లాక్ డౌన్ తీవ్ర మానసిక ఒత్తిడిని కల్గిస్తుందన్న రాయల్ కపుల్
కరోనావైరస్ కారణంగా ప్రకటించిన లాక్ డౌన్ వల్ల చాలా మంది ప్రజలు తీవ్ర ఒత్తిడికి గురవుతారని అటువంటి వారి మానసిక ఆరోగ్యం గురించి పట్టించుకోవడం చాలా ముఖ్యమని డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ అభిప్రాయపడ్డారు.
ప్రజలకు ఎక్కడ సహాయం లభిస్తుందన్న విషయం తెలియాల్సినవసరం ఇప్పుడే ఎక్కువ ఉందని ప్రిన్స్ విలియమ్స్ అన్నారు. కరోనావైరస్ సోకిన వారికి సాంత్వన కల్గించడంలో ఎన్హెచ్ఎస్ ఉద్యోగులు తమ శక్తి కొద్దీ శ్రమిస్తున్నారని బీబీసీకి ఇచ్చిన ఇంటర్యూలో చెప్పారు.
తన తండ్రి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కి వైరస్ సోకిందని తెలియగానే చాలా ఆందోళన చెందానని అన్నారు. లాక్ డౌన్ సమయంలో శారీరక శ్రమపై కూడా దృష్టి పెట్టడం చాలా అవసరమని కేథరిన్ అభిప్రాయపడ్డారు.
మనలో ఏ ఒక్కరూ సూపర్ హ్యూమన్స్ కాదని ఈ సమయంలో తలెత్తే భావోద్రేకాలను నియంత్రించుకునేందుకు కొంత సమయం పడుతుందని విలియమ్స్ వ్యాఖ్యానించారు. కొంత కాలం తర్వాత అంతా సర్దుకుంటుందని అన్నారు.