You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

మహిళల టీ-20 వరల్డ్ కప్‌-2023: భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

2023 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాలో జరగబోయే మహిళల టీ-20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

లైవ్ కవరేజీ

  1. కాంగ్రెస్ పార్టీ 138వ వ్యవస్థాపక దినోత్సవం

    నేడు కాంగ్రెస్ పార్టీ 138వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు దిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తున్నారు.

    కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇతర సీనియర్ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.

    ‘ప్రస్తుతం భారతదేశ ఆదర్శాల మీద దాడి జరుగుతోంది. దేశవ్యాప్తంగా విద్వేషమనే గోతులను తీస్తున్నారు. పెరిగిన ధరలు, నిరుద్యోగం వల్ల తలెత్తుతున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’ అని ఈ సందర్భంగా మాట్లాడుతూ మల్లికార్జున ఖర్గే విమర్శించారు.

    1885 డిసెంబరు 28న భారత జాతీయ కాంగ్రెస్‌ను స్థాపించారు.

  2. అఫ్గానిస్తాన్: మహిళల మీద ఆంక్షలు ఎత్తి వేయాలంటూ యూఎన్ భద్రతామండలి పిలుపు

    అఫ్గానిస్తాన్‌లో మహిళలను విద్యకు దూరం చేయడం మీద ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆందోళన వ్యక్తం చేసింది.

    పాఠశాలలు, యూనివర్సిటీలకు వెళ్లడాన్ని నిషేధించడంతోపాటు ఎన్జీఓలలో మహిళలు పని చేయడాన్ని కూడా అఫ్గానిస్తాన్‌లోని తాలిబాన్ పాలకులు రద్దు చేశారు.

    ఇది మానవహక్కులను హరించడమేనని భద్రతా మండలి విమర్శించింది. ఆ ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని పిలుపునిచ్చింది.

  3. అమెరికా మంచు తుపాను: 60 దాటిన మృతుల సంఖ్య

    అమెరికాను చుట్టు ముట్టిన మంచు తుపానుతో ఇప్పటి వరకు సుమారు 62 మంది చనిపోయారు.

    పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్న బఫెల్లో సిటీలో మరణాలు 28కి చేరాయి. ఇక్కడ ఇప్పటికీ వేల మందికి విద్యుత్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ట్రాఫిక్‌ వ్యవస్థను చక్కదిద్దేందుకు మిలిటరీ పోలీసులను మోహరించారు.

    బఫెల్లో సిటీలో ప్రస్తుతం పరిస్థితులు కాస్త మెరుగు పడ్డాయని, మంచు పడటం బాగా తగ్గిందని అధికారులు తెలిపారు.

    అయితే కొందరు షాపులను పగుల కొట్టి టీవీలు వంటివి ఎత్తుకుని పోతున్నారని, ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేసినట్లు బఫెల్లో పోలీస్ కమిషనర్ వెల్లడించారు.

    మంచు తుపాను వల్ల అమెరికా వ్యాప్తంగా వేల విమాన సర్వీసులను రద్దు చేస్తున్నారు. మంగళవారం 4,800 విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. దీంతో వేల మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకు పోయారు.

  4. హలో ఆల్, గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.