You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

రాహుల్ గాంధీ: ‘టీఆర్ఎస్‌కు రెండుసార్లు అవకాశం ఇచ్చారు.. కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి’

తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం తమ కన్నీళ్లు, రక్తం చిందించారని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై 8 ఏళ్లు గడుస్తున్నాయని, తెలంగాణ కల ఏమైందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

లైవ్ కవరేజీ

  1. రాహుల్ గాంధీ: ‘దేశంలో కరోనా మృతులు 4.8 లక్షలు కాదు 47 లక్షలు’

    భారత్‌లో కరోనా మృతుల సంఖ్య 47 లక్షలు కానీ కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లు 4.8 లక్షలు కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.

    సైన్స్ ఎప్పుడూ అబద్ధం చెప్పదని నరేంద్ర మోదీ మాత్రమే చెబుతారని ఆయన విమర్శించారు.

    కరోనావైరస్‌తో చనిపోయిన వారి కుటుంబాలకు నివాళిలు అర్పించిన రాహుల్ గాంధీ, బాధిత కుటుంబాలకు రూ.4 లక్షలు పరిహారం అందేలా పోరాడతానని అన్నారు.

  2. ఎల్‌ఐసీ ఐపీఓకు మంచి స్పందన

    ఎల్‌ఐసీ ఐపీఓకు మంచి స్పందన వచ్చింది. మూడు రోజుల్లోనే అది ఫుల్‌గా సబ్‌స్క్రైబ్ అయింది. మొత్తం మీద ఇప్పటి వరకు 1.12 రెట్లు ఎక్కువ స్పందన కనిపించింది.

    పాలసీదారుల కోటా 3.41 రెట్లు, ఎంప్లాయి కోటా 2.53 రెట్లు అదనంగా సబ్‌స్క్రైబ్ అయ్యాయి.

    ఎల్‌ఐసీ ఐపీఓ ప్రైస్ బ్యాండ్‌ను రూ.902-949గా నిర్ణయించారు. ఈ నెల 12న షేర్లను కేటాయించనుండగా 17న ఎక్స్ఛేంజీలలో లిస్ట్ కానున్నాయి.

  3. పశ్చిమ బెంగాల్: ‘బీజేపీ కార్యకర్త హత్య’

    పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా యువ మోర్చ వైస్ ప్రెసిడెంట్ అర్జున్ చౌరాసియ(27)ను హత్య చేసినట్లు బీజేపీ పార్టీ వెల్లడించింది.

    కోల్‌కతాకు చెందిన అర్జున్‌ను క్రూరంగా నరికి, వేలాడతీసినట్లు బీజేపీ పశ్చిమ బెంగాల్ విభాగం తెలిపింది.

    తమ కార్యకర్త హత్య జరిగిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వాగత సన్నాహా వేడుకలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

  4. గుజరాత్: ‘గుడిలో మైక్ పెట్టినందుకు కొట్టి చంపారు’

    గుజరాత్‌లోని ముదార్దా గ్రామానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తిని గుడిలో మైకు పెట్టినందుకు కొట్టి చంపారనే వార్తలు వచ్చాయి.

    ఈ కేసుకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

  5. హీట్‌వేవ్: మండే ఎండలకు తల్లడిల్లిపోతున్న పేదలు

  6. ఆశ్రీన్ సుల్తానా: ‘నా భర్త మీద దాడి చేస్తోంది మా అన్న అనుకోలేదు’

    తనను పెళ్లి చేసుకునేందుకు ముస్లింగా మారతానని నాగరాజు తన అన్నకు చెప్పినట్లు ఆశ్రీన్ సుల్తానా తెలిపారు. అయినప్పటికీ తన అన్న పెళ్లికి అంగీకరించలేదని వెల్లడించారు.

    ‘ఆ తరువాత కూడా మా పెళ్లిని మా అన్న అంగీకరించలేదు. నా భర్త మీద దాడి చేస్తున్న వ్యక్తి ఎవరో ముందు నాకు తెలియదు. అక్కడ ఉన్న వాళ్లు ఎవరూ మాకు సాయంగా రాలేదు.’ అని ఆశ్రీన్ వివరించారు.

  7. 30 రోజుల్లో సుమారు 5 వేల పాయింట్లు కోల్పోయిన సెన్సెక్

    భారత స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్ సుమారు 1000 పాయింట్లు, నిఫ్టీ 318 పాయింట్లు నష్టపోయాయి.

    నిఫ్టీ బ్యాంక్ 2.33శాతం, ఐటీ 3.19శాతం, ఫార్మా 1.72శాతం, ఆటో 1.35శాతం చొప్పున నష్టపోయాయి.

    గురువారం నాస్‌డాక్ దాదాపు 5శాతం పడిపోవడం, ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతుండటం భారత మార్కెట్ల మీద ప్రభావం చూపింది.

    గత నెల రోజులుగా చూస్తే సెన్సెక్, నిఫ్టీ దాదాపు 8శాతం నష్టపోయాయి. ఏప్రిల్ 6న 59,610 వద్ద ఉన్న సెన్సెక్స్ నేడు 54,656 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 17,807 వద్ద ఉన్న నిఫ్టీ నేడు 16,364కి అటుఇటుగా ఉంది.

  8. 24 గంటల్లో 3,545 కొత్త కరోనా కేసులు

    గత 24 గంటల్లో భారత్‌లో 3,545 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 19,688 యాక్టివ్ కేసులున్నాయి. 27 మంది చనిపోయారు.

  9. భక్తుల కోసం తెరచుకున్న కేదార్‌నాథ్ టెంపుల్

    భక్తుల కోసం కేదార్‌నాథ్ దేవాలయాన్ని తెరచారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ పూజలు చేశారు.

    దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్‌ను దర్శించుకునేందుకు ఏటా చాలా మంది భక్తులు వస్తుంటారు.

    వేసవి కాలంలో భక్తుల కోసం తెరిచే ఈ దేవాలయాన్ని శీతకాలంలో మంచు కారణంగా 6 నెలలపాటు మూసేస్తారు.

    మందాకినీ నది ఒడ్డున ఉండే ఈ గుడిని 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుడు నిర్మించారు.

  10. ఈ రైల్వేస్టేషన్‌కి ఎవరొచ్చినా సెల్ఫీ తీసుకోకుండా ఎవరూ వెళ్లరు

    ఈ రైల్వే స్టేషన్లో ఆగిన రైలు ఇంజిన్ ఒక రాష్ట్రంలో ఉంటే, బోగీలు మరో రాష్ట్రంలో ఉంటాయి. టికెట్ కౌంటర్ ఒక రాష్ట్రంలో ఉంటే, ప్లాట్ ఫాం మరో రాష్ట్రంలో ఉంటుంది.

  11. భారత్-పాకిస్తాన్ సరిహద్దులో బయటపడిన సొరంగం, అమర్‌నాథ్ యాత్రకు భంగం కలిగించే కుట్రను భగ్నం చేశామన్న బీఎస్ఎఫ్

    భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఈ నెల నాలుగో తేదీన సాయంత్రం ఒక సొరంగాన్ని గుర్తించినట్లు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ - బీఎస్ఎఫ్ వెల్లడించింది.

    జమ్మూలోని సాంబా సెక్టార్‌లో పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ఈ సొరంగం బయటపడిందని తెలిపింది.

    “ఇది 150 మీటర్ల పొడవు ఉంది. సొరంగం చివరన రెండు అడుగుల వెడల్పు ఉంది. సొరంగం కోసం వాడిన ఇసుక బస్తాలను స్వాధీనం చేసుకున్నాం. టన్నెల్ లోపల ఆక్సిజన్ కోసం ఒక పైప్ కూడా ఏర్పాటు చేసుకున్నారు” అని బీఎస్ఎఫ్ పేర్కొంది.

    “అమర్‌నాథ్‌ యాత్రకు భంగం కలిగించేందుకు పాకిస్తాన్‌ భూభాగం నుంచి పనిచేసే టెర్రరిస్టులు పన్నిన కుట్రను భగ్నం చేసినట్లు” బీఎస్ఎఫ్ ట్వీట్ చేసింది.

    2012 నుంచి ఇప్పటి వరకు సాంబా సరిహద్దు వెంబడి 11 సొరంగాలను గుర్తించినట్లు బీఎస్ఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ డీకే బూరా చెప్పారు.

    ఈ సొరంగం సరిహద్దుకు కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. 150 మీటర్ల ఈ సొరంగాన్ని ఇటీవలే తవ్వినట్లు ఉందని ఆయన వెల్లడించారు.

  12. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    గుడ్ మార్నింగ్! బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

  13. రాహుల్ గాంధీ: ‘టీఆర్ఎస్‌కు రెండుసార్లు అవకాశం ఇచ్చారు.. కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి’