You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

అయోధ్యపై తీర్పు మోదీ ప్రసంగం: ‘కలపడం, కలవడం, కలసికట్టుగా జీవించడం.. ఇదే నవంబర్ 9 సందేశం’

అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువులకు చెందుతుందని సుప్రీంకోర్టు తుది తీర్పు చెప్పింది. ముస్లింలకు అయోధ్యలోనే మరో చోట 5 ఎకరాలు కేటాయించాలని ఆదేశించింది.

లైవ్ కవరేజీ

  1. రామభక్తి, రహీం భక్తి కాదు దేశభక్తి కావాలి: ప్రధాని నరేంద్ర మోదీ

    అయోధ్య అంశంలో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ వరుస ట్వీట్లు చేశారు.

    "దేశ అత్యున్నత న్యాయస్థానం అయోధ్యపై తన తీర్పును వెలువరించింది. ఈ తీర్పువప ఎవరూ గెలుపు-ఓటమిలుగా చూడకూడదు. రామభక్తి ఉన్నా, రహీమ్ భక్తి ఉన్నా ఇప్పుడు మనందరం దేశభక్తి అనే భావనను బలోపేతం చేయాలి. శాంతి, సామరస్యం, ఐక్యతను కాపాడాలని దేశ ప్రజలకు నా విన్నపం"

    "సుప్రీంకోర్టు ఈ తీర్పు చాలా రకాలుగా ముఖ్యమైనది. సమస్యను పరిష్కరించడానికి న్యాయ ప్రక్రియను అనుసరించడం ఎంత ముఖ్యమో ఇది చెబుతుంది. ప్రతి పక్షం తమ తమ వాదనలు వినిపించడానికి తగినంత సమయం, అవకాశం ఇచ్చారు. న్యాయ దేవాలయంలో దశాబ్దాల నాటి ఈ కేసును స్నేహపూర్వకంగా పరిష్కరించారు".

    "ఈ తీర్పు న్యాయ ప్రక్రియపై సామాన్యులకు ఉన్న విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తుంది".

    "మన దేశంలో వేల సంవత్సరాల సౌభ్రాతృత్వానికి అనుగుణంగా మన 130 కోట్ల భారతీయులకు శాంతి, సంయమనాన్ని పరిచయం చేయాలి. భారత శాంతిపూర్వక సహజీవనం అంతర్లీన భావనను పరిచయం చేయాలి.

  2. తీర్పును స్వాగతించిన అమిత్ షా

    సుప్రీంకోర్టు తీర్పును కేంద్ర హోంమంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షా స్వాగతించారు. "అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ చారిత్రక తీర్పు ఒక మైలురాయిగా నిలిచిపోతుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ తీర్పు భారత ఐక్యత, సమగ్రత, సంస్కృతిని మరింత బలోపేతం చేస్తుంది”

    "దశాబ్దాల నుంచీ నడుస్తున్న శ్రీ రామజన్మభూమికి సంబందించిన ఈ కేసును ఈరోజు ఈ తీర్పుతో తుదిరూపం ఇచ్చారు. భారత న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులందరినీ నేను అభినందిస్తున్నాను" అన్నారు.

  3. సంతోషం వ్యక్తం చేసిన మురళీ మనోహర్ జోషి

    "రామ జన్మభూమి ఉద్యమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా నాకు కూడా కొంత భాగస్వామ్యం అందించే అవకాశం లభించడం చాలా ఆనందంగా ఉంది" అని మురళీ మనోహర్ జోషి చెప్పారు.

  4. అశోక్ సింఘల్‌కు భారత రత్న ఇవ్వాలి: సుబ్రమణ్యన్ స్వామి డిమాండ్

    బీజేపీ నేత సుబ్రమణ్యన్ స్వామి తన ట్విటర్‌లో “ఈ విజయ ఘడియల్లో మనం అశోక్ సింఘల్‌ను గుర్తుచేసుకోవాలి. నరేంద్రమోదీ ప్రభుత్వం తక్షణం ఆయనకు భారత రత్న ప్రకటించాలి” అన్నారు.

  5. అయోధ్యలో రామ మందిరం నిర్మించాలి: కాంగ్రెస్

    అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించాలని కాంగ్రెస్ భావించింది. కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా భారత జాతీయ కాంగ్రెస్ శ్రీరాముడి ఆలయ నిర్మాణం వైపే నిలుస్తుందని చెప్పింది.

  6. అయోధ్య తీర్పుపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

  7. వివాదాస్పద స్థలం హిందువులకే

  8. సున్నీవక్ఫ్ బోర్డు న్యాయవాది అసంతృప్తి

    సుప్రీం తీర్పుపై సున్నీవక్ఫ్ బోర్డు న్యాయవాది జఫర్యాబ్ జిలానీ అసంతృప్తి వ్యక్తంచేశారు. తీర్పు ప్రతి పూర్తిగా చదివాక భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని వెల్లడించారు.

  9. ప్రజలందరుకూడా సంయమనం పాటించి.. శాంతి భద్రతలకు సహకరించాలి: ఏపీ సీఎం జగన్

    అయోధ్యలో వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు తీర్పు తరువాత ‘‘ప్రజలందరుకూడా సంయమనం పాటించి శాంతి భద్రతలకు సహకరించమని విజ్ఞప్తిచేస్తున్నాను’’ అంటూ ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి పిలుపునిచ్చారు ‘‘అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలియజేసినమీదటే ఈ విషయంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడింది. ఇటువంటి పరిస్థితుల్లో మతసామరస్యానికి భంగం కలిగించేలా, రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని అన్ని వర్గాలకూ విజ్ఞప్తిచేస్తున్నాను.’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

  10. స్థల నిర్వహణ, ఆలయ నిర్మాణ బాధ్యతలు చూడడానికి ట్రస్ట్ ఏర్పాటు చేయాలి

    కేంద్రం నేతృత్వంలో మూడు నాలుగు నెలల్లో ఒక ట్రస్టు ఏర్పాటు చేసి, ఆ ట్రస్టుకు స్థలాన్ని అప్పగించాలి. అక్కడ రామమందిర నిర్మాణం చేపట్టాలి. అలాగే సున్నీ వక్ఫ్ బోర్డుకు అయిదు ఎకరాల స్థలం ఇచ్చేలా చూడాలని కోర్టు తెలిపింది.

  11. అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువులకే.. ముస్లింలకు మరో చోట స్థలం కేటాయింపు

    అయోధ్యలో వివాదాస్పద ‘రామజన్మభూమి-బాబ్రీమసీదు’ స్థలం హిందువులకే కేటాయిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సున్నీ వక్ఫ్ బోర్డుకు అయిదెకరాల స్థలాన్ని వేరే చోట కేటాయింపు

  12. వివాదాస్పద స్థలాన్ని భాగాలుగా పంచడం కుదరదు

    వివాదాస్పద స్థలాన్ని భాగాలుగా పంచడం కుదరదు. అదంతా ఒకే భూభాగం. దాన్ని ముక్కలు చేసే ప్రసక్తే లేదు. సున్నీ వక్ఫ్ బోర్డుకు వేరే చోట అయిదెకరాల స్థలం

  13. హైదరాబాద్‌లో గట్టి భద్రతా ఏర్పాట్లు

    అయోధ్య తీర్పు నేపథ్యంలో హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. సున్నితమైన ప్రాంతాలలో ప్రత్యేక బలగాలను మోహరించామని, సోషల్ మీడియాలో అవాంఛిత వ్యాఖ్యలపై ఒక కన్నేసి ఉంచామని చెప్పారు.

  14. 1528 నుంచి 1856 మధ్య అయోధ్యలోని వివాదస్పద స్థలంలో నమాజు జరగలేదు

    ‘‘వివాదాస్పద స్థలంలో 1528 నుంచి 1856 మధ్య ఎలాంటి నమాజు జరిగినట్లు ఆధారాలు లేవు. చరిత్రలో యాత్రికులు చెప్పిన వాదనలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. హిందువులు అయోధ్యను రామజన్మభూమిగా భావిస్తారు, అది వారి నమ్మకం. ముస్లింలు దాన్ని బాబ్రీ మసీదు అంటారు. అయితే, ఇక్కడ రాముడు జన్మించాడని హిందువులు నమ్ముతున్నారనడంలో ఎలాంటి వివాదం లేదు’’

  15. ముంబయి, రాజస్థాన్‌లోని గంగానగర్‌లో 144 సెక్షన్

    అయోధ్య తీర్పు నేపథ్యంలో మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఆదివారం 11 గంటల వరకు 144 సెక్షన్ విధించారు. రాజస్థాన్‌లోని గంగానగర్‌లో నవంబరు 19 వరకు సెక్షన్ 144 విధించారు.

  16. అయోధ్య రాముడి జన్మస్థలమన్న నమ్మకం ఈనాటిది కాదు: సీజేఐ

    ‘‘భక్తివిశ్వాసాలు, వ్యక్తుల నమ్మకాల ఆధారంగా వివాదాలు పరిష్కరించలేం. రాముడు అయోధ్యలోనే జన్మించాడని హిందువులు ఎప్పటినుంచో నమ్ముతున్నట్లు చరిత్ర చెబుతోంది.’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు.

  17. బాబ్రీ మసీదుకు ముందు అక్కడున్నది ఇస్లామిక్ నిర్మాణం కాదు

    ‘‘బాబ్రీ మసీదు ఖాళీ స్థలంలో నిర్మించింది కాదు, కానీ, అంతకుముందు అక్కడ ఉన్న నిర్మాణాన్ని కూల్చివేశారా లేదా అన్నది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్ఠం చేయలేదు.

    అంతకుముందు అక్కడున్నది ఇస్లామిక్ నిర్మాణం కాదు.

    అంతకుముందున్న నిర్మాణం బాబ్రీమసీదు కంటే పెద్దది కాకున్నా దాదాపు అంతే స్థాయిలో ఉన్న కట్టడమే.

    అంతకుముందున్నది దేవాలయమని, దానికి నల్లని స్తంభాలు ఉపయోగించారని పురావస్తు శాఖ వివరణలు సూచిస్తున్నాయి’’

    - సీజేఐ రంజన్ గొగోయ్

  18. షియా బోర్డు పిటిషన్‌ను కొట్టివేత

    అయోధ్య కేసులో తీర్పు పాఠం చదువుతున్న చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్. షియా బోర్డు పిటిషన్‌ కొట్టివేత.

    బాబ్రీ మసీదును కట్టింది ఖాళీ స్థలంలో కాదు, బాబ్రీ మసీదును మీర్ బాకీ నిర్మించారని చెప్పిన సీజేఐ

  19. సుప్రీంకోర్టుకు చేరుకున్న సీజేఐ రంజన్ గొగోయ్

    చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సహా రాజ్యాంగ ధర్మాసనంలోని అయిదుగురు న్యాయమూర్తులు సుప్రీంకోర్టుకు చేరుకున్నారు.

  20. సుప్రీంతీర్పును గౌరవించండి: చంద్రబాబు

    ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు అయోధ్య తీర్పు నేపథ్యంలో ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘‘అయోధ్య విషయమై తీర్పు వెలువడబోతున్న సందర్భంలో ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే. తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా అందరం హృదయపూర్వకంగా ఆ తీర్పును స్వీకరించాలి. సంయమనం పాటించాలి, మత సామరస్యం కాపాడాలి. శాంతి, సౌభాతృత్వంతో సమసమాజ నిర్మాణమే మన అంతిమలక్ష్యం కావాలి.’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.