వాంగ్ వెన్బిన్: భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితి ‘సాధారణం’గానే ఉంది

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల్లో సైనికులు ఎవరూ చనిపోలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లోక్‌సభలో తెలిపారు.

లైవ్ కవరేజీ

  1. అరుణాచల్‌: 'తవాంగ్‌లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ఎవరూ చనిపోలేదు' - రాజ్‌నాథ్‌ సింగ్‌

    రాజ్‌నాథ్‌ సింగ్‌

    ఫొటో సోర్స్, sansad tv

    అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లోక్‌సభలో మాట్లాడారు.

    "2022 డిసెంబర్ 9న, తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్సేలో చైనా సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడింది. కానీ భారత సైన్యం వారిని అడ్డుకుంది. ఘర్షణలో ఇరువైపులా కొంతమంది సైనికులు గాయపడ్డారు. మనవైపు సైనికులు ఎవరూ చనిపోలేదు. ఎవరికీ తీవ్రమైన గాయాలు కాలేదు. భారత సైనిక కమాండర్లు సకాలంలో జోక్యం చేసుకోవడంతో, చైనా సైన్యం వెనక్కు మళ్లింది" అని రాజ్‌నాథ్‌ సింగ్‌ సభకు తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    "డిసెంబరు 9న, చైనాకు చెందిన పీఎల్ఏ దళాలు తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్సే వద్ద వాస్తాధీన రేఖను ఆక్రమించాయి. స్టేటస్ కో మార్చడానికి ప్రయత్నించాయి. మన దళాలు దీన్ని తిప్పికొట్టాయి. పీఎల్ఏ మన భూభాగంలోకి చొరబడకుండా నిలువరించాయి. వారిని వెనక్కు మళ్లేలా చేశాయి" అని రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    "ఈ ఘటన తరువాత డిసెంబర్ 11న ఏరియా స్థానిక కమాండర్ చైనా కమాండర్‌తో ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించి, ఈ ఘటనపై చర్చించారు. చైనా కవ్వింపు చర్యలకు పాల్పడ్దారన్న వాదనలను తిరస్కరించింది. సరిహద్దుల్లో శాంతిని కొనసాగించమని చెప్పింది" అని రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 3

    అంతకుముందు హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నంతకాలం మన భూభాగంలో ఒక అంగుళం భాగాన్ని కూడా ఎవరూ ఆక్రమించలేరని అన్నారు.

    "డిసెంబర్ 8-9 మధ్య రాత్రి (అరుణాచల్ ప్రదేశ్‌లో) మన భారత ఆర్మీ దళాలు చూపిన పరాక్రమాన్ని అభినందిస్తున్నాను" అని అమిత్ షా అన్నారు.

  2. రాజస్థాన్: ఒకే కోచింగ్ సెంటర్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య

    రాజస్థాన్

    ఫొటో సోర్స్, Getty Images

    మోహర్ సింగ్ మీణా

    బీబీసీ కోసం

    రాజస్థాన్‌లోని కోటాలో సోమవారం ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. వీరిలో ఇద్దరు విద్యార్థులు బిహార్‌కు చెందినవారు కాగా, ఒకరు మధ్యప్రదేశ్‌కు చెందినవారు.

    "ముగ్గురూ అలెన్ కోచింగ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులే. ఇద్దరు విద్యార్థులు కోటాలో తల్వండి ప్రాంతంలోని పేయింగ్ గెస్ట్ (పీజీ) 'కృష్ణ కుంజ్‌'లో ఉంటున్నారు. పీజీలోని రెండు వేర్వేరు గదుల్లో వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో ఒకరు బిహార్‌లోని సుపాల్ జిల్లాకు చెందిన అంకుష్ ఆనంద్ కాగా, మరొకరు బిహార్‌లోని గయా జిల్లాకు చెందిన ఉజ్వల్ కుమార్. ఇద్దరికీ సుమారు పదిహేడేళ్లుంటాయి. ఉజ్వల్‌కుమార్‌ ఇంజినీరింగ్‌కు ప్రిపేర్‌ అవుతుండగా, అంకుష్‌ నీట్‌కు సిద్ధమవుతున్నాడు" అని కోటా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేసర్ సింగ్ షెకావత్ బీబీసీతో చెప్పారు.

    "కున్హాడీ ప్రాంతంలోని ఒక హాస్టల్‌లో ఉంటున్న 17 ఏళ్ల ప్రణవ్ వర్మ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అతను మధ్యప్రదేశ్‌లోని శివపురి నివాసి. కోటాలో ఉంటూ నీట్‌కు ప్రిపేర్ అవుతున్నాడు" అని ఎస్పీ చెప్పారు.

    ఉజ్వల్ కుమార్ ఇద్దరు అక్కలు కోటలోనే ఉంటున్నారని, వారు ఉజ్వల్‌ను సంప్రదించడానికి ప్రయత్నించగా, స్పందించకపోవడంతో ఆత్మహత్య విషయం తెలిసిందని ఎస్పీ తెలిపారు.

    రాజస్థాన్‌

    ఈ నేపథ్యంలో, ఎస్పీ కేసర్ సింగ్ షెకావత్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు, పీజీ లేదా హాస్టళ్లలో ఉంటున్న పిల్లలు ఎలాంటి అవస్థలు పడుతున్నారో ఈ కమిటీ విచారించనుంది. పిల్లలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? అనే అంశంపై దర్యాప్తు చేయనున్నారు.

    ఒకేరోజు ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య వ్యవహారంలో ఇన్‌స్టిట్యూట్ ఏమీ మాట్లాడకుండా తప్పించుకుంటోంది. అయితే, ఇన్‌స్టిట్యూట్‌కు సంబంధించిన ఒక వ్యక్తి బీబీసీతో మాట్లాడారు. ఆయన, తన పేరును గోప్యంగా ఉంచమని కోరారు.

    "పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం విచారకరం. ఈ ముగ్గురు పిల్లలూ మా ఇన్‌స్టిట్యూట్‌కు చెందినవారు. కోటాలో రెండు లక్షల మంది విద్యార్థులు ఉంటే, లక్షన్నర మంది విద్యార్థులు అలెన్ ఇన్‌స్టిట్యూట్‌లోనే చదువుతున్నారు" అని ఆయన చెప్పారు.

  3. ఆస్ట్రేలియాలో కాల్పులు.. ఇద్దరు పోలీసులు సహా ఆరుగురు మృతి

    మాథ్యూ ఆర్నాల్డ్, రాచెల్ మెక్‌క్రో ఇటీవలే వారి పోలీసు వృత్తిలో చేరారు

    ఫొటో సోర్స్, QUEENSLAND POLICE

    ఫొటో క్యాప్షన్, మాథ్యూ ఆర్నాల్డ్, రాచెల్ మెక్‌క్రో ఇటీవలే వారి పోలీసు వృత్తిలో చేరారు

    ఆస్ట్రేలియాలో కాల్పులు కలకలం సృష్టించాయి. క్వీన్స్ లాండ్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసు అధికారులు సహా మొత్తం ఆరుగురు మృతి చెందారు.

    కనిపించకుండా పోయిన ఓ వ్యక్తిని వెతికేందుకు పోలీసులు క్వీన్స్ లాండ్‌లోని వియాంబిల్లా ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు.

    అయితే, పోలీసులు అక్కడికి చేరుకున్న వెంటనే వారిపై దుండగులు దాడులకు దిగారు. తుపాకులతో కాల్పులు జరిపారు.

    ఘటన జరిగిన చోటు

    ఫొటో సోర్స్, ABC NEWS

    ఫొటో క్యాప్షన్, ఘటన జరిగిన చోటు

    ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసు అధికారులు మాథ్యూ ఆర్నాల్డ్ (26), రాచెల్ మెక్‌క్రో (29) మరణించారు. వీళ్లిద్దరూ ఇటీవలే డ్యూటీలో చేరారు.

    ఈ కాల్పుల్లో మరో మహిళ కూడా మరణించారు. అనంతరం చేపట్టిన స్పెషల్ ఆపరేషన్‌లో ముగ్గురు అనుమానితులను పోలీసులు హతమార్చారు.

  4. పాకిస్తాన్: 'అమ్మాయిలు సైకిల్ తొక్కడం ‘అశ్లీలం’, మత సంప్రదాయాలకు విరుద్ధం, ఇస్లాం ప్రమాదంలో పడుతోంది'