అంబేడ్కర్ పుట్టిన గడ్డపై ఒక యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టినప్పుడు ఎందుకంత హింస చెలరేగింది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలాపురం నగరంలో వారం క్రితం హింస, దహనాలు జరిగాయి. మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టడంతోపాటూ అయిదు బస్సులను కూడా తగలబెట్టారు. వాహనాలు ధ్వంసం చేశారు. రాళ్లు రువ్వారు. హింసాత్మకంగా మారిన నిరసనలను అదుపు చేయడానికి పోలీసులు బలప్రయోగం చేయాల్సి వచ్చింది. అమలాపురం అంతటా 144 సెక్షన్ అమలు చేయాల్సి వచ్చింది.
ఈ హింస, మహారాష్ట్రలో 44 ఏళ్ల క్రితం ఒక యూనివర్సిటీ పేరు మార్చిన సందర్భంగా జరిగిన ఘర్షణలను గుర్తు చేస్తోంది.
ఆ సమయంలో మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. అప్పుడు కూడా డాక్టర్ భీంరావ్ అంబేడ్కర్ పేరు గురించే వివాదం తలెత్తింది. కారణం అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం ఒక యూనివర్సిటీకి అంబేడ్కర్ పేరు పెట్టాలనుకుంది.
మరాఠ్వాడా యూనివర్సిటీకి డాక్టర్ భీంరావ్ అంబేడ్కర్ పేరు పెట్టాలనే నిర్ణయం తర్వాత జరిగిన ఈ అల్లర్లు ఇప్పటికీ మహారాష్ట్ర సామాజిక చరిత్రకు ఒక గాయంగా మిగిలిపోయాయి.
పూర్తి కథనం కోసం ఈ లింకును క్లిక్ చేయండి.