ఏసీ పేలడంతో ఆస్పత్రి ఐసీయూలో మంటలు.. 13 మంది కోవిడ్ రోగులు మృతి

ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లా విరార్‌లోని ఒక కోవిడ్ ఆసుపత్రిలో మంటలు వ్యాపించడంతో 13 మంది రోగులు మరణించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

ప్రమాదం జరిగిన ఆసుపత్రిలోని మిగతా రోగులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించినట్లు పోలీసులు చెప్పారు.

ఏసీ పేలడంతో ఐసీయూలో మంటలు

ఐసీయూలోని ఏసీ పేలడంతో మంటలు వ్యాపించినట్లు ఆసుపత్రి వద్ద ఉన్న ఒక పోలీసు అధికారి మీడియాకు చెప్పారు.

వేకువజామున 3.30 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని, ప్రమాదం జరిగేటప్పటికి ఐసీయూలో 17 మంది కోవిడ్ పేషెంట్లు ఉన్నారని తెలిపారు.

వారిలో నలుగురు సిబ్బంది వెంటనే బయటకు రాగా మిగతా 13 మంది మరణించారని చెప్పారు.

ప్రమాద సమయానికి ఆసుపత్రిలో మరో 80 మంది రోగులున్నారని.. వారంతా సురక్షితంగానే ఉన్నారని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించారని ముఖ్యమంత్రి కార్యాలయం వర్గాలు తెలిపాయి.

ఇది చాలా పెద్ద ప్రమాదమని, దీనికి బాధ్యులైన వారిని వదిలిపెట్టబోమని మహారాష్ట్ర మంత్రి ఒకరు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు.

ఈ అగ్నిప్రమాదంలో మరణించిన వారికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.

(ఈ వార్త అప్‌డేట్ అవుతోంది)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)