అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఓటమి

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.

సారాంశం

లైవ్ కవరేజీ

  1. ధర్మేంద్ర ప్రధాన్: ఒకప్పుడు పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా లాఠీ దెబ్బలు తిన్న వ్యక్తి.. ఇప్పుడు అదే వ్యవహారంలో రాజీనామా, విద్యార్థి నేత నుంచి కేంద్ర మంత్రి వరకు..

  2. ఇది ప్రజాస్వామ్య విజయం: సోనమ్ వాంగ్‌చుక్

    సోనమ్ వాంగ్ చుక్

    ఫొటో సోర్స్, Sonam Wangchuk/X

    ఫొటో క్యాప్షన్, సోనమ్ వాంగ్ చుక్

    కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ప్రజాస్వామ్యం సాధించిన విజయంగా సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ అభివర్ణించారు.

    ఆయన ఎక్స్ పోస్ట్‌లో “ఇది ప్రజాస్వామ్యం సాధించిన విజయం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం.. నేరుగా వీధుల నుంచే సాధించిన విజయం. శాంతి, ఓర్పు, పట్టుదల సాధించిన విజయమిది. సీజేపీకి, జెన్ జెడ్‌కు అభినందనలు. భయాన్ని వీడి, దేశం నలుమూలల నుంచి కదిలివచ్చిన పౌరులందరికీ ధన్యవాదాలు. ఇక జవాబుదారీతనంతో.. సంస్కరణల వైపు అడుగులు వేద్దాం” అని ఆయన రాశారు.

  3. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, 'మనం సాధించాం' అన్న సీజేపీ

  4. రాజీనామా లేఖను ప్రధానికి సమర్పించా : ధర్మేంద్ర ప్రధాన్

    ధర్మేంద్ర ప్రధాన్, రాజీనామా, ప్రధాని నరేంద్ర మోదీ

    ఫొటో సోర్స్, Getty Images

    కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సోషల్ మీడియా వేదికగా ధర్మేంద్ర ప్రదాన్ తన రాజీనామాను ప్రకటించారు. రాజీనామా లేఖను గౌరవ ప్రధాన మంత్రికి సమర్పించినట్లు తెలిపారు.

    నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ఆయన రాజీనామా డిమాండ్ చేస్తూ దాదాపు నెల రోజులుగా దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు జరుగుతున్నాయి.

    ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. "జంతర్ మంతర్‌తో పాటు దేశంలో నెలకొన్న పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అవకాశం ఇవ్వకూడదు. దేశ సమగ్రతను కాపాడుకోవాలి. విద్యార్థులు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదు. మన పిల్లలు తమ సమయాన్ని చదువుకు, కెరీర్ నిర్మాణానికి కేటాయించాలి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, నా రాజీనామా లేఖను గౌరవ ప్రధాన మంత్రికి సమర్పించాను" అని ఆయన అందులో రాశారు.

  5. సోనమ్ వాంగ్‌చుక్: ‘బాధ, ఆవేదన, కోపంతో ఈ మాటలు మాట్లాడుతున్నా’

  6. ‘ఈ శతాబ్దపు విడాకులు’: ఈ కేసులో ఆ బిజినెస్ దిగ్గజం తన మాజీ భార్యకు ఎన్ని వేల కోట్లు చెల్లించాలంటే...

  7. గతం భవిష్యత్తుతో పోరాడలేదు - రాహుల్ గాంధీ

    రాహుల్ గాంధీ

    ఫొటో సోర్స్, RahulGandhi/X

    విద్యార్థుల మూడు డిమాండ్లపై ఎలాంటి రాజీ ఉండబోదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. విద్యార్థులతో సమావేశం అనంతరం టెన్ జనపథ్ వెలువల ఆయన మీడియాతో మాట్లాడారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవినుంచి తొలగించాల్సిందేనని ఆయన అన్నారు. ధర్మేద్ర ప్రధాన్‌ను విద్యాశాఖ నుంచి మరోశాఖకు మార్చాలని చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోందని, ఇది విద్యార్థులకుగానీ, మరెవరికి గానీ ఆమోదయోగ్యం కాదని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. ధర్మేంద్ర ప్రధాన్ అవినీతికి ప్రతీకగా మారారని ఆరోపించారు.

    వేలాదిమంది యువతకు గాయాలయ్యాయి. విద్యార్థులపై దాడి చేసినవారిని శిక్షించాలన్నది, వారిని బాధ్యులుగా చేయాలన్నది రెండో డిమాండ్ అని రాహుల్ గాంధీ అన్నారు.ఈ మొత్తం ఘటనలపై ప్రధాని మోదీ విద్యార్థులకు, ఈ దేశ భవిష్యత్తుతకు తాను చేసిన అన్యాయానికి క్షమాపణ చెప్పాలన్నది మూడో డిమాండ్ అని రాహుల్ గాంధీ చెప్పారు.

    ‘‘విద్యార్థులు, యువతపై దాడి చేస్తోంది ఈ వ్యవస్థే. ఆందోళన చెందొద్దని నేను యువతతో చెప్పా. భారత ప్రభుత్వానికి ఎంత బలమున్నా, ఏ ఒక్క వ్యక్తీ నిరసన స్థలం నుంచి మిమ్మల్ని కదిలించలేరని నేను వాళ్లతో చెప్పా. ప్రభుత్వం ఏం చేసుకుంటుందో చేసుకోనివ్వండి. అడ్డుకోవడమో, బెదిరించడమో ఏదైన సరే. మేం వెనక్కి తగ్గేది లేదు. యువత భారత భవిష్యత్తు. నరేంద్ర మోదీ భారతదేశ గతం. గతం ఎప్పుడూ భవిష్యత్తుతో పోరాడలేదు’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

  8. ‘‘ఒత్తిడి నుంచి బయటపడేందుకు చింపాంజీలు ముద్దు పెట్టుకుంటాయి, కౌగిలించుకుంటాయి’’

  9. 'పుట్టబోయే బిడ్డ ప్రాణాలతో ఉండకూడదనుకున్న తల్లి', కానీ ప్రసవం తర్వాత ఏం జరిగింది?

  10. కొత్త తరం ప్రశ్నలు అడుగుతోంది, వారికి తార్కికంగా సమాధానం చెప్పాలి - మోహన్ భగవత్

    నీట్, దిల్లీ, ఆందోళనలు

    ఫొటో సోర్స్, Sonu Mehta/Hindustan Times via Getty Images

    ఫొటో క్యాప్షన్, మోహన్ భగవత్(ఫైల్ ఫోటో)

    కొత్త తరం ప్రశ్నలు అడుగుతోందని, వాటికి తార్కికంగా సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.

    దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర, దేశంలోని అనేక ప్రాంతాల్లో విద్యార్థులు, యువత ఆందోళనలు చేస్తున్న తరుణంలో మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

    "మేం చిన్నప్పుడు మా తల్లిదండ్రులు చెప్పిన విషయాలతో వాదించేవాళ్ళం కాదు. మాట్లాడొద్దు అంటే మాట్లాడే వాళ్లం కాదు" అని అన్నారు.

    ‘‘కానీ ఇప్పుడు అలా లేదు, కొత్త తరం ప్రశ్నలు అడుగుతుంది, వారికి సమాధానాలు చెప్పాలి. నేటి తరానికి మరింత ఆప్యాయత అవసరం. మనం వారితో సమయం గడపాలి. మనం వారితో మాట్లాడాలి. ఈ రోజుల్లో కుటుంబాల మధ్య సంభాషణలు తగ్గిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లతో బిజీగా ఉన్నారు" అని ఆయన అన్నారు.

    శుక్రవారం దిల్లీలో జరిగిన 'విశ్వ మాంగళ్య సభ' కార్యక్రమంలో మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

  11. పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్సులో ఆత్మాహుతి దాడి, 15 మంది మృతి

    పాకిస్తాన్, ఆత్మాహుతి దాడి,  ఉగ్రవాదం

    ఫొటో సోర్స్, Abdul BASIT / AFP via Getty Images

    ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్‌లో 15మంది మృతి

    పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్సులోని టాంక్ జిల్లాలో ఉన్న సైన్యం, పోలీసుల సంయుక్త చెక్ పోస్టు మాంఝీ ఖేల్‌పై గురువారం రాత్రి ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 12 మంది సైనికులతో సహా మొత్తం 15 మంది మరణించారు.

    మృతుల్లో ఇద్దరు పోలీసులు, ఒక అటవీ శాఖ అధికారి ఉన్నారు. ఈ దాడి అనంతరం భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో పన్నెండు మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

    ‘‘ఉగ్రవాదులు మొదట చెక్‌పోస్ట్ భద్రతను ఛేదించుకుని లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. కానీ భద్రతా దళాలు వారి ప్రయత్నాన్ని విఫలం చేశాయి. ఆ తర్వాత పారిపోతున్న మిలిటెంట్లను వెంబడించి కాల్పులు జరపడంతో 12 మంది మరణించారు’’ అని పాకిస్తానీ సైన్యానికి చెందిన మీడియా విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్) తెలిపింది.

    ‘‘తొలి ప్రయత్నం విఫలమైన తర్వాత ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో చెక్‌పోస్ట్ గోడను ఢీకొట్టారు. దీంతో భారీ పేలుడు సంభవించింది. 15 మంది చనిపోయారు. చెక్‌పాయింట్‌ పూర్తిగా ధ్వంసమైంది’’ అని ఐఎస్‌పీఆర్ తెలిపింది.

  12. పేపర్ లీక్‌ విషయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కామెంట్లపై వివిధ పార్టీలు ఏమన్నాయి?

    ఆర్థికమంత్రి, విద్యావ్యవస్థ, ఆందోళనలు, దిల్లీ, జంతర్ మంతర్, నీట్

    ఫొటో సోర్స్, David Talukdar/NurPhoto via Getty Images

    ఫొటో క్యాప్షన్, నిర్మలా సీతారామన్

    ప్రశ్నాపత్రాల లీకేజ్‌ను కొందరు విద్యార్థులు మరింత కష్టపడి చదవడానికి అవకాశంగా ఉపయోగించుకున్నారని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.

    కాంగ్రెస్, కాక్రోచ్ జనతాపార్టీ, ఝార్ఖండ్ ముక్తి మోర్చా సహా పలు పార్టీలు తీవ్రంగా స్పందించాయి.

    ‘‘ఆ సంఘటన తర్వాత ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోకపోతే, అరెస్టులు చేయకపోతే, మళ్లీ పరీక్ష నిర్వహించి ఉండకపోతే, ఫలితాలు వెంటనే విడుదల చేసి ఉండకపోతే ఇప్పుడు యువత ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం పొందే స్థితిలో ఉండేది కాదు’’ అని ఏఎన్ఐతో నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.

    ‘పేపర్ లీక్ అయినప్పుడు మేం బాధపడ్డాం. కానీ తర్వాత దాన్ని అవకాశంగా తీసుకుని మరింత కష్టపడి చదివాం. బాగా రాణించాం’’ అని కొందరు విద్యార్థులు చెప్పినట్టు నిర్మలా సీతారామన్ అన్నారు.

    దీనిపై కాంగ్రెస్ ‘ఎక్స్‌లో స్పందించింది. ఇవి బాధ్యతారాహిత్యమైన, సున్నితత్వంలేని మాటలని కాంగ్రెస్ విమర్శించింది.

    ‘‘21 మందికి పైగా యువత ప్రాణాలను బలిగొని, లక్షలమంది యువత నిరసనలకు కారణమైన ప్రశ్నాపత్రాల లీకేజ్ వల్ల కలిగే ప్రయోజనాలను ప్రభుత్వం లెక్కించుకుంటోంది. పేపర్ లీకేజ్‌లను అరికట్టడంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనడానికి ఈ ప్రకటనే నిదర్శనం. ఈ వ్యక్తులు దేశ విద్యావ్యవస్థను నాశనం చేశారు’’ అని కాంగ్రెస్ తన పోస్ట్‌లో పేర్కొంది.

    ‘‘ఆర్థికమంత్రి ఇప్పుడు ప్రశ్నాపత్రాల లీకేజ్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు’’ అని ఆప్ విమర్శించింది.

    పేపర్ లీకేజ్‌లు తీవ్రరూపం దాల్చిన ఒక క్యాన్సర్‌లాంటివి. ఝార్ఖండ్‌లోని హేమంత్ సోరెన్ ప్రభుత్వం దీన్ని నిర్మూలిస్తోంది. కానీ ప్రశ్నాపత్రాల లీకుల వల్ల ప్రయోజనాలున్నాయని బీజేపీ అంటోంది’’అని ఝార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అధికారిక ‘ఎక్స్’అకౌంట్‌లో రాసింది.

    ‘‘ఈ తర్కం ప్రకారం దేశంలోని పత్రాలన్నీ లీకవ్వాలి’’అని కాక్రోచ్ జనతాపార్టీ అధికార ప్రతినిధి అశుతోశ్ కాంకా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

  13. విలువైన సూచనలిచ్చినందుకు ధన్యవాదాలు - ప్రధాని మోదీ

    దిల్లీ, జంతర్ మంతర్, ఆందోళనలు, ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, ప్రధాని మోదీ

    ఇన్‌స్టా‌గ్రామ్‌లో తాను షేర్ చేసిన వీడియోకు యువత నుంచి వచ్చిన స్పందనపై ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. తన వీడియోకు యువత అందించిన విలువైన సూచనలు, సానుకూల స్పందనపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.

    ‘‘ధన్యవాదాలు మిత్రులారా. రాత్రి ఆలస్యంగా మిమ్మల్ని కలిసే అవకాశం లభించింది. నా వీడియోకు మీరు స్పందించిన తీరును, మీ సానుకూల సూచనలను అభినందిస్తున్నా. అందరికీ ధన్యవాదాలు’’ అని ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ వీడియోలో ప్రధాని తెలిపారు.

    నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్‌పై దేశవ్యాప్తంగా యువత ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పేపర్‌లీక్‌లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని గురువారం అర్ధరాత్రి సెల్ఫీ వీడియోలో ప్రధాని ప్రకటించారు.

  14. నమస్తే, బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    దేశంలో, ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ వార్తలను ఎప్పటికప్పుడు ఇక్కడ అప్‌డేట్ చేస్తాం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  15. దిల్లీ నిరసనలు: పెల్లెట్ గన్ అంటే ఏంటి, ఎందుకు వివాదాస్పదంగా మారింది?

  16. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ఇంతటితో ముగిస్తున్నాం.

    తాజా వార్తల కోసం రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  17. రద్దీగా ఉన్న రోడ్డులో 'స్పైడర్‌మ్యాన్'..

  18. అస్సాంలో భారీ వరదలు, 41కి చేరిన మృతుల సంఖ్య

    అస్సాం వరదలు, సహాయక చర్యలు

    ఫొటో సోర్స్, NDRF

    ఫొటో క్యాప్షన్, రాష్ట్రంలోని 11 జిల్లాల్లోని 939 గ్రామాలు వరదల్లో మునిగిపోయాయని అస్సాం ప్రభుత్వం బుధవారం రాత్రి విడుదల చేసిన ఒక నివేదికలో తెలిపింది.

    అస్సాంలో భారీ వరదల కారణంగా గత 24 గంటల్లో మరో పది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 41కి చేరింది.

    వరదల కారణంగా రాష్ట్రంలోని 11 జిల్లాల్లో దాదాపు వెయ్యి గ్రామాలు నీట మునిగాయని, 6.53 లక్షల మంది ప్రభావితులయ్యారని అస్సాం ప్రభుత్వ విపత్తు విభాగం ప్రకటించింది.

    రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లో సుమారు 25 వేల మంది నిరాశ్రయులు ఆశ్రయం పొందినట్లు విపత్తు నిర్వహణ శాఖ నివేదిక పేర్కొంది.

    ఎగువ అస్సాంలో వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. శివసాగర్, చరాయిదేవ్, గోలాఘాట్, జోర్హాట్ జిల్లాల్లో వరదల కారణంగా భారీ నష్టం వాటిల్లింది.

    రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారత సైన్యం సహాయక చర్యలు చేపట్టింది. మారుమూల ప్రాంతాల్లోని వరద బాధితులను గుర్తించేందుకు సైనిక హెలికాప్టర్లు గగనతల నిఘా నిర్వహిస్తున్నాయి.

    ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వరద పరిస్థితి గురించి వివరించారు.

  19. 92 ఏళ్ల వయసులోనూ సర్జరీలు చేస్తున్న లేడీ డాక్టర్

  20. సోనమ్ వాంగ్‌చుక్, కాక్రోచ్ జనతా పార్టీ వైఖరుల్లో ఈ వ్యత్యాసం ఎందుకు, నడ్డా చేతులమీదుగా దీక్ష విరమణపై వస్తున్న ప్రశ్నలేంటి?