అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్కు 74,202 ఓట్లు దక్కాయి.
సారాంశం
- తమిళనాడు, అస్సాం, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభల ఎన్నికల ఫలితాలను ఆయా రాష్ట్రాలపై క్లిక్ చేసి తెలుసుకోండి.
- తమిళనాడులో సినీనటుడు విజయ్ టీవీకే పార్టీ దూసుకుపోతోంది. వందకుపైగా స్థానాలలో ఆధిక్యంలో ఉంది.
- పశ్చిమబెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
- కేరళలో యూడీఎఫ్ ముందంజలో ఉంది.
- కేరళలో కమ్యూనిస్టుల చివరి కోట పతనం అంచుకు చేరింది.
లైవ్ కవరేజీ
నా మీద కేసులన్నీ భూకబ్జాదారులు వేసినవే: హైడ్రా కమిషనర్ రంగనాథ్

ఫొటో సోర్స్, BBC/HYDRAA
హైడ్రా కమిషనర్ పదవి నుంచి ఏవీ రంగనాథ్ను తప్పించాలని తెలంగాణ హైకోర్టు సోమవారం ప్రభుత్వప్రధాన కార్యదర్శిని ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
తాను రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48ఏ ప్రకారం ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులను గత రెండేళ్లుగా రక్షిస్తున్నానని రంగనాథ్ ఆ ప్రకటనలో చెప్పుకొచ్చారు.
‘ఆరు చెరువులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాం.మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. బడా బాబులు ఆక్రమించిన వందల చెరువులు, పార్కులు, వేల ఎకరాల ప్రభుత్వ భూముల ను హైడ్రా ఈ రెండు సంవత్సరాల లో వెనక్కి తీసుకుని ప్రభుత్వానికి అప్పగించింది. నిజం వైపు నిజాయితీ గా నిర్భయంగా, నిబద్ధతతో పని చేస్తాం కాబట్టే హైడ్రాకు ధైర్యం. ల్యాండ్ మాఫియా , భూ కబ్జా దారులు తప్పుడు సమాచారం తో కోర్ట్ లను తప్పుదోవ పట్టిస్తున్నారు. నా మీద 63 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి.. వాటిని వేసింది బడా భూ కబ్జా దారులే. బతుకమ్మ కుంట చెరువును మింగేయాలని చూసిన ఒకరు, లోతుకుంటలో రూ. వేల కోట్ల ప్రభుత్వ భూమి ని కొట్టేయాలని చూసిన ఇంకొకరు, సామాన్యుల ప్లాట్లు కొట్టేసి బడా కాంప్లెక్స్ లు కట్టాలని చూస్తున్న మరొకరు.. వేల సంఖ్యలో ఉన్న సింగరేణి కార్మికుల ప్లాట్స్ను కొట్టేయాలని చూసినవారు, ప్రభుత్వ భూములను ఆక్రమించినవారికి హైడ్రా కమిషనర్గా అడ్డు పడడటమే నేను చేసిన తప్పు. వీళ్లంతా వేసిన కేసులే నా మీద ఉన్న 63 కోర్ట్ ధిక్కార కేసులు. వాటిని నేను చట్ట పరంగా నే ఎదుర్కొంటాను. నాకు న్యాయస్థానాలు అంటే పూర్తి నమ్మకం’ అని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.
అరుణాచలం: అడుగు వెడల్పున్న ‘మోక్ష మార్గం’లో చిక్కుకుని మరణించిన ఆంధ్రప్రదేశ్ భక్తుడు
ఎన్టీఆర్ భుజానికి గాయం - 6 నుంచి 8 వారాల కంప్లీట్ రెస్ట్ సూచించిన వైద్యులు

ఫొటో సోర్స్, Getty Images
హీరో ఎన్టీఆర్ భుజానికి సోమవారం సాయంత్రం గాయమైందని ఆయన కార్యాలయం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.
‘డాక్టర్ జె.మధుసూదన్ రావు, ఆర్ఏ పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్యబృందం వైద్య పరీక్షలు నిర్వహించి 6 నుంచి 8 వారాల పూర్తి విశ్రాంతి అవసరమని సూచించారు’ అని సోమవారం రాత్రి విడుదల చేసిన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఎన్టీఆర్ ఆరోగ్యం గురించి ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిందేమీ లేదని, ఆయన ఆరోగ్యం, కోలుకోవడం గురించి తగిన సమయంలో తాము అప్డేట్స్ ఇస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, NTR office
ఎన్నికల్లో పోటీ వయసు 21ఏళ్లకు తగ్గించాలా...రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు కారణమేంటి?
నెతన్యాహును అరెస్టు చేసే అధికారం నాకు లేదు: మమ్దానీ

ఫొటో సోర్స్, Michael M. Santiago/Getty Images
ఫొటో క్యాప్షన్, న్యూయార్క్ మేయర్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాటల యుద్ధం లేదా ఆరోపణల పర్వంలో పాల్గొనడంపై తనకు ఆసక్తి లేదని న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ అన్నారు.
నెతన్యాహు న్యూయార్క్ వస్తే అరెస్టు చేయడానికి సంబంధించిన ప్రశ్నలకు మమ్దానీ స్పందించారు.
అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు సంబంధించి గతంలో చేసిన వ్యాఖ్యల గురించి అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్తో చర్చించారా అని అడగ్గా, ట్రంప్తో జరిగిన తన సంభాషణను బహిరంగంగా వెల్లడించబోనని మమ్దానీ అన్నారు.
న్యూయార్క్ ప్రజలందరికీ భద్రత కల్పించడమే తన ప్రాధాన్యత అని స్పష్టంచేశారు.
నెతన్యాహు చేసిన వ్యాఖ్యలపై మమ్దానీ స్పందించలేదు.
అంతకుముందు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు సెప్టెంబరు చివరిలో తాను న్యూయార్క్ వెళ్తానని నెతన్యాహు చెప్పారు.
మమ్దానీ విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని నెతన్యాహు ఆరోపించారు.
నెతన్యాహు న్యూయార్క్కు వస్తే అరెస్టు చేస్తానని గతంలో జోహ్రాన్ మమ్దానీ హెచ్చరించారు.
ఆ తర్వాత తన ప్రకటనను ఆయన ఉపసంహరించుకున్నారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) జారీ చేసిన అరెస్టు వారెంట్ ఆధారంగా నెతన్యాహును అరెస్టు చేయడానికి చట్టపరమైన అధికారం తనకు లేదని ఆయన అంగీకరించారు.
ఒంటెలు కూడా తట్టుకోలేనంత వేడి.. చనిపోతున్న ఎడారి ఓడలు
ఫ్రాన్స్లో ఇంకా అదుపులోకి రాని కార్చిచ్చు

ఫొటో సోర్స్, Kenzo TRIBOUILLARD / POOL / AFP via Getty Images
ఫొటో క్యాప్షన్, బోర్డో నగరానికి 15కిలోమీటర్ల దూరానికి కార్చిచ్చు వ్యాపించింది. ఫ్రాన్స్లో చెలరేగిన కార్చిచ్చు ఇప్పుడు నైరుతి నగరమైన బోర్డోకు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఎలాంటి పరిస్థితినయినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బోర్డో మేయర్ థామస్ కాజెనావ్ చెప్పారు.
"మరింత మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలొస్తే, అందుకు తగ్గట్టుగా భారీ సంఖ్యలో ప్రజలకు తాత్కాలిక వసతి కల్పించే ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని మేయర్ థామస్ కాజెనవే అన్నారు.
కార్చిచ్చుతో ప్రభావితమైన గిరోండ్ ప్రాంతాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ పరిశీలించారు. దేశం ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని స్థాయిలో కార్చిచ్చు ప్రభావం ఉందని ఆయన చెప్పారు.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఫ్రాన్స్లో ఇది అత్యంత ఘోరమైన కార్చిచ్చు అని మేక్రాన్ తెలిపారు.
కార్చిచ్చు ఫ్రాన్స్పై తీవ్ర ప్రబావం చూపింది. నైరుతి ఫ్రాన్స్లో 42వేల హెక్టార్లు కాలిపోయాయి.
గత వారం నుంచి యూరప్లోని అనేక ప్రాంతాల్లో కార్చిచ్చులు వ్యాపిస్తున్నాయి.
యుద్ధం త్వరలో ముగిసే అవకాశం ఉందన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఎలా స్పందించింది?

ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, ట్రంప్ ఇరాన్తో 'చాలా స్నేహపూర్వక చర్చలు' జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.
వరుసగా మూడో రోజు కూడా ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోలేదు.
"ఈ యుద్ధాన్ని ముగించేందుకు మంచి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను" అని ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ అన్నారు.
ఈ చర్చలు విఫలమైతే, కాల్పుల విరమణకు ముందు తీసుకున్న చర్యలనే అమెరికా మళ్లీ ప్రారంభిస్తుందని ఆయన హెచ్చరించారు.
మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది. అమెరికాతో ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరపడం లేదని తెలిపింది.
మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశాలు చర్చలకు మరో అవకాశం కోరడంతో శుక్రవారం(జూలై 24) ఇరాన్పై దాడులను నిలిపివేసినట్టు ట్రంప్ తెలిపారు.
ఇరాన్ కూడా ప్రస్తుతానికి తన దాడులను నిలిపివేసింది.
దాదాపు రెండు వారాల తర్వాత ఈ విరామం వచ్చింది.
నిరసనకారులపై ఎఫ్ఐఆర్ల ఉపసంహరణ హామీ నోటిఫికేషన్ను రేపటిలోపు విడుదల చేయాలి- సీజేపీ

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, దిల్లీలో యువత ఆందోళన(ఫైల్ ఫోటోె) నిరసనకారులపై నమోదు చేసిన అన్ని ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకుంటామని బిహార్, అసోం ప్రభుత్వాలు హామీ ఇచ్చాయని కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ అన్నారు.
పార్టీ పత్రికా సమావేశం అనంతరం ప్రభుత్వ ప్రతినిధులు తనను, తన సహచరులను కలిశారని ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో సౌరవ్ దాస్ తెలిపారు.
"ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశం రెండుమూడు గంటల పాటు జరిగింది. నిరసనకారులపై దాఖలైన అన్ని ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకుంటామని హామీ ఇస్తూ బిహార్, అసోం ప్రభుత్వాలు జారీ చేసిన నోటిఫికేషన్ల కాపీలను వారు షేర్ చేశారు’’ అని సౌరవ్ దాస్ చెప్పారు.
‘‘నిరసనకారులపై భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోబోరని కూడా ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అదుపులోకి తీసుకున్న, అరెస్టు చేసిన వారందరినీ కూడా విడుదల చేస్తామని చెప్పారు’’ అని సౌరవ్ దాస్ వివరించారు.
‘‘కేంద్ర ప్రభుత్వం, ఇతర బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నుంచి ఇలాంటి హామీలతో కూడిన నోటిఫికేషన్లు రేపటిలోగా జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ముందుగా అంగీకరించిన భాషనే ఉపయోగిస్తారని ఆశిస్తున్నాం. ఏ నిరసనకారుడినీ ఒంటరిగా వదిలిపెట్టం. ఈ పోరాటంలో మనమంతా కలిసి ఉన్నాం’’ అని సౌరవ్ దాస్ అన్నారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజ్కు స్వాగతం.
నేను బీబీసీ ప్రతినిధి కమలాదేవి నల్లపనేని.
ఇప్పటినుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను లైవ్ పేజ్ ద్వారా మీకు అందిస్తాను.
నిన్నటి లైవ్ పేజ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
‘పచ్చని గడ్డి రక్తంతో తడిసి ఎర్రగా మారింది’
అరుణాచలం 'మోక్ష మార్గం'లో ఇరుక్కుని ఏపీ భక్తుడు మృతి..
ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2026: ఈశా సింగ్కు బంగారు పతకం.. మను భాకర్కు కాంస్యం

ఫొటో సోర్స్, Sanket Wankhade/Hindustan Times via Getty Images
ఫొటో క్యాప్షన్, భారత యువ షూటర్ ఈశా సింగ్ ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2026 మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత యువ షూటర్ ఈశా సింగ్ బంగారు పతకం సాధించింది. ఇదే పోటీలో, మను భాకర్ కాంస్య పతకం గెలిచింది.
21 ఏళ్ల ఈశా సింగ్ ఫైనల్ పోరులో 40 హిట్స్ స్కోరుతో మొదటి స్థానంలో నిలిచింది. చైనాకు చెందిన జాంగ్ యుయును వెనక్కి నెట్టి ఆమె గోల్డ్ మెడల్ గెలవగా, చైనా షూటర్ 37 హిట్స్ స్కోరుతో సిల్వర్ మెడల్కే పరిమితమైంది.
కాంస్య పతకం కోసం జరిగిన షూట్-ఆఫ్లో మను భాకర్ విజయం సాధించింది. ఆ తర్వాత ఫైనల్లో 28 స్కోరుతో ఆమె మూడో స్థానాన్ని దక్కించుకుంది.
ఈశా సింగ్కు ఈ ఏడాది ఇది రెండో పెద్ద టైటిల్. అంతకుముందు మే నెలలో జరిగిన మ్యూనిచ్ వరల్డ్ కప్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లోనూ ఆమె గోల్డ్ మెడల్ గెలుచుకుంది.
మరోవైపు, మ్యూనిచ్లో నిర్వహించిన అదే పోటీల్లో 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో కూడా ఆమె సిల్వర్ మెడల్ సాధించింది.
నరేంద్ర మోదీ: పరాజయం లేని రాజకీయ జీవితంలో ఇప్పుడు ఎందుకు ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు...
జర్నలిస్టుల సమస్యలపై దిల్లీలో తెలంగాణ పాత్రికేయుల ధర్నా

ఫొటో సోర్స్, TWJF
ఫొటో క్యాప్షన్, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన "ఛలో పార్లమెంట్" పిలుపులో భాగంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి జర్నలిస్టులు దిల్లీ వెళ్లారు. దేశవ్యాప్తంగా పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణకు చెందిన జర్నలిస్టులు సోమవారం దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు.
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ఇచ్చిన "ఛలో పార్లమెంట్" పిలుపులో భాగంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి జర్నలిస్టులు దిల్లీ వెళ్లారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగిన ఈ నిరసనను, దిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ అధ్యక్షుడు మారూఫ్ రజా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మారూఫ్ రజా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల సంక్షేమం, భద్రత, హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ జర్నలిస్టులు దిల్లీ వేదికగా ముందుండి పోరాడటాన్ని ఆయన అభినందించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పలువురు జర్నలిస్టు ప్రతినిధులు కూడా ఈ ధర్నాకు హాజరై తమ మద్దతు తెలిపారు.జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు తమ పోరాటం కొనసాగుతుందని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య స్పష్టం చేశారు.
హైడ్రా కమిషనర్గా రంగనాథ్ను తప్పించండి: తెలంగాణ హైకోర్టు, అమరేంద్ర యార్లగడ్డ, బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, BBC/HYDRAA
ఫొటో క్యాప్షన్, కోర్టు ధిక్కరణకు పాల్పడున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆ స్థానం నుంచి రిలీవ్ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) కమిషనర్ పదవి నుంచి ఏవీ రంగనాథ్ను తప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సోమవారం తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసిందని ది హిందూ రిపోర్టు చేసింది.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంట గ్రామంలో జులై 17న హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఈ కూల్చివేతలు చేపట్టిన స్థలం సర్వే నం.1, 2 పరిధిలోకి వస్తాయని, అది తమ భూమిగా చెబుతూ శాంతా శ్రీరాం కన్స్ట్రక్చన్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే, జులై 17న కూల్చివేతలు చేపట్టిన ప్రాంతంలో ప్రైవేటు స్థలాలు లేవని హైడ్రా స్పష్టం చేసింది.
‘‘ఇప్పటికే రెండు కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగులో ఉన్నాయి. కోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ 17వ తేదీన హైడ్రా భారీ బలగంతో వచ్చి ప్రహారీ, ఇతర నిర్మాణాలు కూల్చివేసింది’’ అని పిటిషనర్ తరఫున న్యాయవాది ఎం.హరీశ్ కుమార్ తెలంగాణ హైకోర్టుకు తెలిపారు.
లోతుకుంట గ్రామంలోని 40 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు ఉన్నాయని, 2021లోనే హైకోర్టు తీర్పు చెప్పిందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. హైకోర్టు తీర్పు అమలు కాకపోవడంపై గతంలో కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేసినట్లుగా వివరించారు. దీనిపై జులై 27న మరోసారి తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో మూడు కోర్టు ధిక్కరణ పిటిషన్లు రావడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
హైడ్రా కమిషనర్పై మొత్తం 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగులో ఉన్నాయని తెలగాణ హైకోర్టు చెప్పినట్లు ది హిందూ రిపోర్టు చేసింది.
ఈ నేపథ్యంలో పదేపదే కోర్టు ధిక్కరణకు పాల్పడున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆ స్థానం నుంచి రిలీవ్ చేసి ఆ స్థాయి అధికారిని వేరొకర్ని నియమించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
E20 వివాదం: ఎక్స్, మెటా, గూగుల్లపై సివిల్ దావాకు గడ్కరీకి హైకోర్టు అనుమతి

ఫొటో సోర్స్, Prakash Singh/Bloomberg via Getty Images
ఫొటో క్యాప్షన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోషల్ మీడియా, ఇంటర్నెట్లో తనకు పరువు నష్టం కలిగించేలా ఉన్న డీప్ఫేక్, ఏఐ పోస్టులపై సివిల్ దావా దాఖలు చేయడానికి కేంద్ర మంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు నితిన్ గడ్కరీకి బాంబే హైకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది.
లైవ్ లా వెబ్ సైట్ అందించిన సమాచారం ప్రకారం జస్టిస్ అభయ్ అహూజా ధర్మాసనం ఈ కేసును విచారించింది. గడ్కరీ తరఫున న్యాయవాది సందీప్ ఎస్. లడ్డా హాజరై, ఈ దావా వేయడానికి కోర్టు అనుమతి కోరారు.
దాంతో ఎక్స్, మెటా, గూగుల్తో పాటు ఇతర గుర్తుతెలియని వ్యక్తులపై సివిల్ కేసు దాఖలు చేయడానికి కోర్టు గడ్కరీకి అనుమతినిచ్చింది. ఈ వివాదాస్పద పోస్టులను వెంటనే తొలగించాలని, తనకు తగిన ఉపశమనం కలిగించాలని ఆయన కోర్టును ఆశ్రయించారు.
రూ. 11 కోట్ల నష్టపరిహారం డిమాండ్
ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ద్వారా గడ్కరీ, ఆయన కుటుంబ సభ్యులు ఆర్థికంగా లాభపడ్డారంటూ ఈ పోస్టుల ద్వారా తప్పుడు ప్రచారం చేశారని పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ ప్రకటనల్లో అవినీతి, పక్షపాతం, స్వార్థ ప్రయోజనాలు, పదవి దుర్వినియోగం వంటి తీవ్రమైన ఆరోపణలు చేశారనీ గడ్కరీ తన పిటిషన్లో పేర్కొన్నారు. పరువు నష్టం కలిగించేలా ఉన్న ఇలాంటి 24 పోస్టులను గడ్కరీ తన పిటిషన్లో ప్రస్తావిస్తూ, వాటిని తొలగించాలని కోరారు. తన అనుమతి లేకుండా డీప్ఫేక్ రూపంలో తన గుర్తింపును, ప్రతిష్ఠను వాడుకోవడం వ్యక్తిగత హక్కుల ఉల్లంఘనే అవుతుందని ఆయన వాదించారు. ఈ మేరకు రూ. 11 కోట్ల నష్టపరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, ANI
E20 కి వ్యతిరేకంగా పోరాడుదాం: కేజ్రీవాల్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత, ఇకపై ‘E20’ కి వ్యతిరేకంగా గళం విప్పుతామని దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ "దేశ యువత ఒక అహంకార ప్రభుత్వాన్ని తలవంచేలా చేసింది, దాంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంలోనే E20 ఇంధనం సమస్యను కూడా పరిష్కరించాలని ప్రధానమంత్రి మోదీని కోరుతున్నాను. ప్రజలు దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు, వారి వాహనాలు పాడవుతున్నాయి" అన్నారు.
"ఈ అంశంపై అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడానికి, ఈ శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి E20కి వ్యతిరేకంగా నేషనల్ టౌన్హాల్ నిర్వహిస్తున్నాం" అన్నారు.
పాములకు పాలు తాగించడం వాటి ప్రాణాలకు ప్రమాదకరమా, బలవంతంగా తాగిస్తే వాటి శరీరంలో ఏం జరుగుతుంది?
లంబర్ జాక్: మొద్దులు నరికే వరల్డ్ కప్లో రికార్డులు సృష్టించిన అమ్మాయి...
