భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము
సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
దేశ తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా
ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో ఆమె దేశానికి 15వ రాష్ట్రపతి కానున్నారు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకారం,
పార్లమెంట్లోని సెంట్రల్ హాల్లో ఉదయం 10:15 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం
జరగనుంది.
భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ,
ఆమెతో ప్రమాణం చేయించనున్నారు. దీని తర్వాత దేశాన్ని ఉద్దేశించి ద్రౌపది ముర్ము
ప్రసంగిస్తారు.
ఈ కార్యక్రమం తర్వాత ఆమె రాష్ట్రపతి
భవన్కు బయల్దేరతారు. అక్కడ త్రివిధ దళాలకు చెందిన సైనిక సిబ్బంది ఆమెకు గౌరవ
వందనం సమర్పిస్తారు. తర్వాత పదవి నుంచి నిష్క్రమించనున్న రామ్నాథ్ కోవింద్ను సత్కరిస్తారు.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రామ్నాథ్
కోవింద్తో పాటు ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాని
నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, మంత్రి మండలి సభ్యులు, గవర్నర్లు,
ముఖ్యమంత్రులు, దౌత్య కార్యాలయాల అధిపతులు, పార్లమెంట్ సభ్యులు, మిలిటరీ అధికారులు
పాల్గొంటారు.
ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము,
ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ మెజారిటీతో గెలిచారు.