మీకు సమాధి కంటే ప్రశాంతమైన స్థలం లేదు - యుక్రెయిన్ అధ్యక్షుడు
కీయెవ్ భూభాగంలో యుద్ధ నేరాలకు పాల్పడిన రష్యా సైనికులను సమాధికి పంపేవరకూ యుక్రెయిన్ సేనలు విశ్రమించబోవని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్క్సీ హెచ్చరించారు.
ఆయన ఆదివారం రాత్రి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ మాస్కో సైన్యానికి హెచ్చరికలు చేశారు.
తమ దేశం పై దాడి చేస్తూ ఉద్దేశపూర్వకంగా చేసే హత్యలకు శిక్ష ఎదుర్కొనే రోజును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
"యుక్రెయిన్ లో ఎన్ని కుటుంబాలు మరణించి ఉంటాయి? మేం క్షమించేది లేదు. మేము మర్చిపోం. మా భూభాగం పై యుద్ధంలో అకృత్యాలకు పాల్పడిన వారందరినీ శిక్షిస్తాం" అని జెలియెన్క్సీ అన్నారు.
"మీకు ఈ భూమిపై సమాధి కంటే ప్రశాంతమైన ప్రదేశం మరొకటి లేదు" అని అన్నారు.
"ఇప్పటి వరకు రష్యా సేనలు పాల్పడిన అకృత్యాలు చాలినట్లు లేవు. ఇప్పటివరకు నాశనం చేసిన జీవితాలు సరిపోవా? జీవితాలను చిన్నాభిన్నం చేశారు. ఇంకా చాలా మందిని చంపాలని అనుకుంటున్నారు".
మాస్కోకు వ్యతిరేకంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని జెలియెన్క్సీ పశ్చిమ దేశాలను కోరారు. రష్యా తీరు చూస్తుంటే ఇప్పటి వరకు ఆ దేశంపై విధించిన ఆంక్షలు వారికి ఇంకా సరిపోయినట్లు లేవని అన్నారు.