కరోనావైరస్పై ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అప్డేట్స్ను మీరు ఎప్పటికప్పుడు బీబీసీ తెలుగు లైవ్ పేజీ ద్వారా తెలుసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతోపాటు జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలు ఈ పేజీలో వెంట వెంటనే అప్డేట్ అవుతాయి. ఈరోజు ఇప్పటివరకూ అందిన సమాచారం..
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసుల సంఖ్య 21.5 లక్షలు దాటింది. మృతుల సంఖ్య లక్షా 43 వేలు దాటింది. 5.42 లక్షలకు పైగా రోగులు కోవిడ్-19 బారినుంచి కోలుకున్నారు.
అమెరికాలో ఇప్పటివరకూ 6.67 లక్షల మందికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. 32,900 మంది మృతి చెందారు. 54 వేల మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు.
ఇటలీ, స్పెయిన్లలో కూడా వ్యాధి విజృంభిస్తోంది. ఇటలీలో 22వేలమంది చనిపోగా, స్పెయిన్లో 19వేలమంది మరణించారు.
భారత్లో కేసుల సంఖ్య 12759. ఇప్పటివరకూ 420 మంది మరణించారు.
ఆంధ్రప్రదేశ్లో మొత్తం కేసుల సంఖ్య 534 కాగా, 14 మంది మరణించారు.
తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 700కు చేరింది.
లాక్ డౌన్తో కరోనావైరస్ సమస్య అంతం కాదని, వ్యూహాత్మకంగా వ్యవహరించి పరిష్కారం కనుగొనాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సూచించారు.
భారత్ నుంచి 55 దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతి అవుతోంది. కరోనావైరస్ చికిత్సకు ఈ ఔషధం కావాలని ప్రపంచ దేశాలు భారత్ను అర్థిస్తున్నాయి.
మే 31 వరకు శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. మార్చి 13 తర్వాత రోజులకు సేవలు బుక్ చేసుకున్న వారికి డబ్బు రీఫండ్ ఇస్తామని తెలిపింది.