నేటి ముఖ్యాంశాలు
హైదరాబాద్లోని సరూర్ నగర్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలో అబ్బాయిని హత్య చేశారు. బుధవారం రాత్రి సరూర్ నగర్లో బైకు మీద వెళ్తున్న సమయంలో అమ్మాయి బంధువులు అబ్బాయి మీద దాడి చంపేశారని పోలీసులు వెల్లడించారు.ఇది కులహంకార హత్యలా అనిపిస్తోందని పోలీసులు అన్నారు.
యూరప్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్తో భేటీ అయ్యారు. భారత్, ఫ్రాన్స్ మధ్య దౌత్య, వాణిజ్య సంబంధాల మీద ఇద్దరు నేతలు చర్చించారు.
యుక్రెయిన్లోని మరియుపోల్లో మూడు రోజుల పాటు కాల్పుల విరమణ పాటించనున్నట్లు రష్యా ప్రకటించింది. యుక్రెయిన్ సైనికులు, పౌరులు ఈ స్టీల్ ప్లాంట్లో చిక్కుకుని పోయారు.
భారత్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,275 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా కారణంగా 55 మంది మరణించారు.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురువారం తిరుపతిలో జరిగిన ఒక కార్యక్రమంలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన సొమ్ము జమ చేశారు. 10.85 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లుల ఖాతాల్లో రూ. 709 కోట్లను జమ చేశారు.
కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) అంచనా వేసింది. అయితే, చాలా దేశాలు కోవిడ్ మరణాల సంఖ్యను తక్కువగా చూపించాయని ఈ సంస్థ భావిస్తోంది.
రాజ్యసభలో తెలంగాణ నుంచి ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ విడుదల చేసింది. మే 12న ఈ ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
ఇంతటితో బీబీసీ లైవ్ పేజీని ముగిస్తున్నాం.