ఏపీలో రిపబ్లిక్ వేడుకలు.. జెండా ఎగరవేసిన గవర్నర్ బిశ్వభూషణ్
ఏపీలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతకాన్ని ఎగరవేశారు.
ఈ వేడుకల సందర్భంగా పలు మంత్రిత్వ శాఖలకు చెందిన శకటాలను ప్రదర్శించారు.ఈ శకటాలు ఆకర్షణీయంగా నిలిచాయి.
ఈ వేడుకల్లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
‘‘స్వతంత్ర భారతదేశాన్ని గణతంత్ర రాజ్యంగా మార్చిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 73 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఈ గణతంత్ర దినోత్సవం నాడు మన రాజ్యాంగకర్తలను స్మరించుకుంటూ వారి బాటలో నడిచి దేశ అభ్యున్నతికి కృషి చేద్దాం’’ అని ఏపీ సీఎం ట్వీట్ చేశారు.