అక్బరుద్దీన్: ద్వేషపూరిత వ్యాఖ్యల కేసును కొట్టేసిన నాంపల్లి కోర్టు
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వాఖ్యల కేసులో నాంపల్లి కోర్టు తీర్పును వెల్లడించింది. అక్బరుద్దీన్పై నమోదు అయిన రెండు కేసులను కొట్టివేస్తూ బుధవారం తీర్పు ఇచ్చింది.
10ఏళ్ల కిత్రం 2012లో నిజామాబాద్, నిర్మల్లో మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ అక్బరుద్దీన్ ఒవైసీ పైకేసు నమోదయింది. ఈ కేసులో 30 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. ఈ కేసు విషయంలో అక్బరుద్దీన్ 40 రోజుల పాటు జైల్లో కూడా ఉన్నారు.
నాంపల్లి కోర్టు కేసులను కొట్టేస్తూ అక్బరుద్దీన్ను నిర్దోషిగా ప్రకటించింది.భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని, అలాంటి వ్యాఖ్యలు దేశ సమగ్రతకు మంచిదికాదని కోర్టు వ్యాఖ్యానించింది.
కేసు కొట్టివేసినంత మాత్రాన సంబురాలు చేసుకోవద్దని కోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో పాతబస్తీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.