కాంగ్రెస్ పార్టీ 138వ వ్యవస్థాపక దినోత్సవం
నేడు కాంగ్రెస్ పార్టీ 138వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు దిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇతర సీనియర్ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.
‘ప్రస్తుతం భారతదేశ ఆదర్శాల మీద దాడి జరుగుతోంది. దేశవ్యాప్తంగా విద్వేషమనే గోతులను తీస్తున్నారు. పెరిగిన ధరలు, నిరుద్యోగం వల్ల తలెత్తుతున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’ అని ఈ సందర్భంగా మాట్లాడుతూ మల్లికార్జున ఖర్గే విమర్శించారు.
1885 డిసెంబరు 28న భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించారు.