‘యుక్రెయిన్ అధ్యక్షుడితో నేరుగా చర్చించండి’: పుతిన్కు మోదీ సూచన
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్స్కీతో నేరుగా చర్చలు జరపాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు విజ్ఞప్తి చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయని రాయిటర్స్ వార్తా సంస్థ చెప్పింది.
‘‘యుక్రెయిన్, రష్యా బృందాల మధ్య చర్చల స్థితిగతులను ప్రధాని మోదీకి అధ్యక్షుడు పుతిన్ క్లుప్తంగా వివరించారు’’ అని తమ వివరాలు వెల్లడించని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. దీనిపై ప్రభుత్వ ప్రకటన వస్తుందని తెలిపాయి.