కరోనావైరస్ అన్‌లాక్-3: జిమ్‌లు, యోగా సెంటర్లకు ఓకే, స్కూళ్లు, థియేటర్లు, బార్లు ఆగస్ట్ తర్వాతే...

ప్రచురణ

భారత హోం మంత్రిత్వ శాఖ అన్‌లాక్ 3 మార్గదర్శకాలు విడుదల చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం కోవిడ్-19 కంటైన్‌మెంట్ జోన్ బయట చాలా సడలింపులు ఇచ్చారు. కంటైన్‌మెంట్ జోన్లలో ఆగస్టు 31 వరకూ కఠిన లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు.

అన్ లాక్ 3.0 ముఖ్యాంశాలు:

భారత్‌లో మొత్తం కరోనాపాజిటివ్ కేసులు 15 లక్షలకు చేరిన సమయంలో మోదీ ప్రభుత్వం అన్‌లాక్-3 మార్గదర్శకాలు జారీ చేసింది. దేశంలో ఇప్పటికీ రోజుకు దాదాపు 50 వేలకు దగ్గరగాకేసులు నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, అట్ హోం కార్యక్రమాలు అన్నిటినీ సామాజిక దూరం, మిగతా హెల్త్ ప్రొటోకాల్స్ పాటిస్తూ అనుమతిస్తున్నట్లు తెలిపారు.

  • లాక్‌డౌన్-3 మార్గదర్శకాలలో నైట్ కర్ఫ్యూను తొలగించారు.
  • జిమ్‌లు, యోగా సంస్థలు తెరవాలని నిర్ణయించారు.
  • మెట్రో రైళ్లు ఇకమీదట కూడా నడవవు. జనం భారీ సంఖ్యలో ఒకేచోట గుమిగూడడంపై కూడా నిషేధం కొనసాగుతుంది.
  • స్కూళ్లు, కాలేజీలు, మిగతా విద్యా సంస్థలు ఆగస్టు తర్వాత తెరవాలని కేంద్రం నిర్ణయించింది.
  • సినిమా హాళ్లు, స్విమింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియంలను ఆగస్టు 31 వరకూ మూసిఉంచనున్నారు.
  • అంతర్జాతీయ విమాన సేవలను పరిమిత స్థాయిలో అనుమతించారు.
  • రాజకీయ, సామాజిక, స్పోర్ట్స్, వినోద, అకడమిక్, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలపై ఆగస్టు 31 వరకూ నిషేధం కొనసాగుతుంది.
  • 65 ఏళ్లకు పైబడిన వృద్ధులు, వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారు, గర్భిణులు, పదేళ్లలోపు పిల్లలు అత్యవసరమైతే తప్ప, ఇళ్లలోనే ఉండాలని సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)