అనంతపురంలో కుల అహంకార హత్య: యువకుడిని చంపించిన యువతి తల్లి

వీణ తల్లి యశోద కొందరికి సుపారీ ఇచ్చి హత్య చేయించారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇటుకలపల్లి సీఐ మురళీధర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

లైవ్ కవరేజీ

శారద మియాపురం

  1. ముఖ్యాంశాలు

    భారత్‌లో గడిచిన 24 గంటల్లో 12,781 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

    రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏళ్ల పాటు సాగే ఈ యుద్ధంలో యుక్రెయిన్‌కు మద్దతును కొనసాగించేందుకు పశ్చిమ దేశాలు సిద్ధం కావాలని ఆయన హెచ్చరించారు.

    శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు పరిసర గ్రామాల్లో ఎలుగుబంటి దాడులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

    అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎంఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీపై పలు ఆరోపణలు చేశారు. మాజీ సైనికులు ఉద్యోగాల కోసం అంబానీ లేదా అదానీ ఇళ్ల ముందు బారులు తీరాలని ఎందుకు కోరుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు.

    అనంతపురంలో కుల అహంకార హత్య చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు.

    కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆమెకు సూచించారు.

    నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఐదోసారి సమన్లు జారీచేసింది.

  2. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీకి ఐదోసారి ఈడీ సమన్లు

    రాహుల్ గాంధీ

    ఫొటో సోర్స్, ani

    నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఐదోసారి సమన్లు జారీచేసింది.

    రాహుల్ గాంధీని పశ్నించేందుకు, ఆయన వాంగ్మూలం నమోదు చేసేందుకు ఈ సమన్లు జారీచేశామని పీటీఐ వార్తా సంస్థతో ఈడీ అధికారులు చెప్పారు.

    అక్రమ నగదు చెలామనీ చట్టం కింద ఈ కేసును ఈడీ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.

    ఈ కేసులో జూన్ 13న రాహుల్ గాంధీ తొలిసారి ఈడీ ఎదుట హాజరయ్యారు. ఇప్పటివరకు మొత్తంగా 38 గంటలు రాహుల్‌ను ఈడీ ప్రశ్నించింది.

  3. సోనియా గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి

    సోనియా గాంధీ

    ఫొటో సోర్స్, ani

    కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆమెకు సూచించారు.

    సోనియాకు జూన్ 2న కరోనావైరస్ సోకింది. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.

    ‘‘గంగా రామ్ ఆసుపత్రి నుంచి సోనియా ఇంటికి వచ్చేశారు. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆమెకు సూచించారు’’అని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ చెప్పారు.

    కోవిడ్-19 ఇన్ఫెక్షన్ వల్ల ఆమె ముక్కు నుంచి రక్తం కారినట్లు జైరాం రమేశ్ ఇదివరకు వెల్లడించారు.

  4. అనంతపురంలో కుల అహంకార హత్య: యువకుడిని హత్య చేయించిన యువతి తల్లి, తులసీ ప్రసాద్ రెడ్డి, బీబీసీ కోసం

    మురళి

    ఫొటో సోర్స్, ugc

    ఫొటో క్యాప్షన్, మురళి

    అనంతపురంలో కుల అహంకార హత్య చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు.

    సత్యసాయి జిల్లా కనగానపల్లికి చెందిన చిత్ర మురళి (కురబ) అదే ఊరుకు చెందిన ముళుగూరు వీణ చిన్నతనం నుంచీ స్నేహితులు. వీరిద్దరి స్నేహం ప్రేమగా మారి సంవత్సరం క్రితం పెళ్లిచేసుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా వారు అనంతపురం శివార్లలో నివాసం ఉంటున్నారు.

    కనగానపల్లి మండలం ఎలుకుంట్ల సచివాలయంలో మహిళా పోలీస్‌గా వీణ పనిచేస్తుంటే.. మురళి కియా కంపెనీలో పనిచేసేవారు.

    అయితే వీరిది కులాంతర వివాహం కావడంతో విడాకులు ఇచ్చేయాలని వీణ తల్లి ఒత్తిడి తెచ్చిందని పోలీసులు చెప్పారు.

    వీణ

    ఫొటో సోర్స్, UGC

    ఫొటో క్యాప్షన్, వీణ

    అయితే, ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో ఆఫీసుకు వెళ్లడానికి రోడ్డుపై నిలుచున్న మురళిని కొందరు ఆటోలో బలవంతంగా తీసుకెళ్లినట్టు వీణ పిర్యాదు చేయడంతో కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని పోలీసులు వెల్లడించారు. సమీప పొలాల్లో మురళి మృతదేహం దొరికిందని వారు చెప్పారు.

    వీణ తల్లి యశోద కొందరికి సుపారీ ఇచ్చి హత్య చేయించారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇటుకలపల్లి సీఐ మురళీధర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

    ‘‘మాకు పెళ్లైన నెల నుంచే వేధింపులు మొదలయ్యాయి. అందుకే తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండేదాన్ని. ఇప్పుడు నా భర్తను చంపేశారు’’అని వీణ అన్నారు. దీని వెనుక తనతల్లితో పాటు మరికొందరి హస్తం ఉందని ఆమె ఆరోపించారు.

    దోషులను వెంటనే శిక్షించాలంటూ కురబ సంగం నేతలు ఆందోళనకు దిగారు.

  5. తీవ్ర తుపాను కారణంగా భారత్, బంగ్లాదేశ్‌లలో 59 మంది మృతి

    అస్సాంలో వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోన్న సైనికులు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, అస్సాంలో వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోన్న సైనికులు

    భారత్, బంగ్లాదేశ్‌లలో తీవ్రమైన తుపానుల కారణంగా పిడుగులు, కొండచరియలు విరిగిపడటంతో కనీసం 59 మంది చనిపోయారు.

    లక్షలాది మంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. ప్రభావిత ప్రాంతాలకు చేరడం అత్యవసర సేవల సిబ్బందికి కష్టంగా మారింది.

    రాబోయే రోజుల్లో వరదలు మరింత ఉధృతంగా ఉంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    2004 నుంచి చూస్తే దేశంలో ఇవే విధ్వంసకరమైన వరదలు అని బంగ్లాదేశ్ ప్రభుత్వ అధికారులు అభివర్ణించారు.

    బంగ్లాదేశ్‌ అధికారులు ఈ వరదలను అత్యంత విధ్యంసకరమైనవిగా అభివర్ణించారు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్‌ అధికారులు ఈ వరదలను అత్యంత విధ్యంసకరమైనవిగా అభివర్ణించారు

    భారత్‌లోని అస్సాం రాష్ట్రాన్ని కూడా వరదలు ముంచెత్తాయి. అయిదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో 18 లక్షల మంది ప్రజలు ప్రభావితం అయ్యారు.

    వరద బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందజేయాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు రిపోర్టర్లతో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ అన్నారు.

  6. ‘అదానీ, అంబానీ ఇళ్ల ముందు మాజీ సైనికులు బారులు తీరాలని బీజేపీ కోరుకుంటోంది’- అసదుద్దీన్ ఓవైసీ

    ఎంఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ

    ఫొటో సోర్స్, ANI

    అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎంఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీపై పలు ఆరోపణలు చేశారు.

    మాజీ సైనికులు ఉద్యోగాల కోసం అంబానీ లేదా అదానీ ఇళ్ల ముందు బారులు తీరాలని ఎందుకు కోరుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ‘‘నాలుగేళ్ల పాటు దేశ సేవ చేసిన సైనికులు, ఆ తర్వాత ఉద్యోగం కోసం అదానీ లేదా అంబానీ ఇళ్ల బయట నిలబడాలని మీరెందుకు కోరుకుంటున్నారు. బీజేపీ కార్యాలయాల బయట చౌకీదారులుగా ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు.

    నోట్ల రద్దు తర్వాత 50 రోజుల సమయం ఇవ్వాలని మోదీ అడిగారు.ఆ లక్ష్యం ఇంకా నెరవేరలేదు. లాక్‌డౌన్ ఫలితాలను కూడా మనందరం చూశాం. కానీ, ఈ ప్రభుత్వం తప్పులను పునరావృతం చేయాలనుకుంటోంది.

    యువతే దేశ భవిష్యత్తు. మీరు వారి మాటలు వినండి. వారి డిమాండ్ ప్రకారం తక్షణమే అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోండి’’ అని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.

    అగ్నిపథ్ పథకంలోని నాలుగేళ్ల పదవీకాలాన్ని నిరసిస్తూ చాలా ప్రాంతాల్లో హింసాత్మక ప్రదర్శనలు జరిగాయి. దీనిపై విపక్షాలు, అధికార బీజేపీని తప్పుబట్టాయి. అదేసమయంలో అగ్నిపథ్ పథకం విషయంలో ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ ఆరోపించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  7. జీడి తోటల్లో పనిచేసే వ్యక్తులపై ఎలుగుబంటి దాడి... ఏడుగురికి తీవ్రగాయాలు, రైతు మృతి

    ఎలుగు బంటి

    ఫొటో సోర్స్, ugc

    శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు పరిసర గ్రామాల్లో ఎలుగుబంటి దాడులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

    సోమవారం గిడిసింగి గ్రామం జీడితోటల్లో పనులు చేసుకుని తిరిగి వస్తుండగా ఏడుగురిపై ఎలుగుబంటి దాడి చేసింది.

    అందులో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. చికిత్స కోసం వీరిని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

    అలాగే పొలాల్లో గడ్డి మేస్తోన్న గేదెపై కూడా దాడి చేయడంతో అది మరణించింది.

    ఆదివారం ఎలుగుబంటి దాడిలో కోదండరాం అనే రైతు మృతి చెందినట్లు గిడిసింగి గ్రామస్థులు చెబుతున్నారు.

    అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి ఎలుగుబంటి దాడుల నుంచి తమని కాపాడాలని వజ్రాపుకొత్తూరు సమీప గ్రామస్థులు కోరుతున్నారు.

    ఈ ప్రాంతంలో గత మూడు నెలలుగా ఎలుగుబంట్లు సంచరిస్తూ అర్ధరాత్రి వేళల్లో ఇళ్లలోకి చొరబడన ఘటనలు కూడా జరిగాయి.

  8. NATO Warning: 'యుక్రెయిన్ యుద్ధం ఏళ్ల పాటు సాగుతుంది' - నాటో హెచ్చరిక

    నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్

    ఫొటో సోర్స్, Getty Images

    రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    ఏళ్ల పాటు సాగే ఈ యుద్ధంలో యుక్రెయిన్‌కు మద్దతును కొనసాగించేందుకు పశ్చిమ దేశాలు సిద్ధం కావాలని ఆయన హెచ్చరించారు.

    యుద్ధానికి అయ్యే వ్యయం ఎక్కువగా ఉందని అయితే, తన మిలిటరీ లక్ష్యాలను సాధించేందుకు మాస్కోను అనుమతిస్తే దాని వల్ల జరిగే నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

  9. భారత్‌లో కొత్తగా 12,781 కరోనా కేసులు

    భారత్‌లో గడిచిన 24 గంటల్లో 12,781 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

    ఆదివారం 8,537 మంది కరోనా నుంచి కోలుకున్నారని, 18 మంది మరణించారని తెలిపింది.

    తాజా కేసులతో క్రియాశీల కేసుల సంఖ్య 76,700కు చేరగా, రోజువారీ పాజిటివిటీ రేటు 4.32 శాతంగా ఉంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  10. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా భారత్ బంద్ ప్రకటన దృష్ట్యా భద్రత కట్టుదిట్టం

    అగ్నిపథ్

    ఫొటో సోర్స్, Santosh Kumar/Hindustan Times via Getty Images

    ఆర్మీ రిక్రూట్‌మెంట్ పథకం ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా సోమవారం అనేక సంఘాలు భారత్ బంద్‌ను ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ కూడా దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సత్యాగ్రహ నిరసన చేపట్టింది.

    రాహుల్ గాంధీపై ఈడీ విచారణ, అగ్నిపథ్ పథకాలుగా నిరసనగా సత్యాగ్రహం చేస్తున్నట్లు కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ తెలిపినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది.

    ‘‘ఈరోజు సత్యాగ్రహం చేస్తాం. సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతిని కలిసి అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తాం. మొదట ఈ పథకం గురించి మొదట యువతతో పాటు పార్లమెంట్‌లో చర్చించాలి. కానీ, దీనికంటే ముందు ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలి’’ అని మాకెన్‌ను ఉటంకిస్తూ ఏఎన్‌ఐ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    మరోవైపు భారత్ బంద్ ప్రకటన దృష్ట్యా దేశంలోని అనేక ప్రాంతాల్లో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.

    రైల్వేలు, ఇతర ప్రభుత్వ సంస్థల భద్రత విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.

    పశ్చిమ బెంగాల్, బిహార్, పంజాబ్, జార్ఖండ్, దిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  11. ‘అదానీ గ్రూపుకు ప్రాజెక్ట్ ఇవ్వాలంటూ నన్నెవరూ కోరలేదు’- శ్రీలంక ప్రధాని రణిల్

    రణిల్ విక్రమ సింఘే

    ఫొటో సోర్స్, Getty Images

    తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో కష్టాల్లో ఉన్న సమయంలో శ్రీలంకకు భారత్ సహాయం చేసిందని శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే, వార్తా పత్రిక ‘ద హిందూ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

    విక్రమసింఘే శ్రీలంక ప్రధానిగా బాధ్యతలు తీసుకొని నెలరోజులు గడిచాయి. కొలంబోలో ద హిందూ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక అంశాలపై మాట్లాడారు.

    విదేశీ పెట్టుబడుల గురించి మాట్లాడుతూ తమ దేశంలోకి అదానీ గ్రూపును సాదరంగా స్వాగతిస్తున్నామని అన్నారు.

    అదానీ గ్రూపు గురించి శ్రీలంకకు చెందిన ఒక ఉన్నతాధికారి చేసిన ప్రకటనపై గతంలో వివాదం చెలరేగింది.

    ఉత్తర శ్రీలంకలోని భారీ విద్యుత్ ప్రాజెక్టును అదానీ గ్రూపునకు కట్టబెట్టాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, శ్రీలంక ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని పార్లమెంటరీ కమిటీ ముందు శ్రీలంక ఉన్నతాధికారి ఒకరు అన్నారు.

    వివాదం చెలరేగడంతో ఆ అధికారి తన వ్యాఖ్యను వెనక్కి తీసుకున్నారు.

    ఈ వివాదం గురించి మాట్లాడుతూ... ‘‘నిజంగా భారత ప్రభుత్వానికి ఆ ఆసక్తి ఉంటే, ప్రధాని మోదీ లేదా ఆయన కార్యాలయం నుంచి నాకు ఈ విషయం తెలిసేది. ఈ ప్రాజెక్టును త్వరగా అప్పగించాలంటూ నన్ను ఎవరూ అడగలేదు. మన్నార్ విద్యుత్ ప్రాజెక్టు కోసం స్వయంగా అదానీ గ్రూపు దరఖాస్తు చేసింది. ఈ ప్రతిపాదన చేయడాని కంటే ముందే అదానీ కంపెనీ, శ్రీలంకలో రెండు ప్రాజెక్టులు పూర్తి చేసింది. తాజా ప్రాజెక్టు కోసం క్యాబినెట్‌కు సమర్పించిన పత్రాలను నేను చూశాను. మాకు సెక్రటరీల కమిటీ ఉంది. ఈ కమిటీ, అన్ని ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి ఇందులో ఏదో గందరగోళం జరిగిందని నేను అనుకోను. వేరే ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడతానంటూ అదానీ ముందుకు వస్తే మేం వారిని స్వాగతిస్తాం. భారత్‌కు చెందిన చాలామంది పారిశ్రామికవేత్తలతో నేను ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటా’’ అని రణిల్ చెప్పారు.

  12. French elections: ఫ్రాన్స్ పార్లమెంటు ఎన్నికల్లో ‘లెఫ్ట్ - రైట్’ ఘన విజయాలు.. మెజారిటీ కోల్పోయిన మధ్యేవాద అధ్యక్షుడు మాక్రాన్

    ఎమ్మాన్యుయెల్ మాక్రాన్

    ఫొటో సోర్స్, REUTERS

    ఫ్రాన్స్ అధ్యక్షుడిగా వరుసగా రెండోసారి ఎన్నికై రెండు నెలలు కూడా గడవకముందే.. ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీపై పట్టు కోల్పోయారు.

    జాతీయ అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో వామపక్ష కూటమి, మితవాద పార్టీలు బలం పుంజుకున్నాయి. దీంతో మాక్రాన్ మధ్యేవాద సంకీర్ణం మెజారిటీ కోల్పోయింది.

    తమకు పటిష్టమైన మెజారిటీ అందివ్వాలంటూ మాక్రాన్ ఓటర్లకు ఇచ్చిన పిలుపు ఫలించలేదు. ఆయన సంకీర్ణం డజన్ల సంఖ్యలో సీట్లు కోల్పోయింది.

    మాక్రాన్ ఇటీవలే నియమించిన ప్రధానమంత్రి ఎలిసబెత్ బోర్న్.. ఇది అనూహ్య పరిస్థితి అని అభివర్ణించారు.

    పూర్తి కథనం చదివేందుకు ఈ లింకును క్లిక్ చేయండి

  13. ‘అగ్నివీర్లను మా సంస్థల్లోకి స్వాగతిస్తాం’- ఆనంద్ మహీంద్రా

    ఆనంద్ మహీంద్రా

    ఫొటో సోర్స్, ANI

    అగ్నిపథ్ పథకం కింద నాలుగేళ్లు అగ్నివీర్‌లుగా పనిచేసిన వారికి తమ సంస్థల్లో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రకటించారు.

    ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

    ‘‘అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా చెలరేగిన హింస, బాధను కలిగించింది. గతేడాది ఈ పథకానికి సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడు... అగ్నివీర్లు ఈ పథకం కింద పొందే క్రమశిక్షణ, నైపుణ్యాలు వారిని ఉద్యోగాల పరంగా మరింత శ్రేష్టంగా మారుస్తాయని నేను అన్నాను. ఇప్పుడు కూడా అదే మాట మళ్లీ చెబుతున్నా. ఇలాంటి సుశిక్షితులైన, సమర్థులైన యువతను రిక్రూట్ చేసుకునే అవకాశాన్ని మహీంద్రా గ్రూపు స్వాగతిస్తుంది’’ అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    కార్పొరేట్ రంగంలో అగ్నివీర్లకు అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. క్రమశిక్షణ, టీమ్ వర్క్, శారీరక శిక్షణ పొందిన అగ్నివీర్లు కార్పొరేట్ రంగంలోని పలు సెక్టార్లలో ప్రొఫెషనల్స్‌గా రాణిస్తారని అన్నారు.

    సైన్యంలో నియామకాలకు సంబంధించిన ఈ కొత్త పథకానికి వ్యతిరేకంగా దేశంలోని చాలా చోట్లా హింసాత్మక నిరసనలు జరిగాయి. యువత ఈ పథకాన్ని వ్యతిరేకిస్తోంది.

  14. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    గుడ్ మార్నింగ్.

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.