ఎయిరిండియా విమానానికి 'బెదరింపులు'... లండన్లో అత్యవసర ల్యాండింగ్

ఫొటో సోర్స్, Alamy
ఎయిరిండియా ప్రయాణికుల విమానం అత్యవసర పరిస్థితుల్లో 'ముందస్తు జాగ్రత్త'గా లండన్లోని స్టాన్స్టెడ్ విమానాశ్రయంలో దిగింది. అయితే, అంతకుముందు ఎయిరిండియా 'బాంబు బెదరింపు' వల్ల అలా చేయాల్సి వచ్చిందని ప్రకటించింది.
ముంబయ్ నుంచి నెవార్క్కు బయలుదేరిన ఏఐ191 ఈ విమానాన్ని ల్యాండ్ చేస్తున్నప్పుడు భద్రత కోసం ఆర్ఏఎఫ్ టైఫూన్ విమానాలు అనుసరించాయని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ఫొటో సోర్స్, Twitter
బాంబు బెదరింపులు రావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని ఎయిరిండియా మొదట ట్వీట్ చేసింది. కానీ, ఆ తరువాత ఆ ట్వీట్ను తొలగించింది. బాంబు బెదరింపు అన్నది గాలివార్త అని ఎయిరిండియా అధికారి ఒకరు రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీతో అన్నారు.
లండన్లోని స్టాన్స్టెడ్ విమానాశ్రయం ఒక ప్రకటన చేస్తూ ఎయిరిండియా విమానం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.15 గంటలకు ల్యాండ్ అయిందని, ప్రధాన టర్మినల్కు దూరంగా ప్రత్యేకంగా దానిని నిలిపి ఉంచినట్లు తెలిపింది.
ఆ విమానంలో 327 మంది ప్రయాణికులున్నారని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. విమానం లండన్ టైమ్ ప్రకారం రాత్రి 8 గంటలకు బయలుదేరుతుందని కూడా వెల్లడించారు.

ఫొటో సోర్స్, PA
@డినోగోయెల్ అనే ప్రయాణికుడు, విమానంలోని ప్రయాణికులందరినీ ఒక్కొక్కరిగా తనిఖీ చేసి, వారి బ్యాగులను పరిశీలించి, స్నిఫర్ డాగ్స్కు చూపించి కిందకు దింపారని ట్వీట్ చేశారు.
ఆ తరువాత వారందరినీ బస్సులోకి ఎక్కించి టర్మినల్కు తీసుకువచ్చి, ఫలహారాలు, టీ, కాఫీలు అందించారని ఆయన తెలిపారు.
ఆయన తన ట్వీట్లో ఇంకా, "ప్రయాణికులందరూ ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్నారు, భద్రతా సమస్యలు ఏవో వచ్చాయని అర్థం చేసుకున్నారు" అని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
లండన్లోని స్టాన్స్టెడ్ విమానాశ్రయం ఒక ప్రకటన చేస్తూ ఎయిరిండియా విమానం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.15 గంటలకు ల్యాండ్ అయిందని, ప్రధాన టర్మినల్కు దూరంగా ప్రత్యేకంగా దానిని నిలిపి ఉంచినట్లు తెలిపింది.
లింకన్షైర్లోని కానింగ్స్బీ నుంచి టైఫూన్ జెట్లను ఎయిరిండియా విమానానికి రక్షణగా పంపించామని ఆర్ఏఎఫ్ అధికారు ఒకరు తెలిపారు.
ఈ ప్రాంతంలో అవి సూపర్సానిక్ వేగంతో ప్రయాణించేందుకు అనుమతి ఉందని, వాటి శబ్దం భీకర మేఘ గర్జనలా ఉంటుందని ఆయన చెప్పారు.

బీబీసీ ప్రతినిధి సురంజనా తివారీతో మాట్లాడిన హీత్రూ ఎయిర్ పోర్ట్లోని ఎయిరిండియా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ దేబాశిష్ గోల్డర్ ఒక ప్రయాణికుల విమానాన్ని భద్రతా కారణాలతో దారి మళ్లించామని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- IND Vs.WI LIVE: 29 పరుగులకు తొలి వికెట్ కోల్పోయిన భారత్, రోహిత్ శర్మ ఔట్
- భీమాకోరేగావ్ హింస కేసులో అరెస్టయిన వారికి ఎడాదిగా బెయిల్ ఎందుకు రావడం లేదు....
- ఇలా చేస్తే 180 ఏళ్లు బతకడం సాధ్యమేనట... మీరూ ట్రై చేస్తారా
- ఆ పొలం నిండా కుళ్లిపోతున్న మృతదేహాలు.. వాటి మీద శాస్త్రవేత్తల పరిశోధనలు
- శ్రీలంక: యుద్ధంలో బద్ధ శత్రువులు ప్రేమలో పడ్డారు
- సామాన్యుడి విజయాన్ని సహజంగా చూపించిన 'మల్లేశం'
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)























