కోవిడ్-19తో ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మృతి - Newsreel

చల్లా రామకృష్ణారెడ్డి

ఫొటో సోర్స్, Facebook/Challa Ramakrishna reddy

ఫొటో క్యాప్షన్, జగన్‌తో చల్లా రామకృష్ణారెడ్డి
ప్రచురణ

వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి (72) కోవిడ్-19 సోకడంతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు.

ఆయనకు భార్య ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆయనకు కోవిడ్-19 సోకినట్లు నిర్ధరణ అయ్యింది. మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం గత నెల 13న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. కొన్ని రోజులపాటు ఆయనకు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో 1948 ఆగస్టు 27న ఆయన జన్మించారు. కాంగ్రెస్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కోయిలకుంట్ల అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహించారు.

పౌర సరఫరా కార్పొరేషన్ ఛైర్మన్‌గానూ ఆయన పనిచేశారు.

ఎస్ఎఫ్ఎఫ్

ఫొటో సోర్స్, GETTY IMAGES / PRAKASH SINGH

లద్దాఖ్‌లో పరిస్థితులపై చైనా సైన్యంతో భారత్ చర్చలు

భారత్, చైనా సైనికుల మధ్య తొమ్మిదో దఫా సైనిక కమాండర్ స్థాయి చర్చలు జరిగాయని చైనా సైనిక అధికార ప్రతినిధి తెలిపారు.

ఈ అంశంపై చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్‌లో ఓ కథనం ప్రచురించారు. నవంబరులో ఎనిమిదో దఫా చర్చలు పూర్తయిన అనంతరం.. లద్దాఖ్‌లో పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు, శాంతిని పునరుద్ధరించేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తున్నామని చైనా సైనిక అధికార ప్రతినిధి తైన్ కెఫీ చెప్పారు.

సరిహద్దుల్లో ప్రస్తుతం పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నాయని ఆయన వివరించారు.

భారత్‌తో సైనిక, దౌత్య మార్గాల్లో చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు చైనా సిద్ధంగా ఉందని తైన్ వివరించారు. సరిహద్దుల్లో శాంతి స్థాపనకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)