"130 కోట్ల జనాభాకు ప్రధాన సేవకుడిని మాత్రమే" - మోదీ

ఫొటో సోర్స్, ANI
"గత 8 ఏళ్లలో నన్ను నేను ఎన్నడూ ఒక ప్రధాన మంత్రిగా భావించలేదు. పత్రాల పై సంతకాలు చేస్తున్న సమయంలో మాత్రమే నాకు ప్రధాని బాధ్యతలు ఉంటాయి. ఒకసారి నా దగ్గర నుంచి ఫైల్ బయటకు వెళ్ళగానే, నేను ప్రధానిని కాదు. నేను 130 కోట్ల జనాభాకు ప్రధాన సేవకుడిని మాత్రమే. నా సర్వస్వం ఈ జనాభా మాత్రమే. నా జీవితం మీ కోసమే" అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
మోదీ మంగళవారం హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ పాలన పూర్తయిన సందర్భంగా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
"నేడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో స్టార్ట్ అప్స్ గురించి మాట్లాడుతున్నారు. ప్రపంచ బ్యాంకు కూడా భారతదేశంలో సులభంగా వ్యాపారం చేయవచ్చని చెబుతోంది" అని మోదీ అన్నారు.
మోదీ10 కోట్ల మందికి పైగా రైతులకు రూ.21,000 కోట్లను బదిలీ చేశారు.
మోదీతో పాటు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఉన్నారు.




