ప్రధానమంత్రి మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా భారత ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు;
- కరోనావైరస్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కరోనా రహిత దేశం కోసం వైద్యులు, వైద్య సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు.
- ఆయుష్ మంత్రిత్వశాఖ సూచిస్తున్న సూచనలు పాటించడం ద్వారా మీరు మీ రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయండి.
- పవిత్ర రంజాన్ మాసం మొదలైంది. గత ఏడాది రంజాన్ పండుగ జరుపుకునేటప్పుడు ఎవరూ ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించి ఉండరు. ఈసారం రంజాన్ పండుగను సహనానికి, మత సామరస్యానికి, సేవా దృక్పథానికి సంకేతంగా జరుపుకుందాం.
- కరోనాపై పోరాటంలో ప్రతి భారతీయుడు ఒక సైనికుడే.గల్లీ నుంచి దిల్లీ వరకు ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ పాటిస్తున్నారు. కోవిడ్-19పై సమరంలో దేశమంతా ఒక్కతాటిపై నిలబడి పోరాటం చేస్తోంది.
- కరోనావైరస్ కారణంగా కొన్ని సానుకూల మార్పులు కూడా సంభవించాయి.
- ఒకప్పుడు మాస్క్ వేసుకుంటే రోగిగా భావించే వారు. కానీ, ఇకపై మాస్కులు మన జీవితంలో ఒక భాగం. తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలి.
- ఈ అక్షయ తృతీయ రోజు మనం మన చుట్టూ ఉన్న పర్యావరణం గురించి మనం ఆలోచించాలి. టువంటి విపత్కాలంలో మనం చేసే చిన్న సాయం కూడా ఎంతో విలువైనదే.
మనం యుద్ధం మధ్యలో ఉన్నామని చెప్పిన మోదీ, "భవిష్యత్తులో ఎప్పుడైనా కరోనా మహమ్మారిపై పోరాటం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు కచ్చితంగా భారత ప్రజలు చేసిన పోరాటం చర్చకు వస్తుంది" అని అన్నారు.