ముస్లిం పక్షానికి
ఐదు ఎకరాల స్థలం ఇవ్వాలన్న సుప్రీం తీర్పుతో ఓవైసీ విభేదించారు.
·మా చట్టపరమైన హక్కుల కోసం మేం పోరాడుతున్నాం.
ముస్లింలు పేదలు, వారిపై వివక్షత ఉంది. మాకు ఉద్దీపనలు, భిక్ష అవసరం లేదు.
·ముస్లిం పర్సనల్ లా బోర్డు 5 ఎకరాల స్థలాన్ని
అంగీకరిస్తుందో లేదో చూడాలి, ఈ ప్రతిపాదనను తిరస్కరించాలని నా వ్యక్తిగత అభిప్రాయం.
·హిందూ రాష్ట్ర మార్గంలో దేశం వెళుతోంది. అయోధ్య
విషయాన్ని సంఘ్ పరివార్, బీజేపీలు ఉపయోగించుకుంటాయి.
·అక్కడ ఒక మసీదు ఉంది, అలాగే ఉంటుంది.
500 ఏళ్ల నుంచి అక్కడ మసీదు ఉందని మేం మా ముందుతరాలకు చెబుతాం. 1992లో, సంఘ్ పరివార్, కాంగ్రెస్
కుట్ర కారణంగా ఆ మసీదు కూలిపోయింది.