ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయికి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం

ఆహార పదార్థాలు, చమురు ధరల పెరుగుదల కారణంగా ద్రవ్యోల్బణంలో ఈ పెరుగుదల కనిపించింది. ఈ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం నమోదు కావడం మే 2014 తర్వాత ఇదే తొలిసారి. అప్పుడు రిటైల్ ద్రవ్యోల్బణం 8.33 శాతంగా నమోదైంది.

లైవ్ కవరేజీ

  1. బసవరాజ్ బొమ్మై: ‘మత మార్పిళ్లను నిషేధించే ఆర్డినెన్స్‌ మీద కేబినెట్‌లో నిర్ణయం’

    కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై

    ఫొటో సోర్స్, Facebook/Basavaraj Bommai

    మత మార్పిళ్ల నిషేధం మీద ఆర్డినెన్స్ తీసుకురానున్నట్లు కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. ఈమేరకు నేడు కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.

    మత మార్పిళ్ల నిషేధం ఆర్డినెన్స్‌ను కేబినెట్ ఆమోదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు.

    గతంలో మత మార్పిళ్ల నిషేధం బిల్లును కర్నాటక తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పెళ్లి, ఉద్యోగాలు వంటివి ఆశ చూపి ఒక మతం నుంచి మరొక మతంలోకి మార్చడాన్ని ఈ బిల్లు నిషేధిస్తోంది.

    దీనిపై కొంతకాలంగా వివాదం నడుస్తోంది.

    అయితే ఈ విషయం మీద ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఏముందని కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ప్రశ్నించారు. అభివృద్ధి పనులు, యువతకు ఉపాధి దొరికే కార్యక్రమాలకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకురావాలని అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  2. దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు... కిమ్ జోంగ్-ఉన్‌‌ను ఢీకొట్టగలరా?

    దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు యూన్ సుక్-యోల్ రాకతో ఇప్పుడు ప్రపంచం దృష్టి మొత్తం ఉభయ కొరియా దేశాల సంబంధాలపై పడింది.

    ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్-ఉన్ ఖండాంతర క్షిపణులను అత్యవసరంగా పరీక్షిస్తున్న సమయంలోనే.. ఆ దేశం పట్ల కఠినంగా వ్యవహరించే యూన్ సుక్-యోల్ అధ్యక్షుడయ్యారు. ఇక ఏం జరుగుతుంది?

    పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
    Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

    పోస్ట్ of YouTube ముగిసింది

  3. నాటో కూటమిలో చేరడంపై నిర్ణయం తీసుకోనున్న ఫిన్లాండ్

    ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్

    నాటో కూటమిలో చేరడంపై ఫిన్లాండ్ తన ప్రణాళికలను వెల్లడించనుంది. ఈమేరకు ఫిన్లాండ్ ప్రెసిడెంట్, ప్రధాని ప్రకటన చేయనున్నారు.

    నాటోలో చేరేందుకు చాలా వరకు వీరు ‘యెస్’ అంటారనే భావిస్తున్నారు.

    ఫిన్లాండ్ 1994 నుంచి నాటో భాగస్వామ్య దేశంగా ఉంది. అనేక నాటో మిషన్లలో అది పాలుపంచుకుంది.

    యుక్రెయిన్ మీద రష్యా దాడి చేస్తున్న తరుణంలో నాటోలో ఫిన్లాండ్ చేరాలనే డిమాండ్లు ఆ దేశ ప్రజల్లో పెరుగుతున్నాయి.

  4. చెన్నై సూపర్ కింగ్స్, రవీంద్ర జడేజాల మధ్య విభేదాలు?

    క్రికెటర్ రవీంద్ర జడేజా

    ఫొటో సోర్స్, Facebook/CSK

    చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) , ఆ జట్టు ఆటగాడు రవీంద్ర జడేజాల మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. ఆల్ రౌండరైన రవీంద్ర జడేజా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను అన్‌ఫాలో చేసింది సీఎస్‌కే.

    సుమారు 10 సంవత్సరాలుగా చెన్నై సూపర్ కింగ్స్‌కు రవీంద్ర జడేజా ఆడుతున్నాడు.

    గాయం కారణంగా ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి జడేజా తప్పుకున్నట్లు సీఎస్‌కే తాజాగా తెలిపింది.

    అకస్మాత్తుగా ఐపీఎల్ నుంచి జడేజా తప్పుకోవడం, ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను సీఎస్‌కే అన్‌ఫాలో చేయడం అనుమానాలకు తావిస్తోంది.

    సీఎస్‌కేతో విభేదాల కారణంగానే రవీంద్ర జడేజా ఐపీఎల్ నుంచి వైదొలిగాడంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

    మహేంద్ర సింగ్ ధోనీ నుంచి సీఎస్‌కే కెప్టెన్‌గా పగ్గాలు అందుకున్న జడేజా, జట్టును ముందుకు నడపలేక పోయాడు.

    జడేజా కెప్టెన్సీలో చెన్నై ఆడిన 8 మ్యాచుల్లో 6 ఓడిపోయింది. ప్లేయర్‌గా కూడా అతను ప్రభావం చూపలేక పోయాడు. ఆ తరువాత మళ్లీ కెప్టెన్సీ పగ్గాలు ధోనికి అప్పగించారు.

    ఈ ఐపీఎల్ సీజన్‌లో మొత్తం 10 మ్యాచ్‌లు ఆడిన జడేజా 116 పరుగులు మాత్రమే చేశాడు.

  5. సర్కారువారి పాట సినిమా రివ్యూ: శ్రుతి, లయ, తాళం తప్పిన పాట

  6. స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు... 1,000 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

    బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ భవనం

    ఫొటో సోర్స్, Getty Images

    స్టాక్ మార్కెట్ల నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. నేడు కూడా సూచీలు నేల చూపులు చూస్తున్నాయి. ప్రారంభంలో సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా నష్టపోయింది. దీంతో సుమారు రూ.5 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది.

    ఏప్రిల్ 11 నుంచి ఇప్పటి వరకు చూస్తే స్టాక్ మార్కెట్లు రూ.34 లక్షల కోట్లు నష్టపోయాయి.

    నిఫ్టీ 16,000 దిగువకు చేరుకుంది. ప్రస్తుతం సుమారు 286 పాయింట్ల నష్టంతో 15,882 వద్ద ట్రేడవుతోంది. ఇక సెన్సెక్స్ 911 పాయింట్లు నష్టపోయి 53,175 వద్ద కదులుతోంది.

    ఐటీ, ఫార్మా, బ్యాంక్, ఇన్‌ఫ్రా, ఎఫ్‌ఎంసీజీ, ఆటో వంటి రంగాల్లో భారీగా అమ్మకాలు కనిపిస్తున్నాయి.

    అమెరికాలో నిన్న విడుదల చేసిన ద్రవ్యోల్బణం గణాంకాలు భారత స్టాక్ మార్కెట్ల మీద తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఏప్రిల్‌లో అమెరికా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారిత ద్రవ్యోల్బణం 8.5 శాతం నుంచి 8.3శాతానికి తగ్గింది. కానీ ఇది కూడా ఇంకా ఎక్కువేనని నిపుణులు భావిస్తున్నారు.

    అమెరికాలో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే అక్కడి ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లు పెంచేందుకు మళ్లీ ప్రయత్నిస్తుంది. ఇది భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు మంచిది కాదు.

    అందువల్లే హాంగ్ సెంగ్, నిక్కీ, కోస్పి వంటి ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఈ ప్రభావం భారత స్టాక్ మార్కెట్ల మీద కూడా పడింది.

  7. ఉత్తర కొరియాలో లాక్ డౌన్

    ఉత్తర కొరియాలోని ఒక సూపర్ మార్కెట్‌లో డిజ్‌ఇన్ఫెక్టంట్ స్ప్రే చేస్తున్న ఉద్యోగి

    ఫొటో సోర్స్, AFP

    కరోనా కేసులు పెరుగుతుండటంతో దేశం మొత్తాన్ని లాక్ డౌన్ చేస్తున్నట్లు ఉత్తర కొరియా ప్రకటించింది.

    రాజధాని ప్యోంగ్యాంగ్‌లో ఒమిక్రాన్ వేరియంట్ వల్ల కేసులు మళ్లీ పెరుగుతున్నట్లు ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తక్షణమే తీసుకోవాల్సిన చర్యలపై కిమ్ జోంగ్ ఉన్ అత్యవసర చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది.

    ఉత్తర కొరియా తన ప్రజలకు కోవిడ్-19 వ్యాక్సిన్లను వేయలేదు.

  8. మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు కోరుతూ హై కోర్టులో ఏపీ పిటీషన్

    ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ

    ఫొటో సోర్స్, Facebook/Dr. Ponguru Narayana

    మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు కోరుతూ ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటీషన్ వేసింది.

    10వ తరగతి పరీక్షా పత్రాల లీకేజీ కేసులో ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

    చిత్తూరు కోర్టులో ప్రవేశపెట్టగా నారాయణకు బెయిల్ మంజూరు చేసింది.

    అలాగే అమరావతి భూముల సమీకరణలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఏపీ సీఐడీ ఇటీవలే కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు ఏ1గా ఉండగా నారాయణ ఏ2గా ఉన్నారు.

  9. సామాజిక విశ్లేషకుడు సి.నరసింహారావు మృతి

    గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అవార్డు స్వీకరిస్తున్న సి.నరసింహారావు

    ఫొటో సోర్స్, Facebook/Narasimharao Challagulla

    ఫొటో క్యాప్షన్, గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అవార్డు స్వీకరిస్తున్న సి.నరసింహారావు

    సీనియర్ జర్నలిస్టు, సాహితీవేత్త సి.నరసింహారావు హైదరాబాద్‌లో చనిపోయారు. 73 ఏళ్ల ఆయన కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన సామాజిక విశ్లేషకుడు కూడా.

    వ్యక్తిత్వ వికాసం మీద ఆయన పుస్తకాలు కూడా రాశారు.

    ‘రేపు’ అనే మాసపత్రికను కూడా నడిపారు.

  10. మహేశ్ బాబు: ‘నాకు టాలీవుడ్‌లో చాలా కంఫర్ట్ ఉంది’

    సినీనటుడు మహేశ్ బాబు

    ఫొటో సోర్స్, Facebook/Mahesh Babu

    హిందీ సినిమా నన్ను ‘అఫర్డ్’ చేయలేదంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సినీనటుడు మహేశ్ బాబు వివరణ ఇచ్చారు.

    అన్ని భాషల మీద తనకు గౌరవం ఉందని, అయితే టాలీవుడ్‌లో తాను చాలా కంఫర్ట్‌ ఉందని ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు సినిమాకు అన్ని చోట్ల ఆదరణ లభించడం సంతోషంగా ఉందని వెల్లడించారు.

    రాజమౌళితో చేస్తున్న తన తరువాత సినిమా పాన్ ఇండియా అవుతుందని మహేశ్ బాబు అన్నారు.

    ఇటీవల ‘మేజర్’ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో మహేశ్ బాబు మాట్లాడుతూ హిందీ సినిమా తనను ‘అఫర్డ్’ చేయలేదని అనడం వివాదాస్పదమైంది.

  11. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    హలో ఆల్, గుడ్ మార్నింగ్! బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.