికారులు ఎవరూ ప్రాజెక్ట్ వద్ద లేకపోవడం, ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లోలకు సంబందించిన ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఎప్పుడేమవుతోందన్న భయాందోళనలు వ్యక్తం అయ్యాయి.

    కడెం ప్రాజెక్ట్ సేఫ్‌గానే ఉందని, వరద తగ్గుముఖం పట్టిందని నిర్మల్ జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటనతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కింద ముంపుకు గురైన 12 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో ఉంచారు. ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో తగ్గింది. 17 గేట్ల ద్వారా లక్ష 83 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో ప్రాజెక్ట్‌కు ముప్పు తప్పినట్టే అని భావిస్తున్నారు. నిర్మల్ నుంచి మంచిర్యాల వెళ్లే రహదారి పలు చోట్ల దెబ్బతింది.

    మరోవైపు, కడెం ప్రాజెక్ట్ ద్వారా భారీ ప్రవాహం గోదావరి ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు చేరింది. 54 గేట్లు ఓపెన్ చేసి 12 లక్షల క్యూసెక్కుల మేర వరద దిగువకు వదలడంతో దాని ప్రభావం పక్కనే ఉన్న మంచిర్యాల పట్టణంపై పడింది. పలు కాలనీల్లోకి నీరు ప్రవేశించింది. రాళ్లవాగు, తోళ్ల వాగు ప్రవాహాలను గోదావరి వెనక్కి తన్నుతుండటంతో ఆ నీరు కాస్తా కాలనీల్లోకి వచ్చింది. మంచిర్యాల,చెన్నూరు లకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

    గోదావరి ప్రవాహ ప్రాంతాల్లో పరిస్థితి దయణీయంగా మారింది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ భారీఅవుట్ ఫ్లో తో గోదావరిఖని వద్ద గోదావరి బ్రిడ్జి పై నుంచి నీరు ప్రవహించింది. దీంతో అటువైపుగా వెళ్లే వాహనాలను పోలీసులు నిలిపివేశారు. గోదావరిఖని, మంచిర్యాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి.

    పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంపై కూడా గోదావరి వరద ప్రభావం పడింది. పోలీస్ స్టేషన్‌తో పాటు పలు కాలనీల్లోకి నీరు ప్రవేశించింది. స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ప్రభావిత కాలనీల్లో పర్యటించారు.

    కరీంనగర్ సమీపంలోని నగునూరు వాగు ప్రవాహంలో ఇటుకబట్టీల్లో పనిచేసే 9 మంది కూలీలు చిక్కుకుపోవడంతో కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ డీఆర్ఎఫ్ (డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాలను మంత్రి గంగుల కమలాకర్ రెస్క్యూ ఆపరేషన్ కు ఆదేశించారు.

    గోదావరిఖని సింగరేణి ఇంటెక్ వెల్ లో 6 గురు కార్మికులు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

    కొమురం భీము ఆసిఫాబాద్ జిల్లా దహేగాం వద్ద ఓ గర్బిణీని వాగు దాటిస్తున్న క్రమంలో సింగరేణి రెస్క్యూ టీమ్ కు చెందిన ఇద్దరు గల్లంతై నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు.

    ఉమ్మడి మెదక్ జిల్లాల్లో వరద ప్రభావ ప్రాంతాలను మంత్రి హరీష్ రావ్ పర్యటించారు. హవేళీ ఘణపూర్ లో కొట్టుకుపోయిన బ్రిడ్జీలను పరిశీలించారు. త్వరలోనే రోడ్లు, బ్రిడ్జిల పనులు చేపడతామని చెప్పారు. నిర్వాసితులకు వెంటనే వసతి, భోజన సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు.

    ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వర్షం వల్ల తలెత్తిన పరిస్థితులపై జనగామ జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చేపట్టాల్సిన చర్యలు, పునరావాసం తదితర అంశాలపై అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అంతకు ముందు ఆయన పలు గ్రామాల్లో పర్యటించారు.

    ఇక ఉత్తర తెలంగాణలోని ప్రాజెక్టులు అన్నీ దాదాపుగా నిండిపోయాయి. నిన్న నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టును మంత్రి ప్రశాంత్ రెడ్డి సందర్శించి అధికారులకు సూచనలు చేసారు. ఎగువ మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదకు అనుగుణంగా ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ లో 75 టీఎంసీల వద్ద స్థిరంగా నిల్వ ను ఉంచి మిగులు జలాలు దిగువకు వదలుతున్నట్టుగా తెలిపారు.

    కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీకి గోదావరి, ప్రాణహితల నుండి భారీ ప్రవాహం కొనసాగుతోంది.

    భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో ఇళ్లు, స్కూలు భవనాలు, చెట్లు , విద్యుత్ స్థంభాలు నేలకూలాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణలో ఆదివారం వరకు ప్రభుత్వ, ప్రైవేట్,ఎయిడెట్ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

  18. ఏపీ-కోనసీమ: అంబేడ్కర్ బొమ్మతో పేపర్ ప్లేట్లు, ఇదేమిటని అడిగిన వారినే పోలీసులు జైల్లో పెట్టారు... అసలేం జరిగింది?

    గోపాలపురం. ప్రస్తుతం కోనసీమ జిల్లాలో ఉన్న ఓ గ్రామం ఇది. కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలకు సరిహద్దు గ్రామం. ఎన్‌హెచ్-16 మీదుగా గోదావరిపై సిద్ధాంతం వద్ద వంతెన దాటగానే గోపాలపురం ఉంటుంది.

    ఇది పాలక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి స్వగ్రామం. ఈ గ్రామంలో ఓ చిన్న హోటల్ వద్ద ఫాస్ట్‌ఫుడ్ అందించే పేపర్ ప్లేట్లపై రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ బొమ్మ ముద్రించడం వివాదాస్పదమైంది.

    ఈ ప్లేట్లపై కొందరు అభ్యంతరం తెలిపారు. అయితే, నిరసన వ్యక్తంచేసిన వారు వారం పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. దీనికి కారణమేంటి? గోపాలపురంలో ఏం జరుగుతోంది?

  19. ఎలాన్ మస్క్ vs. ట్విటర్: 44 బిలియన్ డాలర్లతో డీల్ సెటిల్ చేసుకుని వెనక్కి తగ్గిన మస్క్‌పై కేసు వేసిన ట్విటర్

  20. శ్రీలంక: ‘శాంతి పునరుద్ధరణ కోసం ఏం కావాలన్నా చేయండి’ – సైన్యానికి ప్రధాని సూచన

    శ్రీలంకలో ఆందోళనకారులు బుధవారం నాడు ప్రధానమంత్రి కార్యాలయంలోకి దూసుకురావటంతో.. దేశంలో శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం ఏం కావాలన్నా చేయాలని సైన్యానికి ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే సూచించారు.

    దేశం విడిచి పారిపోయిన అధ్యక్షుడు గొటబయ రాజపక్ష.. ప్రధానిగా ఉన్న రణిల్ విక్రమసింఘేను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు.

    శ్రీలంక స్వాతంత్ర్యానంతరం ఎన్నడూ చూడనంత తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభానికి కారణం రాజపక్ష కారణమని చాలా మంది నిందిస్తున్నారు. మే నెలలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రణిల్ కూడా ఈ సమస్యలో భాగమని భావిస్తున్నారు.

    ఆదివారం నాడు అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్లి, దానిని ఆక్రమించుకున్న ఆందోళనకారులు.. బుధవారం నాడు ప్రధానమంత్రి కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు.

    ఆందోళనకారులు తన కార్యాలయాన్ని, ఇతర ప్రభుత్వ భవనాలను విడిచి వెళ్లాలని, యంత్రాంగానికి సహకరించాలని రణిల్ విక్రమసింఘే టెలివిజన్‌లో మాట్లాడుతూ పిలుపునిచ్చారు.

    ‘‘మన రాజ్యాంగాన్ని మనం చించివేయలేం. దేశాన్ని ఫాసిస్టులు హస్తగతం చేసుకోనివ్వకూడదు. ప్రజాస్వామ్యానికి ఈ ఫాసిస్టు ముప్పును మనం అంతమొందించాలి’’ అని ఆయన పేర్కొన్నారు.

    అయితే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వెళ్లిపోవటానికి ఆందోళనకారులు తిరస్కరిస్తున్నారు. గొటబయ వైదొలగటంతో పాటు, ప్రధానమంత్రి రణిల్, ఇతర మంత్రులు రాజీనామా చేయటం తమ లక్ష్యంగా కొందరు నిరసనకారులు బీబీసీతో చెప్పారు.

    ‘‘ఇప్పుడు దేశాన్ని పునర్నించటానికి నిజాయితీ అయిన, సత్యవంతులైన నేతలు అవసరం’’ అని నిక్సన్ చంద్రనాథన్ అనే నిరసనకారుడు వ్యాఖ్యానించారు.