బ్రిటన్ స్విండన్ ఆలయం: ఆరు నెలల్లో ఆరుసార్లు చోరీ, సీసీకెమేరాకు చిక్కిన దుండగులు

హిందూ దేవాలయంపై దాడి

ఫొటో సోర్స్, WILTSHIRE POLICE

ప్రచురణ

బ్రిటన్‌లోని స్విండన్ దేవాలయంలో తరచూ దొంగతనాలు జరుగుతున్నాయి. ఆరు నెలల్లో ఆరు సార్లు చోరీ చేశారు.

ఈ దేవాలయంపై దాడులు చేసిన కొందరు దుండగులు.. దేవుడి విగ్రహాలు పెట్టే ప్రాంతాలను చిందరవందర చేశారు.

చివరిసారిగా అక్టోబరు 31న దాడి జరిగింది. ఆలయంలో ఏర్పాటు చేసిన కేబుళ్లు, పైపులను దుండగులు తీసుకెళ్లిపోయారు.

‘‘మందిర నిర్మాణంలో ఉపయోగించిన స్టీలు సామగ్రిని ఎత్తుకెళ్లడానికి వారు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు’’ అని విల్ట్‌షైర్ పోలీస్ విభాగం అధికారి డెట్ కాన్ హెలిన్ క్యారిక్ అన్నారు.

హిందూ దేవాలయంపై దాడి

ఫొటో సోర్స్, WILTSHIRE POLICE

బ్రిటన్‌లోని డెర్బి రోడ్‌లోనున్న ఈ దేవాలయాన్ని గత మే నుంచి అక్టోబరు మధ్య దాదాపు ఆరుసార్లు దుండగులు దోచుకున్నారు.

ఈ ఆలయాన్ని స్విండన్ బరో కౌన్సిల్ గత నెలలో మూసివేసింది. భవనం పూర్తిగా ధ్వంసం కావడంతో లోపలకు భక్తులకు పంపకూడదని నిర్ణయించినట్లు కౌన్సిల్ తెలిపింది.

హిందూ దేవాలయంపై దాడి

ఫొటో సోర్స్, SWINDON HINDU TEMPLE

ఇటీవల భారీ తాళాలు, షట్టర్లను ధ్వంసం చేసి దుండగులు లోపలకు ప్రవేశించారు. అక్టోబరు 31 రాత్రి 7.20 నుంచి 9 మధ్య ఈ దాడి జరిగింది.

ఆలయంలోకి చొరబడి, దోచుకున్న దుండగుల ఫోటోలను పోలీసులు విడుదల చేశారు.

‘‘ఆలయం పరిసరాల్లో స్థానిక అధికారులు గస్తీని పెంచారు. దర్యాప్తును కూడా వేగవంతం చేశారు. మా దగ్గర సీసీటీవీ ఫోటోలు కూడా ఉన్నాయి. వీటి ఆధారంగా దర్యాప్తును ముందుకు తీసుకెళ్తాం’’ అని క్యారిక్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)