తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ
‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.
లైవ్ కవరేజీ
చిట్టత్తూరు హరికృష్ణ
అధిర్ రంజన్ వ్యాఖ్యల పట్ల స్పందించిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్

ఫొటో సోర్స్, Getty Images
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురించి కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు.
యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, “దేశంలోని గౌరవప్రదమైన రాష్ట్రపతిని ఉద్దేశించి కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఖండించాల్సినవి. ఈ వ్యాఖ్యలు భారత రాజ్యాంగాన్ని అవమానించడమే. ఇది భరతమాత శక్తికి జరిగిన అవమానం. ఇది భారతదేశంలోని గిరిజన సమాజానికి అవమానం. దేశానికి, భారతదేశ అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్రపతికి కూడా అవమానం" అని అన్నారు.
యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, “ఈ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ, కాంగ్రెస్ పార్టీని ఖండిస్తున్నాను. ఈ అవమానకరమైన చర్యకు వారు దేశప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇలాంటి అవాంఛనీయ వ్యాఖ్యలను ఈ దేశం ఎన్నటికీ అంగీకరించదు.
ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ జవాబుదారీతనం వహించకుండా తప్పించుకునేందుకు లేదని ఆయన అన్నారు.
పార్థ్ చటర్జీ: మంత్రి పదవి నుంచి తొలగింపు

ఫొటో సోర్స్, Prabhakar Mani Tiwari
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ పార్థ్ చటర్జీని పార్టీలోని అన్ని పదవుల నుంచి సస్పెండ్ చేశారు.
టీచర్ నియామకాల కుంభకోణంలో అరెస్టు అయిన పార్థ్ చటర్జీని మంత్రి పదవి నుంచి తొలగించారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత అభిషేక్ బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ పార్థ్ చటర్జీని పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగించినట్లు చెప్పారు.
పార్థ్ ఛటర్జీని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు ఆయనను ప్రధాన కార్యదర్శి, జాతీయ ఉపాధ్యక్షుడు, మరో మూడు పదవుల నుంచి కూడా సస్పెండ్ చేసినట్లు అభిషేక్ బెనర్జీ చెప్పారు.
ఝార్ఖండ్: జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసులో ఇద్దరికి శిక్ష

ఫొటో సోర్స్, RAVI PRAKASH
రవి ప్రకాష్, బీబీసీ హిందీ కోసం
ధన్బాద్ న్యాయమూర్తి ఉత్తమ్ ఆనంద్ మరణించిన ఏడాది తర్వాత ఆయనను ఢీకొట్టిన ఆటో డ్రైవర్ లఖన్ వర్మ, సహచరుడు రాహుల్ వర్మను సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించింది. ఆగస్టు 6న వీరికి శిక్ష ఖరారు అవుతుంది.
గత ఏడాది జూలై 28వ తేదీ ఉదయం వాకింగ్ చేస్తుండగా ఉత్తమ్ ఆనంద్ ను ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్ కావడంతో హైకోర్టు పోలీసులను తీవ్రంగా మందలించింది.
జార్ఖండ్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మొదట ఈ కేసును దర్యాప్తు చేసింది, అయితే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రోజుల తర్వాతదర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించింది.
ఈ కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి రజనీకాంత్ పాఠక్ తీర్పు చెప్పారు. దోషులకు శిక్షను ఆగస్టు 6న ప్రకటిస్తామని తెలిపారు.
ఈ కేసులో సీబీఐ మొత్తం 58 మంది సాక్ష్యాలను సేకరించింది. గతంలో ఈ కేసులో చార్జి షీట్ను గతేడాది అక్టోబర్లో దాఖలు చేశారు.
ధన్బాద్కు చెందిన అప్పటి అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ మరణానికి సంబంధించిన ఈ కేసును జార్ఖండ్ హైకోర్టు పర్యవేక్షిస్తోంది. ఈ సందర్భంగా సీబీఐ అధికారులను పలుమార్లు మందలించారు. ఈ అంశం పై సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది.
సంపన్న మహిళల జాబితాలో 12 మంది హైదరాబాద్ నుంచే
విశాఖలో వివాహిత మిస్సింగ్ కేసు: ‘నాన్నా నేను బతికే ఉన్నాను.. రవితో నాకు పెళ్లయిపోయింది’
పీఎఫ్ఐ: ఇండియాలో ఈ ఇస్లామిక్ సంస్థపై ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? దీని వెనుక ఎవరున్నారు
క్యాన్సర్కు చికిత్స చేస్తే ఎయిడ్స్ పూర్తిగా తగ్గిపోయింది.. ప్రపంచంలోనే హెచ్ఐవీ నుంచి విముక్తి పొందిన నాలుగో రోగి
పార్థ్ ఛటర్జీని మంత్రివర్గం నుంచి తొలగించిన మమత బెనర్జీ

ఫొటో సోర్స్, PRABHAKAR MANI TEWARY
ఫొటో క్యాప్షన్, పార్థ ఛటర్జీ పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్సీ) నియామకాల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర మంత్రి పార్థ్ ఛటర్జీని కేబినెట్ నుంచి తొలగించారు.
పార్థ్ ఛటర్జీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఆయన సన్నిహితుల ఇళ్లపై ఈడీ జరిపిన దాడుల్లో భారీగా నగదు, బంగారం దొరికాయి.
పార్థ్ ఛటర్జీ వ్యవహారంలో విపక్షాల నుంచే కాకుండా సొంత పార్టీ నుంచి కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. పార్థ్ చటర్జీ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి తృణమూల్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఈ రోజు సాయంత్రం సమావేశం కావాల్సి ఉండగా ఈలోగానే మమత ఆయనపై వేటు వేశారు.
‘న్యాయమూర్తులను విమర్శించడంలో ఒక హద్దు ఉండాలి’

ఫొటో సోర్స్, Twitter
కేసుల విచారణ విషయంలో న్యాయమూర్తులను విమర్శించడానికి ఒక హద్దు ఉండాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు.
క్రైస్తువుల మీద జరిగిన దాడులకు సంబంధించి కేసును జడ్జీలు విచారణకు తీసుకోవడంలేదంటూ మీడియాలో వచ్చిన కథనాలను చూశానని ఆయన తెలిపారు.
‘నేను కరోనాతో బాధపడుతూ సెలవు తీసుకున్నా. అందువల్ల ఆ కేసు వాయిదా పడింది. కానీ న్యాయమూర్తులు కేసును తీసుకోవడం లేదంటూ మీడియాలో వచ్చిన వార్తలు చూశా. కానీ మమ్మల్ని టార్గెట్ చేయడంలో ఒక హద్దు ఉండాలి’ అని ఆయన అన్నారు.
దేశంలో క్రైస్తవుల మీద దాడులు, హింస పెరిగిపోతున్నాయని వాటిని అడ్డుకోవాలంటూ బెంగళూరు ఆర్చ్బిషప్ డాక్టర్ పీటర్ మచాదో సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు.
ఈనెల 15న అది విచారణకు రావాల్సి ఉంది. కానీ ధర్మాసనంలోని న్యాయమూర్తులు లేకపోవడం వల్ల అది వాయిదా పడింది.
ఇంత పెద్ద పింక్ డైమండ్ గత 300 ఏళ్లలో ఎక్కడా దొరకలేదు
‘కట్టెల కోసం అడవికి వెళ్తే వజ్రం దొరికింది’, శురైహ్ నియాజీ, బీబీసీ కోసం

ఫొటో సోర్స్, Shuraih Niazi/BBC
ఫొటో క్యాప్షన్, దొరికిన వజ్రాన్ని చూపిస్తున్న గేందా దేవి మధ్యప్రదేశ్లోని ఆదివాసీ ఒక మహిళకు వజ్రం దొరికింది. 4.39 కేరట్ల ఆ వజ్రం విలువ రూ.20 లక్షలు ఉంటుందని అంచనా.
సమీపంలోని అడవిలో కట్టెల కోసం వెళ్లిన గేందా దేవికి దారిలో మెరుస్తూ ఒక రాయి కనిపించింది. ఆమె ఆ రాయిని తీసుకొచ్చి తన భర్తకు చూపించింది.
స్థానిక వజ్రాల వ్యాపారి చూసి అది వజ్రమని, దాన్ని అమ్మితే మంచి విలువ వస్తుందని చెప్పారు.
ఇప్పుడు ఆ వజ్రాన్ని వేలం వేయనున్నారు. వచ్చే డబ్బుల్లో 12శాతం రాయల్టీ, ఒకశాతం పన్ను మినహాయించుకుని మిగతా మొత్తాన్ని గేందా దేవికి ఇస్తారు.
ఆ డబ్బుతో తమ కూతురికి పెళ్లి చేసి, ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారు.
మధ్యప్రదేశ్లో ఒకే సిరంజీతో 30 మందికి కరోనా వ్యాక్సిన్

ఫొటో సోర్స్, Getty Images
మధ్యప్రదేశ్లో ఒక్క సిరంజీతో 30 మంది విద్యార్థులకు కోవిడ్-19 వ్యాక్సిన్ వేయడం మీద వైద్యశాఖ అధికారులు విచారణ చేపట్టారు.
సాగర్ జిల్లాలోని ఒక పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఒకే సిరంజీతో వ్యాక్సిన్ వేస్తుండటాన్ని తల్లిదండ్రులు గమనించి విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
వ్యాక్సిన్ వేసిన జితేంద్ర రాయ్ మీడియాతో మాట్లాడుతూ... ‘నాకు వైద్య అధికారులు ఒక్క సిరంజీ మాత్రమే ఇచ్చారు. వారి ఆదేశాల మేరకు నేను వ్యాక్సిన్ వేశాను’ అని చెప్పారు.
కోవిడ్ మహమ్మారి వల్ల లాక్డౌన్లు విధించిన తర్వాత చిన్నారుల్లో పెరిగిన హెపటైటిస్ కేసులు
చెస్ ఒలింపియాడ్ 2022: చెన్నైలోని ఈ టోర్నీలో భారత గ్రాండ్ మాస్టర్స్ అమెరికాకు చెక్ పెడతారా?
ఏపీ, తెలంగాణల్లో డబ్బును బ్యాంకుల్లో వదిలేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది... ఆ సొమ్మును ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?
స్మృతి ఇరానీ: ‘కాంగ్రెస్ దేశానికి క్షమాపణలు చెప్పాలి’

ఫొటో సోర్స్, Sansad TV
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్మును కాంగ్రెస్ ఎంపీ ‘రాష్ట్రపత్ని’ అన్నారంటూ లోక్సభలో బీజేపీ నిరసనకు దిగింది.
ఆదివాసీ సముదాయానికి చెందిన ఒక మహిళ దేశంలోనే అత్యున్నత పదవిని అలంకరించడం కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతోందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు.
ఈ దేశ ప్రజలకు, ఆదివాసీలకు, పేదలకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలంటూ ఆమె లోక్సభలో డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, Sansad TV
ద్రౌపది ముర్మును ‘రాష్ట్రపత్ని’ అన్నారంటూ బీజేపీ ఆందోళన

ఫొటో సోర్స్, Getty Images
ద్రౌపది ముర్మును ‘రాష్ట్రపత్ని’ అని కాంగ్రెస్ ఎంపీ ఆధిర్ రంజన్ చౌధరి పిలిచారంటూ బీజేపీ ఆందోళనకు దిగింది.
కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలంటూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్తోపాటు ఇతర బీజేపీ ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలో నిరసనకు దిగారు.
‘ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి ఆమెను కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకుంది. ఆమె గెలిచిన తరువాత కూడా అది ఆగలేదు’ అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
తొలిసారి తగ్గిన ‘ఫేస్బుక్’ ఆదాయం

ఫొటో సోర్స్, Reuters
ఫేస్బుక్ మాతృసంస్థ మెటా ఆదాయం తొలిసారి తగ్గింది.
2022 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి 28.82 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. 2021 ఇదే త్రైమాసికంలో 29.07 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంస్థ ఆర్జించింది.
మొత్తం మీద ఆదాయంలో 1శాతం తగ్గుదల కనిపించింది. 2007లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తరువాత మెటా ఆదాయం తగ్గడం ఇదే తొలిసారి.
ఇక లాభం కూడా 36శాతం తగ్గి 6.69 బిలియన్ డాలర్లు నమోదైంది.
ఆర్థిక కార్యకలాపాలు మందగించడం వల్ల డిజిటల్ ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిందని మెటా సీఈఓ మార్క్ జూకర్బర్గ్ తెలిపారు.
మూడో త్రైమాసికంలోనూ ఆదాయం తగ్గొచ్చని మెటా అంచనా వేస్తోంది.
వెస్టిండీస్ సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్
వెస్టిండీస్ మీద మూడో వన్డే గెలిచిన భారత్, సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది.
మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 257 లక్ష్యాన్ని విధించగా వెస్టిండీస్ 137 పరుగులకే ఆలవుట్ అయింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 36 ఓవర్లలో 225 పరుగులు చేసింది. శుభమన్ గిల్ 98 పరుగులు చేయగా కెప్టెన్ శిఖర్ ధవన్ 58 కొట్టాడు.
వర్షం వల్ల మ్యాచ్కు అంతరాయం కలగడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 35 ఓవర్లకు 257 పరుల లక్ష్యాన్ని వెస్టిండీస్కు విధించారు.
చేజింగ్లో తడబడిన వెస్టిండీస్ 26 ఓవర్లకే అన్ని వికెట్లు పోగొట్టుకుని 137 పరుగులు చేసింది.
వెస్టిండీస్లో బ్రాండన్ కింగ్ 42, నికోలస్ పూరన్ 42 పరుగులు చేశారు. ఇక యజువేంద్ర చాహల్ 17 పరుగులకే నాలుగు వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
