లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్నవారంతా నన్ను క్షమించాలి - ‘మన్కీ బాత్’లో ప్రధాని మోదీ
ఆరోగ్యమే మహాభాగ్యం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
దేశ ప్రజలనుద్దేశించి ఆయన ఆలిండియా రేడియోలో ‘మన్కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడారు.
లాక్డౌన్ ప్రకటించడం వల్ల విధించిన ఆంక్షల కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. వారంతా తనను క్షమించాలని ప్రధాని కోరారు.
రోజుకూలీల కష్టాలను తాను అర్థం చేసుకోగలనని ప్రధాని అన్నారు.
21 రోజుల లాక్డౌన్ను పాటించి, ఇళ్లకే పరిమితం కావాల్సిన ప్రజల్లో కొంతమంది ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారని, వాళ్లు వాళ్ల ప్రాణాలతోనే కాకుండా సన్నిహితుల ఆరోగ్యంతో కూడా ప్రమాదకరమైన ఆట ఆడుతున్నారని తెలిపారు.
హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొంది కరోనావైరస్ బారి నుంచి బయటపడిన ఒక ఐటీ ఉద్యోగితోను, ఆగ్రాలో చికిత్స పొంది కోవిడ్-19 వ్యాధి నయమైన ఒక కుటుంబ యజమానితోనూ మోదీ మాట్లాడారు.
ఇది యుద్ధం లాంటి పరిస్థితేనని ఒక డాక్టర్తో మాట్లాడుతూ మోదీ అన్నారు.కోవిడ్-19 కేసులు ఒక్కసారిగా పెరిగిపోతుంటాయని, విదేశాల్లో కూడా ఇలాగే జరిగిందని, ఆ పరిస్థితి భారత్లో రాకూడదన్నదే తమ ప్రయత్నమని మోదీ చెప్పారు.
రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, ఆశా వర్కర్లు, ఇతర వైద్య సిబ్బంది సేవలను మోదీ ప్రశంసించారు.













