తుర్కియే, సిరియా
సరిహద్దులో వచ్చిన తీవ్ర భూకంపంలో మృతుల సంఖ్య 8వేలకు చేరింది.
తుర్కియేలో 5,894,
సిరియాలో 1,932 మంది చనిపోయినట్లుగా వార్తా సంస్థ ఏఎఫ్పీ రిపోర్ట్ చేసింది.
భవనాల శిథిలాల్లో
చిక్కుకున్న వారి కోసం సహాయక సిబ్బంది వెతుకుతూనే ఉన్నారు. తీవ్రమైన చలి
రాత్రుల్లోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
అనేక రూపాల్లో
సాయం అందించేందుకు విదేశాలు ముందుకు వస్తున్నాయి. భారత్ ఇప్పటికే సహాయక చర్యల కోసం
రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపింది.
కొన్ని దేశాలు
ఆర్థికసాయం ప్రకటిస్తున్నాయి. మరికొన్ని అవసరమైన కిట్లను పంపుతున్నాయి. అయితే తమకు
అవసరం లేని వస్తువులు కూడా చాలా వస్తున్నాయని, వాటి కంటే డబ్బులు పంపితే మేలని కొందరు
అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ భూకంపంలో తుర్కియే ఫుట్బాల్ టీం గోల్ కీపర్ అహ్మద్ ఆయప్ తుర్క్సలేన్ చనిపోయారు.
భూకంప బాధితుల సంఖ్య సుమారు 2.3 కోట్లు ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది.
సోమవారం తుర్కియే, సిరియా సరిహద్దులో తీవ్రమైన భూకంపాలు చోటు చేసుకున్నాయి. 7,8, 7.5 తీవ్రతతో ఆ భూకంపాలు వచ్చాయి.