కరోనావైరస్ కాంటాక్టులను ట్రేస్ చెయ్యడానికి ఆస్ట్రేలియా ఓ
కొత్త మొబైల్ యాప్ను విడుదల చేసింది. విడుదల చేసిన గంటల వ్యవధిలోనే దాదాపు 10
లక్షలమంది ఆస్ట్రేలియన్లు (మొత్తం జనాభా 2.5 కోట్లు) కోవిడ్సేఫ్ అనే ఈ యాప్ను డౌన్లోడ్
చేసుకున్నారు.
మొబైల్లోని బ్లూటూత్ ద్వారా ఈ యాప్ పనిచేస్తుంది. 1.5
మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తుల్లో ఎవరైనా కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణై ఉంటే, 15
నిమిషాలకు మించి సమయం అలా గడిపితే ఈ యాప్ నోటిఫికేషన్ పంపిస్తుంది.
కానీ ఈ యాప్ ద్వారా వినియోగదారుల వ్యక్తిగత, సమాచార భద్రతకు
భంగం కలుగుతుందనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వెలుగుచూశాయి. అయితే, ఈ యాప్ ద్వారా
సేకరించే సమాచారం కేవలం కాంటాక్ట్ ట్రేసింగ్కు మాత్రమే ఉపయోగిస్తామని, ఆ సమాచారం
అంతా సర్వర్లో తాత్కాలికంగానే స్టోర్ అవుతుందని ప్రభుత్వం చెబుతోంది.
జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ వివరాల ప్రకారం ఇప్పటివరకూ
ఆస్ట్రేలియాలో 6,714పాజిటివ్
కేసులు నమోదయ్యాయి. 83 మంది మరణించారు.
గత కొన్ని వారాలుగా కొత్త కేసుల పెరుగుదల నెమ్మదించింది.
ఆదివారం నాడు కేవలం 16 కేసులు నమోదయ్యాయి.