You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

గుంటూరు జిల్లా తుమ్మపూడిలో ఉద్రిక్తత, నారా లోకేష్‌ వెళ్లినప్పుడు ఏం జరిగిందంటే..

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో ఉద్రిక్తత ఏర్పడింది. హత్యకు గురైన బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ని అధికార వైసీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి.

లైవ్ కవరేజీ

వరికూటి రామకృష్ణ

  1. రాజ్ ఠాకరే: ‘దురదృష్టవశాత్తు మహారాష్ట్రలో యోగీలు లేరు’

    తమ దురదృష్టం కొద్దీ మహారాష్ట్రలో యోగి ఆదిత్యనాథ్ వంటి వారు లేరని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాకరే అన్నారు.

    ‘ప్రార్థనా మందిరాలు, ముఖ్యంగా మసీదుల నుంచి మైకులు తొలగించినందుకు యోగి ప్రభుత్వానికి అభినందనలు.’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

    మసీదుల్లో మైకులను తొలగించాలంటూ కొద్ది రోజులుగా రాజ్ ఠాకరే డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. మైకులు తొలగించని మసీదుల ముందు హనుమాన్ చాలీసా ప్లే చేయాలంటూ ఆయన పిలుపునిచ్చారు.

  2. వైఎస్ జగన్: ‘మహిళల చేతుల్లో రూ.10 వేల కోట్ల ఆస్తి ఉంది’, లక్కోజు శ్రీనివాస్, బీబీసీ కోసం

    ఒక రాజధానిని విశాఖకు ఇస్తూంటే అడ్డుకున్నారని సీఎం జగన్ ఆరోపించారు. విశాఖ, అనకపల్లి జిల్లాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో నేడు ఆయన మాట్లాడారు.

    పాదయాత్రలో పాతిక లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చామని ఇప్పుడు ముపై లక్షల ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు.

    30 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.55 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని ప్రకటించారు. ఇంటి స్థలాల విలువ రూ.35 వేల కోట్లు ఉంటుందని, మౌలిక సౌకర్యాల కల్పనకు మరో రూ.32 వేల కోట్లు ఖర్చవుతుందని చెప్పారు.

    ఇవాళ ఇళ్ల పట్టాలు అందుకున్న మహిళల చేతుల్లో రూ.10 వేల కోట్ల ఆస్తి ఉందని తెలిపారు. పేదలకు మంచి చేస్తూంటే... కోర్టులకు వెళ్లిఅడ్డంకులు సృష్టించారని విపక్ష నేతలపై జగన్ విమర్శలు గుప్పించారు.

    రెండో దశ ఇళ్ల నిర్మాణం ప్రారంభించమని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని, ఇల్లు రాని వారు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని సీఎం జగన్‌ సూచించారు.

    ‘అనకాపల్లి జిల్లాలో ఒక్క కాలనీలోనే 10,228 ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఒక్కొక్కరికి సెంట్‌ స్థలం ఇస్తున్నాం. ఇక్కడ గజం స్థలం రూ.12 వేలు ఉంది. అంటే స్థలం విలువ అక్షరాల రూ.6 లక్షలు.’ అని జగన్ అన్నారు.

  3. ప్రాణాలు తీసే, విధ్వంసం సృష్టించే వడగళ్లు ఎలా ఏర్పడతాయో తెలుసా?

  4. అజయ్ దేవగణ్-సుదీప్: ‘హిందీ ఎప్పటికీ మన జాతీయ భాష కాలేదు’

    హిందీ భాషపై అజయ్ దేవ్‌గణ్, సుదీప్ మధ్య జరిగిన ట్విటర్ వార్ మీద స్పందించిన కర్నాటక ముఖ్యమంత్రి బసవ రాజు బొమ్మై, సుదీప్‌ను సమర్థించారు. అందరూ ఆయన భావాలను అర్థం చేసుకోవాలని గౌరవించాలని పిలుపునిచ్చారు.

    ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆయన, భాషా ప్రాతిపదికనే కర్నాటక రాష్ట్రం ఏర్పడిన విషయాన్ని గుర్తు చేశారు.

    ఇక ఇదే విషయం మీద స్పందించిన కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామీ, అజయ్ దేవగణ్ తన అవివేకాన్ని బయటపెట్టుకున్నారని విమర్శించారు.

    హిందీ జాతీయ భాష కాదు అని సుదీప్ అనడంలో తప్పు ఏముంది? అది నిజమే కదా? అని ప్రశ్నించిన కుమారస్వామీ, బీజేపీ హిందీ నేషనలిజానికి ప్రచారకర్తగా అజయ్ దేవ్‌గణ్ మారారు అంటూ ఆరోపించారు.

    ఎక్కువ మంది మాట్లాడుతున్నంత మాత్రానా హిందీ జాతీయ భాష అవుతుందా? అని కుమార స్వామీ ప్రశ్నించారు.

    కాంగ్రెస్ నేత, కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఈ విషయంపై స్పందించారు. ‘హిందీ ఎప్పటికీ మన జాతీయ భాష కాలేదు.’ అని అన్నారు.

  5. ఉమ్రాన్ మాలిక్: 150 KMPH కంటే ఎక్కువ స్పీడుతో వికెట్లు ఎగరగొట్టిన ‘కొత్త స్టార్’

  6. 9 మంది భార్యలు... సెక్స్‌లో పాల్గొనేందుకు టైం టేబుల్

    తొమ్మిది మంది భార్యలు ఉన్న బ్రెజిల్‌కు చెందిన మోడల్ ఆర్థర్ ఓ ఊర్సో, వారితొ సెక్స్‌లో పాల్గొనేందుకు ఒక టైం టేబుల్ తయారు చేసుకున్నారని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది.

    అందరి భార్యలకు అవకాశం రావాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని, కానీ అది టైం టేబుల్ ఫాలో కావడం కుదరక దాన్ని తీసేసినట్లు వెల్లడించింది.

    న్యూయార్క్ పోస్ట్ తెలిపిన ప్రకారం ‘ప్రతి భార్యతోను గడపాలనే ఉద్దేశంతో ఆర్థర్ టైం టేబుల్ తయారు చేసుకున్నారు. కానీ దాన్ని ఫాలో కావడం ఆయనకు కష్టంగా మారింది. టైం టేబుల్ వల్ల ఆయనకు కోరిక లేనప్పటికీ సెక్స్‌లో పాల్గొనాల్సి వచ్చేదని, అందువల్ల చివరకు ఆ సిస్టమ్‌ను తీసేశారు.’

    జీవితాంతం ఒక భాగస్వామితోనే ఉండాలనే పద్ధతికి తాను విరుద్ధమని ఆర్థర్ చెబుతున్నారు. ప్రేమను స్వేచ్ఛగా అందరితోను పంచుకోవాలన్నది తన సిద్ధాంతమని ఆయన అంటున్నారు.

  7. విదేశాంగ మంత్రి జైశంకర్ అంటే ప్రధాని మోదీకి ఎందుకంత ఇష్టం?

  8. స్టాలిన్: ‘పెట్రోలు, డీజిల్ ధరల విషయంలో కేంద్రం నాటకాలు ఆడుతోంది’

    పెట్రోలు, డీజిల్ ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు.

    ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ వంటి అయిదు రాష్ట్రాల ఎన్నికల ముందు పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం, ఎన్నికలు అయిపోగానే మళ్లీ రేట్లు పెంచిందని ఆయన విమర్శించారు.

    పెట్రోలు, డీజిల్ ధరలు ఎవరు తగ్గించారో ఎవరు పెంచారో తమిళనాడు ప్రజలకు బాగా తెలుసని అసెంబ్లీ మాట్లాడుతూ స్టాలిన్ అన్నారు.

  9. రాహుల్ గాంధీ: ‘పెట్రోలు మీద విధించే పన్నుల్లో 62శాతం కేంద్రమే తీసుకుంటోంది’

    పెట్రోలు, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాలను కోరడాన్ని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ విమర్శించారు.

    పెట్రోలు ధరలు అధికంగా ఉన్నా బొగ్గుకు కొరత ఏర్పడినా డిమాండ్‌కు తగినట్లుగా ఆక్సిజన్ అందకపోయినా రాష్ట్రాలను బాధ్యులను చేస్తున్నారని ఆరోపించారు.

    పెట్రోలు, డీజిల్ మీద విధించే పన్నుల్లో 62శాతం కేంద్రమే తీసుకుంటోందని అయినా వ్యాట్ తగ్గించాలంటూ ప్రధాని రాష్ట్రాలను కోరుతున్నారని రాహుల్ గాంధీ అన్నారు.

  10. రూ.500 పెట్టి టికెట్ కొంటే, రూ.2.5 కోట్ల లాటరీ తగిలింది..

  11. కశ్మీర్: ‘ఈ ఏడాది 62 మంది ఉగ్రవాదులు హతం’

    ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 62 మంది ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్లలో మరణించినట్లు కశ్మీర్ ఐజీ తెలిపారు. వారిలో లష్కర్-ఎ-తయిబాకు చెందిన 39 మంది ఉన్నట్లు వెల్లడించారు. మొత్తం మీద 47 మంది స్థానికులుగా కాగా 15 మంది విదేశీలయులని ప్రకటించారు.

  12. అజయ్ దేవ్‌గణ్-కిచ్చా సుదీప్: హిందీ జాతీయ భాషా? భారతదేశంలో అధికార భాషలు ఏవి?

  13. మమతా బెనర్జీ: ‘బీఎస్‌ఎఫ్ జవాన్లను అంతకు మించి రానివ్వకండి’

    బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్) జవాన్లు గ్రామల్లోకి వచ్చి ప్రజలను కొడుతున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. అలాగే ప్రజలను చంపడంతోపాటు వారిని దేశం సరిహద్దుల అవతలకు విసిరేస్తున్నారని అన్నారు.

    అంతర్జాతీయ సరిహద్దు నుంచి 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం బీఎస్‌ఎఫ్ జవాన్లను రానివ్వకండి అంటూ కూచ్ బెహార్ పోలీసులను మమతా బెనర్జీ ఆదేశించారు.

    గ్రామాల్లో ఏవైనా సెర్చ్ ఆపరేషన్స్ చేపట్టాలంటే స్థానిక పోలీసులను కూడా వెంట తీసుకెళ్లాలని బీఎస్‌ఎఫ్‌ను ఆమె కోరారు.

    దేశ సరిహద్దుల్లో కాపాలా కాసే బీఎస్‌ఎఫ్‌కు ఒకప్పుడు అంతర్జాతీయ సరిహద్దు నుంచి 15 కిలోమీటర్ల వరకు మాత్రమే శోధాలు, అరెస్టులు చేసేందుకు అనుమతి ఉండేది. కానీ పోయిన ఏడాది బీఎస్‌ఎఫ్ యాక్ట్‌ను సవరించడం ద్వారా ఆ పరిధిని పంజాబ్, వెస్ట్ బెంగాల్, అస్సాంలలో 50 కిలోమీటర్లకు పెంచారు.

    కానీ ఇలా పరిధి పెంచడాన్ని పంజాబ్, వెస్ట్ బెంగాల్ వ్యతిరేకిస్తున్నాయి. వెంటనే కొత్త సవరణలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

  14. కరోనా: గత 24 గంటల్లో 3 వేలకు పైగా నమోదైన కొత్త కేసులు

    గత 24 గంటల్లో 3,303 కొత్త కరోనా కేసులు నమోదు కాగా 2,563 మంది కోలుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం 16,980 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వెల్లడించింది.

    ప్రస్తుతం రోజూ వారీ పాజిటివ్ రేటు 0.66శాతంగా ఉంది.

  15. ప‌దేళ్ల బాలుడి వైరల్‌ వీడియోతో అమాంతం పెరిగిన తండ్రి హలీం వ్యాపారం

    కొన్ని మాటలు మనసును తాకుతాయి. పదేళ్ల అద్నాన్ మాటలు కూడా సోషల్ మీడియా ద్వారా ఎందరో మనసులను తాకాయి. ఆ మాటలు రాత్రికి రాత్రే హైదరాబాద్ బోరబండలోని ‘పప్పా కీ హలీం’ దుకాణాన్ని ఫేమస్ చేసేశాయి.

  16. రిలయన్స్‌కు చెందిన వయ్‌కామ్18‌లో రూ.13,500 కోట్ల పెట్టుబడులు

    ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ వయ్‌కామ్‌18లో జేమ్స్ మర్దోక్‌కు చెందిన బోధి ట్రీ సిస్టమ్స్ రూ.13,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. తద్వారా భారత్‌లోనే అతి పెద్ద టీవీ, డిజిటల్ స్ట్రీమింగ్ కంపెనీగా వయ్‌కామ్18 మారనున్నట్లు సీఎన్‌బీసీటీవీ18 తెలిపింది.

    రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ మరో రూ,1,645 కోట్లను వయ్‌కామ్‌18లో పెట్టుబడి పెట్టనుంది.

    ఈ డీల్ తరువాత రిలయన్స్ జియోకు చెందిన ‘జియో సినిమా’ యాప్ వయ్‌కామ్‌18 అధీనంలోకి వెళ్తుంది.

    రిలయన్స్ ఇండస్ట్రీస్, పారామౌంట్ గ్లోబల్(వయ్‌కామ్‌సీబీఎస్‌)ల జాయింట్ వెంచరే వయ్‌కామ్‌18. కల్సర్ టీవీ చానెల్స్, ఊట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఈ కంపెనీవే.

    ప్రముఖ మీడియా వ్యాపరి రూపర్ట్ మర్డోక్ కుమారు జేమ్స్ మర్డోక్‌, స్టార్ ఇండియా మాజీ చైర్మన్ ఉదయ్ శంకర్ కలిసి బోధి ట్రీ సిస్టమ్స్‌ను ప్రారంభించారు.

    ఈ డీల్ ప్రధాన ఉద్దేశం ఐపీఎల్ స్ట్రీమింగ్ హక్కులు సొతం చేసుకోవడమనే వార్తలు వస్తున్నాయి.

  17. యుక్రెయిన్ యుద్ధ: జోక్యం చేసుకున్న దేశాలకు మెరుపు వేగంతో బదులిస్తామన్న పుతిన్

    యుక్రెయిన్ యుద్ధంలో ఏ దేశమైనా జోక్యం చేసుకుంటే మాములుగా ఉండదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. మెరుపు వేగంతో వారికి బదులిస్తామని అన్నారు.

    ‘మా దగ్గర అన్ని రకాల టూల్స్ ఉన్నాయి. ఎవరూ మమ్మల్ని దెబ్బకొట్టలేరు. అవసరమైతే ఆ టూల్స్‌ను వాటిని వాడతాం.’ అని పుతిన్ చెప్పుకొచ్చారు.

    బాలిస్టిక్ మిసైల్స్, అణ్వాయుధాలను దృష్టిలో ఉంచుకునే పుతిన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా కనిపిస్తోంది.

    ఇటీవల మిత్రదేశాలు యుక్రెయిన్‌కు ఆయుధాలను సరఫరా చేయడాన్ని మరింత పెంచాయి. రష్యాను యుక్రెయిన్ ఓడించేందుకు అన్ని రకాలుగా సహకరించాలని అమెరికా గట్టి పట్టుదలతో ఉంది.

    తూర్పు యుక్రెయిన్‌లోనూ రష్యా బలగాలకు ఎదురుదెబ్బలు తగులుతున్నట్లు పశ్చిమ దేశాల అధికారులు చెబుతున్నారు.

  18. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    హలో ఆల్, గుడ్ మార్నింగ్! బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.