You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పవన్ కల్యాణ్: ‘వారాహి ఎన్నికల యుద్ధానికి సిద్ధమైంది’ అంటూ పవన్ ట్వీట్
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తన ఎన్నికల ప్రచార వాహనం ఫొటోలు, వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. పవన్ ట్వీట్ చేసిన కొద్దినిమిషాల్లోనే ఈ చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
లైవ్ కవరేజీ
గుండెపోటు వచ్చే అరగంట ముందు శరీరంలో ఏం జరుగుతుంది, ఏ లక్షణాలు కనిపిస్తాయి?
జాక్వెలిన్ ఫెర్నాండేజ్పై నోరా ఫతేహి పరువునష్టం దావా
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్పై నటి నోరా ఫతేహి పరువునష్టం దావా వేశారు.
అక్రమ నగదు చెలామణీ కేసులో ఈ ఇద్దరు నటీమణులూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
రూ.200 కోట్ల దోపిడీ కేసులో నిందితుడు సుఖేశ్ చంద్రశేఖర్ నుంచి విలువైన బహుమతులు తీసుకున్నట్లు జాక్వెలిన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో నోరాను కూడా ఈడీ విచారించింది.
అయితే, తనపై జాక్వెలిన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ప్రస్తుతం నోరా పరువు నష్టం దావా వేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ అయిన ఆర్ఆర్ఆర్
ఎస్ఎస్ రాజమౌళి సినిమా ‘‘ఆర్ఆర్ఆర్’’ రెండు గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ అయ్యింది.
బెస్ట్ నాన్ ఇంగ్లిష్ కేటగిరీతోపాటు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో నాటునాటు సాంగ్ నామినేట్ అయ్యింది.
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్లు ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా గత మార్చిలో విడుదలైంది. దీనిలో
ఆలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా శరణ్లు కూడా నటించారు.
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.1200 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలైంది.
ఇండియా, చైనా సైనికుల మధ్య మళ్లీ ఘర్షణ.. రెండు దేశాల సైనికులకూ గాయాలు
కే-పాప్ వర్చువల్ గర్ల్స్: ఆడతారు, పాడతారు, అభిమానులతో ముచ్చటిస్తారు.. కానీ, అసలైన అమ్మాయిలు కారు
హైదరాబాద్ కిడ్నాప్ కేసు: ఇంతకీ వారు భార్యాభర్తలా కాదా? తేలేది పోలీసు దర్యాప్తుతోనే
పార్లమెంటుపై దాడికి 21 ఏళ్లు: మిలిటెంట్ల దాడి నుంచి భారత ప్రధాని, ఎంపీలు ఎలా బయటపడ్డారంటే
సీఎం కాన్వాయ్లోని వాహనం ఫుట్బోర్డుపై మహిళా మేయర్ నిల్చుని ప్రయాణం.. తమిళనాడులో విమర్శలు
వైఎస్ షర్మిల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
హైదరాబాద్లోని ఆసుపత్రి నుంచి వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల డిశ్చార్జ్ అయ్యారు.
పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో తన నివాసం వద్ద ఆమె ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.
దీంతో బలవంతంగా పోలీసులు షర్మిలను ఆదివారం ఆసుపత్రికి తరలించారు.
పవన్ కల్యాణ్ వారాహి వాహనానికి లభించిన అనుమతులు
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించనున్న ‘వారాహి’ వాహనానికి అన్ని రకాల అనుమతులు ఉన్నట్లు తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాపారావు తెలిపారు.
వారం క్రితమే రిజిస్ట్రేషన్ జరిగిందని ఆయన వెల్లడించారు.
టీఎస్13ఈఎక్స్8384 అనే నెంబర్ను వారాహి వాహనానికి కేటాయించారు. వాహన రంగును ఎమరాల్డ్ గ్రీన్గా పేర్కొన్నారు.
సైనిక వాహనాలు వాడే రంగును ప్రైవేటు వాహనాలకు ఎలా వేస్తారంటూ కొద్ది రోజులుగా దాని మీద చర్చ నడిచింది.
ఆర్టెమిస్: చంద్రున్ని చుట్టేసి సురక్షితంగా భూమికి చేరిన నాసా ఒరైన్ స్పేస్ షిప్
'నేను ఎంతో ప్రేమించిన వ్యక్తే ఇలా చేస్తాడని ఊహించలేదు'
శ్రీలంక: 'పిల్లలకు పెట్టేందుకు సరైన తిండి దొరకట్లేదు'
భారత్ ప్రపంచానికి నాయకత్వం వహించవచ్చు అని రష్యా ఎందుకు అంటోంది?
అశ్వినీ వైష్ణవ్: రూ.1.25 లక్షల కోట్ల నల్లధనాన్ని వెలికితీశాం
ఇప్పటి వరకు కేంద్రప్రభుత్వం రూ.1.25 లక్షల కోట్ల నల్లధనాన్ని రికవరీ చేసినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
రూ.4,600 కోట్ల అక్రమాస్తులను అటాచ్ చేసినట్లు చెప్పారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం చాలా పారదర్శకంగా పని చేస్తోందని, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా నేడు ప్రతి రూపాయిలో వందశాతం లబ్ధిదారులకు చేరుతోందని మంత్రి అన్నారు.
వెనక్కి నడవడం వల్ల ఆరోగ్యం బాగుంటుందా?
ముందుకు నడవటం కన్నా, వెనక్కి నడవటానికి మన శరీరం ఖర్చు చేసే శక్తి 40 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది.
ఎమ్మెల్సీ అనంతబాబుకు మధ్యంతర బెయిల్
వైసీపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికైన అనంతబాబుకు, తన డ్రైవర్ హత్య కేసులో సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
అయితే కొన్ని షరతులు విధించింది. ఆ షరతులను ట్రయిల్ కోర్టు నిర్దేశిస్తుందని సుప్రీం కోర్టు తెలిపింది.
తదుపరి విచారణను మార్చి 14కు వాయిదా వేసింది.
తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేశారనే ఆరోపణలతో సత్య ఉదయ భాస్కర్ (అనంత బాబు) 200 రోజులుగా రిమాండ్లో ఉన్నారు.
తన దగ్గర డ్రైవర్గా పనిచేసిన వ్యక్తిని హత్య చేసినట్టు ఆయన అంగీకరించారని కాకినాడ జిల్లా ఎస్పీ నాడు ప్రకటించారు.
గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ అయిన ఆర్ఆర్ఆర్
‘బేస్ ఎడిటింగ్’: నయం చేయడానికి వీల్లేని క్యాన్సర్ను తరిమేసిన కొత్త విప్లవాత్మక చికిత్స, 13 ఏళ్ల బాలికపై తొలి ప్రయోగం