మహారాష్ట్ర: శివసేనలో సంక్షోభం

ఫొటో సోర్స్, Facebook/ShivSena
మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి ప్రభుత్వం చిక్కుల్లో పడింది. శివసేనకు చెందిన మంత్రి ఏక్నాథ్ శిందే సుమారు 10 మంది ఎమ్మెల్యేలతో అజ్ఞానతంలోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.
గుజరాత్లోని సూరత్లో గల ఒక హోటల్లో ఉన్నట్లుగా కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోందని వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
ఏక్నాథ్ శిందేతోపాటు కొందరు ఎమ్మెల్యేలు అందుబాటులోకి రావడం లేదని శివసేన పార్టీకి చెందిన సంజయ్ రౌత్ తెలిపారు.
మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సంజయ్ రౌత్ ఆరోపించారు.
బాల్ ఠాక్రేకు విధేయుడైన ఏక్నాథ్ శిందే, మహావికాస్ అఘడి(ఎంవీఏ) పనితీరుపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఫొటో సోర్స్, Facebook/Eknath Shinde

