లాక్డౌన్ పొడిగించమని బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరారు: పుదుచ్చేరి సీఎం వెల్లడి, మే 3 తరువాత లాక్డౌన్ పొడిగించమని కోరాను: మేఘాలయ సీఎం
బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులలో చాలామంది లాక్డౌన్ కొనసాగించాలని కోరినట్లు పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి చెప్పినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ వెల్లడించింది.
మరోవైపు మే 3 తరువాత కూడా లాక్డౌన్ కొనసాగించాలని కేంద్రాన్ని కోరినట్లు మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా చెప్పారు.
ప్రధాని మోదీతో ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న ఆయన అనంతరం ట్విటర్లో ఈ విషయం వెల్లడించారు.
కోవిడ్ ప్రభావం లేని జిల్లాలు, గ్రీన్ జోన్లలో కొన్ని కార్యకలాపాలకు మినహాయింపు ఇస్తూ ఈ లాక్డౌన్ కొనసాగించాలని సూచించినట్లు చెప్పారు.